పాన్ ఇండియన్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో వార్ 2 చేస్తున్నాడు. ఈ సినిమాతో నార్త్ మార్కెట్ పై తన బ్రాండ్ వేద్దామనుకుంటే పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయట. త్రిబుల్ ఆర్, దేవరతో నార్త్ బెల్ట్ లో తనకంటూ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్. అయితే పాన్ ఇండియా చిత్రాలతో కాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ పై నేరుగా తన హవా చూపించేందుకు ప్రిపేరయ్యాడు. అందుకే బీటౌన్ తెరంగేట్రానికి సిద్దమయ్యాడు. హృతిక్ రోషన్ ని వార్ 2లో ఢీ కొట్టబోతున్నాడు తారక్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Also Read : Bollywood : హాలీవుడ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోలు
వార్ 2ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది యశ్ రాజ్ ఫిల్మ్స్. ఆగస్టు 14న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ఏడాది క్రితమే ఎనౌన్స్ చేశారు మేకర్స్. అయితే బాలీవుడ్ వర్గాల్లో కొత్త రూమర్ వినబడుతోంది. వార్ 2ను ఈ ఏడాది ఆగస్టులో తీసుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని టాక్. ఇంకా భారీ షెడ్యూల్ పూర్తి కావాల్సి ఉందని, దీనికి కొంత టైం పడుతుందని అందుకే అనుకున్న డేట్ కు సినిమా రాకపోవచ్చునని బజ్ నడుస్తోంది. నార్త్ బెల్ట్ లో తారక్ తెరంగేట్రాన్ని భారీగా సెలబ్రేట్ చేసుకొందామని వెయిట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ న్యూస్ ఇరిటేట్ చేస్తోంది. అటు ప్రశాంత్ నీల్ సినిమాను పట్టాలెక్కించేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతుంటే వార్ 2 షూటింగ్ లో పాల్గొనాల్సిన పరిస్థితని తెలుస్తోంది ఇదే ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ కూడా పెద్ద తలనొప్పి తెప్పిస్తోందట.