Ramayan: ‘రామాయణం’లో రణబీర్ కపూర్ పారితోషికం150 కోట్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని స్టార్ ఎవరో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayan: ఇండియన్ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘రామాయణం’. సుమారు రూ.4,800 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. అయితే రిలీజ్ కు ముందే ఈ మూవీ భారీ చర్చకు దారి తీస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, గ్రాండ్ స్కేల్తో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు ఈ సినిమా తారాగణం పారితోషికాలపై కూడా ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇందులో ఒక స్టార్ నటుడు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా చేసిన నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం రణబీర్ కపూర్ మొత్తం రూ.150 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఒక్కో భాగానికి రూ.75 కోట్లు అందుకుంటున్నారని సమాచారం.
అయితే ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట. తనకు ఎలాంటి పారితోషికం అవసరం లేదని నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెప్పినట్లు స్వయంగా వివేక్ వెల్లడించారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు రావాల్సిన మొత్తం పారితోషికాన్ని క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారుల చికిత్స కోసం విరాళంగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తాను ఈ సినిమాని ఒక సినిమా కోణంలో కాకుండా, భారతీయ సంస్కృతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే గొప్ప ప్రయత్నంగా భావిస్తున్నానని వివేక్ ఒబెరాయ్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ప్రాజెక్ట్లో భాగం కావడమే తనకు పెద్ద గౌరవమని, పారితోషికం కంటే సేవా కార్యక్రమానికి ఆ నిధులు వెళ్తే మరింత సంతోషంగా ఉంటుందని చెప్పారు.
Also Read
- Jana Nayagan: కావేరీ నీటిపై మళ్లీ ఉద్రిక్తత.. విజయ్ 'జన నాయగన్' స్క్రీనింగ్ను అడ్డుకున్న కార్యకర్తలు!
- Dharmakshetra: టాలీవుడ్లో సరికొత్త చరిత్ర: 30 రోజుల్లోనే భారతదేశపు తొలి ఏఐ ఇండిపెండెంట్ మూవీ "ధర్మక్షేత్ర" ముస్తాబు!
- Anna Konidela: మంచి మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ భార్య.. పుట్టినరోజు సందర్భంగా ఏం చేశారంటే!
- Tollywood : ఓవైపు గాయలు.. మరోవైపు షూటింగ్స్ బ్రేక్.. ఏమైంది మన టాలీవుడ్కి
నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 నవంబర్ 6న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగాన్ని 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ట్రైలర్కు మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, వివేక్ ఒబెరాయ్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
తాజావార్తలు
-
Ramayan: ‘రామాయణం’లో రణబీర్ కపూర్ పారితోషికం150 కోట్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని స్టార్ ఎవరో తెలుసా ?
-
Tecno 0mm Bezel Smartphone: స్క్రీన్ చుట్టూ బెజెల్స్ మాయం! 0mm డిస్ప్లే బోర్డర్తో టెక్నో కొత్త కాన్సెప్ట్ ఫోన్
-
RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Trump Immigration: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎంత మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారంటే!
-
NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!