Rs.2000 Note Withdrawal: రూ. 2000 నోటు ఉపసంహరణ మంచిదే.. జీడీపీ వృద్ధిని పెంచవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.2000 Note Withdrawal: రూ.2000 నోటు ఉపసంహరణ నిర్ణయం, దానికి వస్తున్న ఇప్పటి వరకు వచ్చిన ప్రతిస్పందన చూస్తే 2024 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిని మరింతగా పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఆర్బీఐ అంచనా వేసిన 6.5 శాతం వృద్ధిని మించి పెరిగేందుకు సహాయపడుతుందని ఒక నివేదిక తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికానికి వాస్తవికి జీడీపీ వృద్ధి 8.1 శాతానికి చేరొచ్చని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ వెల్లడించినట్లు 85 శాతం నోట్లు డిపాజిట్ రూపంలో బ్యాంకులకు చేరాయని, 15 శాతం నోట్లు బ్యాంక్ల వద్ద మార్చుకోవచ్చని ఎస్బీఐ చెప్పింది.
ఈ గణాంకాల ప్రకారం.. రూ.55,000 కోట్ల వినియోగం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. సుమారు రూ. 3.08 లక్షల కోట్లు డిపాజిట్ల రూపంలో ఆర్థిక వ్యవస్థలోకి రానున్నాయని, ఇందులో రూ. 92,000 కోట్లు పొదుపు రూపంలో బ్యాంకు ఖాతాల్లోకి చేరాయని ఎస్బీఐ తెలిపింది. ఇందులో 60 శాతం నిధుల్ని ఉపసంహరించుకునే అవకాశం ఉండటంతో రూ. 55,000 కోట్ల వినియోగం వెనువెంటనే పెరుగొచ్చని తెలిపింది. దీర్ఘకాలంలో ఇది రూ.1.83 లక్షల కోట్లకు చేరొచ్చని పేర్కొంది. రూ.2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం ద్వారా వినియోగ గిరాకీ పెరగడం ప్రధాన ప్రయోజనమని ఎస్బీఐ తెలిపింది.
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
Read Also: Upasana-Ram Charan: పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన..మెగా ఇంట సంబరాలు..
అధిక విలువ మొత్తాలు బంగారం, ఆభరణాలు, ఏసీలు, మొబైల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్ వంటి హై-ఎండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ వంటివాటిపై ఎక్కువగా ఖర్చు చేయొచ్చని అంచనా వేసింది. ఇంధన చెల్లింపులు, క్యాష్ ఆన్ డెలివరీల పెరుగుతుందని తెలిపింది. జొమాటో వంటి ఫుడ్ డెలివరీల్లో మూడో వంతు వినియోగదారులు రూ. 2000 నోట్లతో నగదు చెల్లింపుల చేయడాన్ని ఉదహరించింది.
దేవాలయాలు, ఇతర మత సంస్థలకు రూ.2000 నోట్ల ద్వారా విరాళాలను పెంచుతుందని, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మరియు బోటిక్ ఫర్నిచర్ వంటి అనేక రకాల కొనుగోళ్లను పెంచుతుందని భావిస్తున్నారు. ఆర్బీఐ రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)కి కూడా రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రయోజనం కలిగిస్తుంది, అధిక విలువ కలిగిన నోట్లు లేకపోతే మర్చంట్ లావాదేవీలకు ఈ రూపీ వినియోగం పెరుగుతుందని నివేదిక తెలిపింది.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..