‘అద్భుత దీపం’ కోసం సాహసం చేయరా డింభకా అంటున్న ఓంకార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిల్డ్రన్ అడ్వంచరస్ టీవీ ప్రోగ్రామ్ ‘మాయా ద్వీపం’ను ఎవరూ అంత తేలికగా మర్చిపోరు! ప్రముఖ యాంకర్ ఓంకార్ నిర్మాతగా మారింది ఆ షో తోనే! ఏడేళ్ళ అనంతరం ఆ షో మరోసారి జీ తెలుగులో సరికొత్త సాంకేతిక ప్రమాణాలతో ప్రసారం కాబోతోంది. ఎప్పటిలానే ప్రతి వారం నలుగురు కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొంటారు. ఓంకార్ తో పాటు పిల్లమర్రి రాజు, ఒంటికన్ను రాక్షసుడు కూడా ఈ షోలో కీలక పాత్రలు పోషించబోతున్నారు.
ఈ తాజా షో కోసం వైవిధ్యమైన ‘మాయా ద్వీపం’ సెట్ ను వేశారు. దీని గురించి ఓంకార్ మాట్లాడుతూ, ”వందమంది టెక్నీషియన్స్ టీమ్ యాభై రోజుల పాటు రాత్రి పగలు కష్టపడి ఈ సెట్ ను నిర్మించారు. ‘మాయా ద్వీపం’ అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో 6 నుండి 12 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు పాల్గొనబోతున్నారు. ఆడిషన్స్ ప్రకటన రాగానే 12 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయంటే ఈ షో మీద వీక్షకులలో ఉన్న క్రేజ్ ఏమిటనేది అర్థమౌతుంది. దానిని దృష్టిలో పెట్టుకునే ఆసక్తికరంగా దీన్ని డిజైన్ చేశాం. అక్టోబర్ 3న తొలి ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది” అని చెప్పారు. మరి ‘మాయాద్వీపం’లోకి ప్రవేశించి, అద్భుత దీపంను సొంతం చేసుకునే వారు ఎవరో వేచి చూడాలి.
Also Read


తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..