Acharya: అతిథి పాత్ర చరణ్ దా?.. లేక మెగాస్టార్ దా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆచార్య.. మెగా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక నిన్నటికి నిన్న ఆచార్య ట్రైలర్ రిలీజ్ అయ్యి రికార్డుల ప్రభంజనం సృష్టిస్తున్న విషయం విదితమే. మెగా ఫ్యాన్స్ ఆచార్య నుంచి ఎలాంటి అంశాలని అయితే కోరుకుంటున్నారో అదే తరహా ఎమోషన్ యాక్షన్ అంశాలతో ట్రైలర్ ని కట్ చేశాడు కొరటాల .. నిజం చెప్పాలంటే ఈ ట్రైలర్ ను ఏమైనా బోయపాటి శ్రీను కట్ చేశాడా ..? ట్రైలర్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో నింపేసి గూస్ బంప్స్ తెప్పించేశారు అని మెగా అభిమానులు డౌట్ పడుతున్నారు.
ఇక ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ ట్రైలర్ గురించి ఒక పోల్ నడుస్తోంది. అదేంటంటే.. ఆచార్యలో అతిథి పాత్ర చరణ్ దా? .. లేక మెగాస్టార్ దా? అని.. ట్రైలర్ ని చూసిన ప్రతి ఒక్కరికి ఇదే అనుమానం వస్తుంది. కొరటాల.. చిరుకు కథ వినిపించినప్పుడు చరణ్ ఒక గెస్ట్ రోల్ లో కనిపిస్తే బావుంటుంది అని చెప్పడం, వెంటనే చిరు ఒప్పుకోవడం జరిగిపోయాయి. ఇక ఆ తరువాత కొరటాల సిద్ద పాత్ర గెస్ట్ రోల్ గా కాకుండా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో మహా అయితే చరణ్ కనిపించినా ఒక 15 నిముషాలు.. లేక ఒక 25 నిముషాలు కనిపిస్తాడు అనే లెక్కలోనే ఉన్నారు.
Also Read
- Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
- Anupama Parameswaran: బ్రేకప్ గురించి ఫస్ట్ టైం మాట్లాడిన అనుపమ.. ఆ రిలేషన్షిప్ ఎంతో బాధించిందట!
- Shakeela: ఫోన్ అతిగా చూసే రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్నా.. షకీలా షాకింగ్ హెచ్చరిక!
- I Am Game Release Date: ఆగస్టు 20 కాదు… దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్
ఇక ట్రైలర్ చూస్తే మొదటి నుంచి చివర వరకు చరణ్ మాత్రమే కనిపించాడు. చిరునే గెస్ట్ రోల్ చేస్తున్నట్లు కనిపించాడు. దీంతో ఈ కథపై కొత్త కొత్త కథనాలు రైజ్ అవుతున్నాయి.. కొరటాల తండ్రికొడుకులతో మల్టీస్టారర్ తీసినట్టుంది.. ఫస్ట్ హాఫ్ మొత్తం చరణ్ ఉంటాడు.. మధ్యలో సోనూసూద్ చరణ్ ను చంపేస్తే.. అతను ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి చిరు రంగంలోకి దిగుతాడు.. వీరిద్దరికి ప్లాష్ బ్యాక్ ఉంటుంది.. అడవుల్లో వీరిద్దరూ గురు శిష్యులు అని క్లైమాక్స్ లో రివీల్ చేస్తారని కొత్త కథను చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడాలంటే ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
-
Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్పై కేంద్రానికి కీలక ఆదేశాలు
-
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!