Gollapudi Maruti Rao: గొల్లపూడి రెండు కళ్ళు.. రచన – నటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రచయితగా సాహితీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న గొల్లపూడి మారుతీరావు నటనలోనూ తన బాణీ పలికించారు. ఈ తరం వారికి గొల్లపూడి అనగానే ఓ సినిమా నటుడు అనే తెలిసి ఉండవచ్చు. కానీ, రచయితగా ఆయన కలం సాగిన తీరును గుర్తు చేసుకుంటే సాహిత్యాభిమానులకు ఈ నాటికీ పరవశం కలుగక మానదు. రచయితగా, కథకునిగా, నాటకరచయితగా, విలేఖరిగా, ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పత్రికారంగంలో పలు విన్యాసాలు చేసిన గొల్లపూడి మారుతీరావు కలం అన్నపూర్ణా వారి ‘డాక్టర్ చక్రవర్తి’ (1964)లో తొలిసారి సినిమా బాట పట్టింది.తరువాత గొల్లపూడి మాట తెలుగు సినిమాకు పలు విజయాల కోటలు కట్టింది.
గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరం జిల్లా నందబలగ గ్రామంలో జన్మించారు. కన్నవారు సాహితీప్రియులు కావడంతో చిన్నతనంలోనే గొల్లపూడికీ సాహిత్యం పట్ల మక్కువ కలిగింది. పదో క్లాస్ వచ్చే సరికే తెలుగు, ఇంగ్లిష్ భాషల్లోని పలు కావ్యాలను చదివేసి జ్ఞానం పెంచేసుకున్నారు మారుతీరావు. ఆంధ్ర యూనివర్సిటీలో బి.యస్సీ, మేథమేటిక్స్, ఫిజిక్స్ చదివారు. పలు పత్రికల్లో మారుతీరావు రచనలు ప్రచురితమయ్యాయి. ఆయన రాసిన కథలు, నాటకాలు కూడా జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. చిత్రసీమలో ప్రవేశించక మునుపు కొంతకాలం ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. ఢిల్లీలో ఆయన పనిచేస్తున్న రోజుల్లో ప్రముఖ సంపాదకులు, రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ రైల్వేస్ లో పనచేసేవారు. వారిద్దరి మధ్య ఎంతో స్నేహబంధం ఉండేది. ఆయన ప్రోత్సాహంతోనే గొల్లపూడి చిత్రసీమలో అడుగు పెట్టారు. మారుతీరావు ప్రోత్సాహంతో పురాణం పత్రికారంగంలో కాలు మోపారు.
Also Read
- Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
- Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
- Peddi: పెద్ది ట్రైలర్'పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
చిత్రసీమలో ఆదుర్తి సుబ్బారావు వద్ద చేరారు. ఆయన దర్శకత్వంలో అన్నపూర్ణ సంస్థ ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రం తెరకెక్కించింది. కౌసల్యాదేవి రచనకు సినిమా అనుకరణ చేస్తూ గొల్లపూడి కలం సాగింది. ఆపై పలు చిత్రాలకు రచనలో చమక్కులు పలికిస్తూ సాగారు గొల్లపూడి. కె.విశ్వనాథ్ తొలి చిత్రం ‘ఆత్మగౌరవం’కు కూడా గొల్లపూడి సంభాషణలు పలికించారు. ముఖ్యంగా రీమేక్ సినిమాలకు గొల్లపూడి రచన ఓ దన్నుగా నిలచింది. “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, నేరం నాది కాదు ఆకలిది, ఇల్లాలు” వంటి హిట్ రీమేక్స్ కు గొల్లపూడి రచన ఓ కళ తెచ్చింది. ‘ఇంట్లో రామయ్య-వీధిలో క్రిష్ణయ్య’తో నటునిగా మారిన గొల్లపూడి అభినయంతోనూ ఆకట్టుకున్నారు.
దర్శకుడు కోడి రామకృష్ణ తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య -వీధిలో క్రిష్ణయ్య’తోనే గొల్లపూడి నటనాజీవితం మొదలయింది. దాంతో కోడి రామకృష్ణ తెరకెక్కించిన పలు చిత్రాలలో గొల్లపూడి కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ చిత్రాలలో గొల్లపూడి ముఖ్యపాత్రలు ధరించి, ఆకట్టుకున్నారు. ‘సంసారం ఒక చదరంగం’ చిత్రంలో గొల్లపూడి నటన జనాన్ని మరింతగా అలరించింది. నటనలో బిజీ అయిపోయిన గొల్లపూడి సినిమా రచనకు దూరంగా జరిగారు. అయినా పత్రికల్లో ఆయన రచనలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ ‘ప్రేమపుస్తకం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ప్రమాదంలో మరణించాడు. ఆ చిత్రం ద్వారానే నేటి తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, శ్రీకర్ అన్న పేరుతో పరిచయం అయ్యాడు. ఈ చిత్రాన్ని గొల్లపూడి పూర్తి చేశారు. తరువాత నుంచీ తన తనయుడు శ్రీనివాస్ పేరిట ఓ స్మారక పురస్కారం ఏర్పాటు చేసి, ఉత్తమ సినీ దర్శకులకు అవార్డు ప్రదానం చేస్తూ వచ్చారు. ఓపిక ఉన్నన్ని రోజులు నటన, రచన రెండింటిలోనూ సాగారు గొల్లపూడి. 2019 డిసెంబర్ 12న గొల్లపూడి మారుతీరావు తుదిశ్వాస విడిచారు. నేడు గొల్లపూడి లేరు. కానీ, ఆయన జ్ఞాపకాలు తెలుగువారిలో మదిలో సదా పదిలంగా ఉంటాయని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..