‘అద్భుత దీపం’ కోసం సాహసం చేయరా డింభకా అంటున్న ఓంకార్!
చిల్డ్రన్ అడ్వంచరస్ టీవీ ప్రోగ్రామ్ ‘మాయా ద్వీపం’ను ఎవరూ అంత తేలికగా మర్చిపోరు! ప్రముఖ యాంకర్ ఓంకార్ నిర్మాతగా మారింది ఆ షో తోనే! ఏడేళ్ళ అనంతరం ఆ షో మరోసారి జీ తెలుగులో సరికొత్త సాంకేతిక ప్రమాణాలతో ప్రసారం కాబోతోంది. ఎప్పటిలానే ప్రతి వారం నలుగురు కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొంటారు. ఓంకార్ తో పాటు పిల్లమర్రి రాజు, ఒంటికన్ను రాక్షసుడు కూడా ఈ షోలో కీలక పాత్రలు పోషించబోతున్నారు.
ఈ తాజా షో కోసం వైవిధ్యమైన ‘మాయా ద్వీపం’ సెట్ ను వేశారు. దీని గురించి ఓంకార్ మాట్లాడుతూ, ”వందమంది టెక్నీషియన్స్ టీమ్ యాభై రోజుల పాటు రాత్రి పగలు కష్టపడి ఈ సెట్ ను నిర్మించారు. ‘మాయా ద్వీపం’ అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో 6 నుండి 12 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు పాల్గొనబోతున్నారు. ఆడిషన్స్ ప్రకటన రాగానే 12 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయంటే ఈ షో మీద వీక్షకులలో ఉన్న క్రేజ్ ఏమిటనేది అర్థమౌతుంది. దానిని దృష్టిలో పెట్టుకునే ఆసక్తికరంగా దీన్ని డిజైన్ చేశాం. అక్టోబర్ 3న తొలి ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది” అని చెప్పారు. మరి ‘మాయాద్వీపం’లోకి ప్రవేశించి, అద్భుత దీపంను సొంతం చేసుకునే వారు ఎవరో వేచి చూడాలి.
Also Read


తాజావార్తలు
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!