Ramayan: ‘రామాయణం’లో రణబీర్ కపూర్ పారితోషికం150 కోట్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని స్టార్ ఎవరో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayan: ఇండియన్ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘రామాయణం’. సుమారు రూ.4,800 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. అయితే రిలీజ్ కు ముందే ఈ మూవీ భారీ చర్చకు దారి తీస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, గ్రాండ్ స్కేల్తో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు ఈ సినిమా తారాగణం పారితోషికాలపై కూడా ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇందులో ఒక స్టార్ నటుడు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా చేసిన నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం రణబీర్ కపూర్ మొత్తం రూ.150 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఒక్కో భాగానికి రూ.75 కోట్లు అందుకుంటున్నారని సమాచారం.
అయితే ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట. తనకు ఎలాంటి పారితోషికం అవసరం లేదని నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెప్పినట్లు స్వయంగా వివేక్ వెల్లడించారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు రావాల్సిన మొత్తం పారితోషికాన్ని క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారుల చికిత్స కోసం విరాళంగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తాను ఈ సినిమాని ఒక సినిమా కోణంలో కాకుండా, భారతీయ సంస్కృతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే గొప్ప ప్రయత్నంగా భావిస్తున్నానని వివేక్ ఒబెరాయ్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ప్రాజెక్ట్లో భాగం కావడమే తనకు పెద్ద గౌరవమని, పారితోషికం కంటే సేవా కార్యక్రమానికి ఆ నిధులు వెళ్తే మరింత సంతోషంగా ఉంటుందని చెప్పారు.
Also Read
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్కు అడుగు దూరంలో!
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 నవంబర్ 6న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగాన్ని 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ట్రైలర్కు మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, వివేక్ ఒబెరాయ్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
తాజావార్తలు
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్లో భారత్కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్ను క్లీన్స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..