12 Cheetahs: భారత్కు మరో 12 చీతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
12 Cheetahs: భారత్లో 1948లో అంతరించిపోయిన చీతాలను మళ్లీ పెంచేందుకు .. మోడీ సర్కార్ నడుంబిగించింది. నమీబియా నుంచి దాదాపు పదేళ్లపాటు .. ఏటా 12 చీతాలను తీసుకొచ్చి అడవుల్లో వదిలేయాలని భావిస్తోంది. ఇందులో బాగంగా నమీబియా నుంచి ఇవాళ 12 చీతాలు భారత్కు రానున్నాయి. చీతాలను తెచ్చాక వాటిని ఉంచేందుకు .. మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కులో.. 10 క్వారంటైన్ ఎన్క్లోజర్లను సిద్ధంచేశారు. ఈసారి ఏడు మగ, ఐదు ఆడ చీతాలను తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి ఇప్పటికే 8 చీతాలను తెప్పించింది. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఎన్క్లోజర్లో ఉంచారు. అక్కడి వాతావరణానికి అవి అలవాటు పడ్డాక వాటిని బయటకు వదులుతున్నారు. ప్రస్తుతం ఈ 8 చీతాలు ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పుడు మరో 12 చీతాలను సౌతాఫ్రికా నుంచి వస్తున్నాయి.
Read Also: Maha Shivaratri 2023: శివయ్య భక్తులకు గుడ్న్యూస్.. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
సౌతాఫ్రికా, నమీబియా, బోత్స్వానాలో దాదాపు 7 వేల చీతాలున్నాయ్. ఇందులో నమీబియాలోనే అత్యధికంగా చీతాలున్నాయి. భారత్లో చీతాలు పూర్తిగా అంతరించిపోవడంతో అక్కడి నుంచి తెప్పిస్తోంది కేంద్రం ప్రభుత్వం. 1948లో చివరిసారి భారత్లో.. ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలో సల్ అడవుల్లో కనిపించింది. అప్పటి నుంచి ఏటా 12 చీతాలను దేవానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పదేళ్ల పాటు ఇదే కొనసాగుతుందని కేంద్రం తెలిపింది. నమీబియా నుంచి వచ్చిన చీతాలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో సంరక్షిస్తున్నారు. ఇందుకోసం కేంద్రం.. 9 మంది సభ్యులతో టాస్క్ఫోర్స్ని నియమించింది. చీతాలను సరైన విధంగా సంరక్షించుకునే బాధ్యతల్ని…ఈ టాస్క్ఫోర్స్ తీసుకుంది. చీతాల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం, క్వారంటైన్లో ఎలా ఉంటున్నాయో పరిశీలించడం, చీతాలకు అనుకూలమైన వాతావరణం సృష్టించటం లాంటివి చేస్తున్నారు.
Read Also: Flyovers Shutdown: నేడే మహా శివరాత్రి, షబ్ ఈ మేరజ్.. నగరంలోని ఫ్లై ఓవర్లు బంద్
దక్షిణాఫ్రికా నుండి పన్నెండు చిరుతలు నమీబియా నుండి ఎనిమిది పెద్ద పిల్లులను రవాణా చేసిన నెలల తర్వాత ఈ రోజు మధ్యప్రదేశ్కు చేరుకున్నాయి. చిరుతలను తీసుకెళ్తున్న విమానం ఉదయం 10 గంటలకు గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద దిగింది. ఇప్పుడు వారిని హెలికాప్టర్లలో కునో నేషనల్ పార్క్కు తీసుకువెళ్లనున్నారు. పెద్ద పిల్లుల కోసం రిజర్వ్లో 10 క్వారంటైన్ ఎన్క్లోజర్లు సృష్టించినట్లు అధికారులు తెలిపారు. భారతీయ వన్యప్రాణుల చట్టాల ప్రకారం, దేశంలోకి వచ్చిన తర్వాత జంతువులను 30 రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచాలి. గతేడాది సెప్టెంబర్లో నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారత్కు తీసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పుట్టినరోజు సెప్టెంబర్ 17న కునో నేషనల్ పార్క్కు పెద్ద పిల్లులను విడుదల చేశారు. ఎనిమిది నమీబియా చిరుతలు ఇప్పుడు వేటాడే ఆవరణలో ఉన్నాయి – అవి ఒకదానితో ఒకటి సంకర్షణ చెందగల ఆరు చదరపు కి.మీ-ప్రాంతం – మరియు త్వరలో అడవిలోకి విడుదల చేయబడతాయి. దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలను తరలించడం అనేది కేంద్రం ద్వారా ఆలోచన చేయబడిన మూడు సంవత్సరాల తర్వాత వచ్చింది – ఇది దేశంలోని పెద్ద పిల్లులను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో ప్రపంచంలోని మొట్టమొదటి ఖండాంతర ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్. చివరి చిరుత 1947లో భారతదేశంలో మరణించింది మరియు 1952లో దేశం నుండి ఈ జాతి అంతరించిపోయినట్లు ప్రకటించబడింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!