వరద బాధితులకు ఆహార పంపిణీ కోసం రంగంలోకి దిగాయి హెలికాఫ్టర్లు. ప్రస్తుతం రెండు హెలికాఫ్టర్ల ద్వారా బుడమేరు ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహారం అందిస్తున్నాయి ఎన్టీఆర్ఎఫ్ బృందాలు.. ఇప్పటి వరకు 3 టన్నులకు పైగా ఆహారం, నీళ్లు బాధితులకు అందజేశారు.. బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, బ్రెడ్, ఫ్రూట్ జ్యూస్, టెట్రాప్యాక్స్, ఇతర ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు.
MV Maersk Frankfurt Ship Fire: అరేబియా సముద్రంలో కార్గో షిప్ మార్స్క్ ఫ్రాంక్ఫర్ట్లో మంటలను ఆర్పే పని ఆరో రోజు కూడా కొనసాగింది. వాతావరణ పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ సముద్రంలో కార్గో షిప్లో మంటలను అదుపు చేసేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) నిరంతరం శ్రమిస్తోంది.
అపాచీ గర్జనకు శత్రువులు వణికిపోతారు, సైన్యం బలం పెరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో అపాచీ హెలికాప్టర్ల తొలి స్క్వాడ్రన్ రాజస్థాన్లోని జోధ్పూర్లో భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. పశ్చిమ ప్రాంతంలో భూసేకరణ చేసేందుకు స్క్వాడ్రన్ సహకరిస్తుందని అధికారులు తెలిపారు.
Tirumala: తిరుమల కొండలపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంతో కలకలం రేగింది.. నో ప్లై జోన్ అయిన తిరుమల కొండల మీదుగా ఓకేసారి మూడు హెలికాప్టర్లు వెళ్లడం చర్చగా మారింది.. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి సమీప ప్రాంతం మీదుగా హెలికాప్టర్లు వెళ్లడాన్ని అధికారులు గుర్తించారు.. ఈ దృశ్యాలను తిరుమలలోని భక్తులు కూడా వీక్షించారు.. నో ప్లై జోన్లో.. అది కూడా ఒకేసారి మూడు హెలికాప్టర్లు వెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే, ఆ మూడు హెలికాప్టర్లు కూడా ఎయిర్ఫోర్స్…
12 Cheetahs: భారత్లో 1948లో అంతరించిపోయిన చీతాలను మళ్లీ పెంచేందుకు .. మోడీ సర్కార్ నడుంబిగించింది. నమీబియా నుంచి దాదాపు పదేళ్లపాటు .. ఏటా 12 చీతాలను తీసుకొచ్చి అడవుల్లో వదిలేయాలని భావిస్తోంది. ఇందులో బాగంగా నమీబియా నుంచి ఇవాళ 12 చీతాలు భారత్కు రానున్నాయి. చీతాలను తెచ్చాక వాటిని ఉంచేందుకు .. మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కులో.. 10 క్వారంటైన్ ఎన్క్లోజర్లను సిద్ధంచేశారు. ఈసారి ఏడు మగ, ఐదు ఆడ చీతాలను తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం…