“ప్రతిరోజు పండగే” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ “రిపబ్లిక్”. ఈ పొలిటికల్ థ్రిల్లర్ నుంచి తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లుక్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ సీనియర్ నటి రమ్య కృష్ణ తాజాగా “రిపబ్లిక్” నుండి ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. “కూలిపోతాం, కుంగిపోతాం, ఓడిపోతాం ! అయినా… నిలబడతాం, కోలుకుంటాం, గెలుస్తాం..” అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఐశ్వర్య రాజేష్ లుక్ తో పాటు ఉన్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో మైరా హాన్సన్ అనే పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.
Read Also : “అఖండ” రిలీజ్ డేట్ ఫిక్స్… యంగ్ హీరోకు షాక్
ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 1న గాంధీ జయంతి వారాంతంలో విడుదల కానుంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… జగపతి బాబు, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియన్ కాన్ స్టిట్యూషన్, కాలేజ్ పాలిటిక్స్, సివిల్ సర్వెంట్స్ హెల్ప్ లెస్ నెస్, న్యాయం లాంటి ప్రధానాంశాల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. మణిశర్మ సంగీతం అందించారు.