Ramayan: ‘రామాయణం’లో రణబీర్ కపూర్ పారితోషికం150 కోట్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని స్టార్ ఎవరో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayan: ఇండియన్ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘రామాయణం’. సుమారు రూ.4,800 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. అయితే రిలీజ్ కు ముందే ఈ మూవీ భారీ చర్చకు దారి తీస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, గ్రాండ్ స్కేల్తో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు ఈ సినిమా తారాగణం పారితోషికాలపై కూడా ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇందులో ఒక స్టార్ నటుడు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా చేసిన నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం రణబీర్ కపూర్ మొత్తం రూ.150 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఒక్కో భాగానికి రూ.75 కోట్లు అందుకుంటున్నారని సమాచారం.
అయితే ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట. తనకు ఎలాంటి పారితోషికం అవసరం లేదని నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెప్పినట్లు స్వయంగా వివేక్ వెల్లడించారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు రావాల్సిన మొత్తం పారితోషికాన్ని క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారుల చికిత్స కోసం విరాళంగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తాను ఈ సినిమాని ఒక సినిమా కోణంలో కాకుండా, భారతీయ సంస్కృతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే గొప్ప ప్రయత్నంగా భావిస్తున్నానని వివేక్ ఒబెరాయ్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ప్రాజెక్ట్లో భాగం కావడమే తనకు పెద్ద గౌరవమని, పారితోషికం కంటే సేవా కార్యక్రమానికి ఆ నిధులు వెళ్తే మరింత సంతోషంగా ఉంటుందని చెప్పారు.
Also Read
- Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
- Tollywood: టాలీవుడ్ కు లాభాలే లాభాలు
- Chiranjeevi - Odela Movie Update: మెగాస్టార్ బర్త్డే స్పెషల్.. చిరు - ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
- Sukumar Universe: సుకుమార్ యూనివర్స్లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 నవంబర్ 6న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగాన్ని 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ట్రైలర్కు మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, వివేక్ ఒబెరాయ్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
తాజావార్తలు
-
Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
-
Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
-
Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
-
1984 Anti-Sikh Riots: “సజ్జన్ కుమార్ హీరోనా.?” రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సిక్కుల ఆందోళన..
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్లకు కీలక పరీక్ష..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!