Rs.2000 Note Withdrawal: రూ. 2000 నోటు ఉపసంహరణ మంచిదే.. జీడీపీ వృద్ధిని పెంచవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.2000 Note Withdrawal: రూ.2000 నోటు ఉపసంహరణ నిర్ణయం, దానికి వస్తున్న ఇప్పటి వరకు వచ్చిన ప్రతిస్పందన చూస్తే 2024 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిని మరింతగా పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఆర్బీఐ అంచనా వేసిన 6.5 శాతం వృద్ధిని మించి పెరిగేందుకు సహాయపడుతుందని ఒక నివేదిక తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికానికి వాస్తవికి జీడీపీ వృద్ధి 8.1 శాతానికి చేరొచ్చని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ వెల్లడించినట్లు 85 శాతం నోట్లు డిపాజిట్ రూపంలో బ్యాంకులకు చేరాయని, 15 శాతం నోట్లు బ్యాంక్ల వద్ద మార్చుకోవచ్చని ఎస్బీఐ చెప్పింది.
ఈ గణాంకాల ప్రకారం.. రూ.55,000 కోట్ల వినియోగం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. సుమారు రూ. 3.08 లక్షల కోట్లు డిపాజిట్ల రూపంలో ఆర్థిక వ్యవస్థలోకి రానున్నాయని, ఇందులో రూ. 92,000 కోట్లు పొదుపు రూపంలో బ్యాంకు ఖాతాల్లోకి చేరాయని ఎస్బీఐ తెలిపింది. ఇందులో 60 శాతం నిధుల్ని ఉపసంహరించుకునే అవకాశం ఉండటంతో రూ. 55,000 కోట్ల వినియోగం వెనువెంటనే పెరుగొచ్చని తెలిపింది. దీర్ఘకాలంలో ఇది రూ.1.83 లక్షల కోట్లకు చేరొచ్చని పేర్కొంది. రూ.2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం ద్వారా వినియోగ గిరాకీ పెరగడం ప్రధాన ప్రయోజనమని ఎస్బీఐ తెలిపింది.
Also Read
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
Read Also: Upasana-Ram Charan: పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన..మెగా ఇంట సంబరాలు..
అధిక విలువ మొత్తాలు బంగారం, ఆభరణాలు, ఏసీలు, మొబైల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్ వంటి హై-ఎండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ వంటివాటిపై ఎక్కువగా ఖర్చు చేయొచ్చని అంచనా వేసింది. ఇంధన చెల్లింపులు, క్యాష్ ఆన్ డెలివరీల పెరుగుతుందని తెలిపింది. జొమాటో వంటి ఫుడ్ డెలివరీల్లో మూడో వంతు వినియోగదారులు రూ. 2000 నోట్లతో నగదు చెల్లింపుల చేయడాన్ని ఉదహరించింది.
దేవాలయాలు, ఇతర మత సంస్థలకు రూ.2000 నోట్ల ద్వారా విరాళాలను పెంచుతుందని, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మరియు బోటిక్ ఫర్నిచర్ వంటి అనేక రకాల కొనుగోళ్లను పెంచుతుందని భావిస్తున్నారు. ఆర్బీఐ రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)కి కూడా రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రయోజనం కలిగిస్తుంది, అధిక విలువ కలిగిన నోట్లు లేకపోతే మర్చంట్ లావాదేవీలకు ఈ రూపీ వినియోగం పెరుగుతుందని నివేదిక తెలిపింది.
తాజావార్తలు
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!