12 Cheetahs: భారత్కు మరో 12 చీతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
12 Cheetahs: భారత్లో 1948లో అంతరించిపోయిన చీతాలను మళ్లీ పెంచేందుకు .. మోడీ సర్కార్ నడుంబిగించింది. నమీబియా నుంచి దాదాపు పదేళ్లపాటు .. ఏటా 12 చీతాలను తీసుకొచ్చి అడవుల్లో వదిలేయాలని భావిస్తోంది. ఇందులో బాగంగా నమీబియా నుంచి ఇవాళ 12 చీతాలు భారత్కు రానున్నాయి. చీతాలను తెచ్చాక వాటిని ఉంచేందుకు .. మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కులో.. 10 క్వారంటైన్ ఎన్క్లోజర్లను సిద్ధంచేశారు. ఈసారి ఏడు మగ, ఐదు ఆడ చీతాలను తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి ఇప్పటికే 8 చీతాలను తెప్పించింది. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఎన్క్లోజర్లో ఉంచారు. అక్కడి వాతావరణానికి అవి అలవాటు పడ్డాక వాటిని బయటకు వదులుతున్నారు. ప్రస్తుతం ఈ 8 చీతాలు ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పుడు మరో 12 చీతాలను సౌతాఫ్రికా నుంచి వస్తున్నాయి.
Read Also: Maha Shivaratri 2023: శివయ్య భక్తులకు గుడ్న్యూస్.. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
సౌతాఫ్రికా, నమీబియా, బోత్స్వానాలో దాదాపు 7 వేల చీతాలున్నాయ్. ఇందులో నమీబియాలోనే అత్యధికంగా చీతాలున్నాయి. భారత్లో చీతాలు పూర్తిగా అంతరించిపోవడంతో అక్కడి నుంచి తెప్పిస్తోంది కేంద్రం ప్రభుత్వం. 1948లో చివరిసారి భారత్లో.. ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలో సల్ అడవుల్లో కనిపించింది. అప్పటి నుంచి ఏటా 12 చీతాలను దేవానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పదేళ్ల పాటు ఇదే కొనసాగుతుందని కేంద్రం తెలిపింది. నమీబియా నుంచి వచ్చిన చీతాలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో సంరక్షిస్తున్నారు. ఇందుకోసం కేంద్రం.. 9 మంది సభ్యులతో టాస్క్ఫోర్స్ని నియమించింది. చీతాలను సరైన విధంగా సంరక్షించుకునే బాధ్యతల్ని…ఈ టాస్క్ఫోర్స్ తీసుకుంది. చీతాల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం, క్వారంటైన్లో ఎలా ఉంటున్నాయో పరిశీలించడం, చీతాలకు అనుకూలమైన వాతావరణం సృష్టించటం లాంటివి చేస్తున్నారు.
Read Also: Flyovers Shutdown: నేడే మహా శివరాత్రి, షబ్ ఈ మేరజ్.. నగరంలోని ఫ్లై ఓవర్లు బంద్
దక్షిణాఫ్రికా నుండి పన్నెండు చిరుతలు నమీబియా నుండి ఎనిమిది పెద్ద పిల్లులను రవాణా చేసిన నెలల తర్వాత ఈ రోజు మధ్యప్రదేశ్కు చేరుకున్నాయి. చిరుతలను తీసుకెళ్తున్న విమానం ఉదయం 10 గంటలకు గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద దిగింది. ఇప్పుడు వారిని హెలికాప్టర్లలో కునో నేషనల్ పార్క్కు తీసుకువెళ్లనున్నారు. పెద్ద పిల్లుల కోసం రిజర్వ్లో 10 క్వారంటైన్ ఎన్క్లోజర్లు సృష్టించినట్లు అధికారులు తెలిపారు. భారతీయ వన్యప్రాణుల చట్టాల ప్రకారం, దేశంలోకి వచ్చిన తర్వాత జంతువులను 30 రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచాలి. గతేడాది సెప్టెంబర్లో నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారత్కు తీసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పుట్టినరోజు సెప్టెంబర్ 17న కునో నేషనల్ పార్క్కు పెద్ద పిల్లులను విడుదల చేశారు. ఎనిమిది నమీబియా చిరుతలు ఇప్పుడు వేటాడే ఆవరణలో ఉన్నాయి – అవి ఒకదానితో ఒకటి సంకర్షణ చెందగల ఆరు చదరపు కి.మీ-ప్రాంతం – మరియు త్వరలో అడవిలోకి విడుదల చేయబడతాయి. దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలను తరలించడం అనేది కేంద్రం ద్వారా ఆలోచన చేయబడిన మూడు సంవత్సరాల తర్వాత వచ్చింది – ఇది దేశంలోని పెద్ద పిల్లులను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో ప్రపంచంలోని మొట్టమొదటి ఖండాంతర ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్. చివరి చిరుత 1947లో భారతదేశంలో మరణించింది మరియు 1952లో దేశం నుండి ఈ జాతి అంతరించిపోయినట్లు ప్రకటించబడింది.
తాజావార్తలు
-
Yamaha YZF-R2: R15 కంటే మరింత పవర్ఫుల్! 26.1bhp పవర్తో కొత్త Yamaha YZF-R2 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
-
China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్లో మరోసారి వరద భయం!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!