Prabhas: వి మిస్ యూ.. పునీత్ను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాదిలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్లలో ఒకటైన “జేమ్స్” చిత్రంతో దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ చివరిసారిగా బిగ్ స్క్రీన్పై కనిపించనున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం “జేమ్స్” మూవీ టీజర్ను మేకర్స్ నిన్న ఆవిష్కరించారు. ఇందులో పునీత్ యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్తో ఆయన అభిమానులకు అద్భుతమైన విజువల్ ట్రీట్ అందించారు మేకర్స్. ఇక ఈ సందర్భంగా ప్రభాస్ సోషల్ మీడియాలో పునీత్ ను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
Read Also : AdiPurush : ఫారెస్ట్ సీక్వెన్స్ కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు
Also Read
ప్రభాస్ తన సోషల్ మీడియాలో పునీత్ పోస్టర్ను ఎమోషనల్ నోట్తో పంచుకున్నాడు. “మేము జేమ్స్ రూపంలో ఒక అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నామని అనుకుంటున్నాను. పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ సర్ని అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాము!” అంటూ ప్రభాస్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘జేమ్స్’ మూవీ మార్చి 17న విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” మార్చి 11న విడుదల కానుంది.

తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..