Acharya: అతిథి పాత్ర చరణ్ దా?.. లేక మెగాస్టార్ దా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆచార్య.. మెగా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక నిన్నటికి నిన్న ఆచార్య ట్రైలర్ రిలీజ్ అయ్యి రికార్డుల ప్రభంజనం సృష్టిస్తున్న విషయం విదితమే. మెగా ఫ్యాన్స్ ఆచార్య నుంచి ఎలాంటి అంశాలని అయితే కోరుకుంటున్నారో అదే తరహా ఎమోషన్ యాక్షన్ అంశాలతో ట్రైలర్ ని కట్ చేశాడు కొరటాల .. నిజం చెప్పాలంటే ఈ ట్రైలర్ ను ఏమైనా బోయపాటి శ్రీను కట్ చేశాడా ..? ట్రైలర్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో నింపేసి గూస్ బంప్స్ తెప్పించేశారు అని మెగా అభిమానులు డౌట్ పడుతున్నారు.
ఇక ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ ట్రైలర్ గురించి ఒక పోల్ నడుస్తోంది. అదేంటంటే.. ఆచార్యలో అతిథి పాత్ర చరణ్ దా? .. లేక మెగాస్టార్ దా? అని.. ట్రైలర్ ని చూసిన ప్రతి ఒక్కరికి ఇదే అనుమానం వస్తుంది. కొరటాల.. చిరుకు కథ వినిపించినప్పుడు చరణ్ ఒక గెస్ట్ రోల్ లో కనిపిస్తే బావుంటుంది అని చెప్పడం, వెంటనే చిరు ఒప్పుకోవడం జరిగిపోయాయి. ఇక ఆ తరువాత కొరటాల సిద్ద పాత్ర గెస్ట్ రోల్ గా కాకుండా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో మహా అయితే చరణ్ కనిపించినా ఒక 15 నిముషాలు.. లేక ఒక 25 నిముషాలు కనిపిస్తాడు అనే లెక్కలోనే ఉన్నారు.
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
ఇక ట్రైలర్ చూస్తే మొదటి నుంచి చివర వరకు చరణ్ మాత్రమే కనిపించాడు. చిరునే గెస్ట్ రోల్ చేస్తున్నట్లు కనిపించాడు. దీంతో ఈ కథపై కొత్త కొత్త కథనాలు రైజ్ అవుతున్నాయి.. కొరటాల తండ్రికొడుకులతో మల్టీస్టారర్ తీసినట్టుంది.. ఫస్ట్ హాఫ్ మొత్తం చరణ్ ఉంటాడు.. మధ్యలో సోనూసూద్ చరణ్ ను చంపేస్తే.. అతను ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి చిరు రంగంలోకి దిగుతాడు.. వీరిద్దరికి ప్లాష్ బ్యాక్ ఉంటుంది.. అడవుల్లో వీరిద్దరూ గురు శిష్యులు అని క్లైమాక్స్ లో రివీల్ చేస్తారని కొత్త కథను చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడాలంటే ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!