Vani Jayaram: వాణీ జయరాం పార్థివ దేహానికి పోస్టుమార్టం పూర్తి.. నుదుట మధ్య భాగంలో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vani Jayaram: ప్రముఖ నేపథ్య గాయని, మేటి గాయని వాణీ జయరామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. శనివారం నాడు వాణీ జయరాం చనిపోయినట్లు వార్తలు రావడంతో చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వంటమనిషి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే చనిపోయి ఉన్నారు. దీంతో పోలీసులు ఆమె పార్థివ దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒమేదురార్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, డాక్టర్లు పోస్టుమార్టం పూర్తి చేశారు. కాగా.. చెన్నైలోని ఫ్లాట్కు వాణీ జయరామ్ పార్థివదేహాన్ని తరలించారు. వాణి జయరాంను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు.
Read also: Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు
Also Read
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
- Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
ఆమెను చూసేందుకు అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు నగర అధికారులు. అయితే.. వాణీ జయరామ్ మృతిపై అభిమానులు, కుటుంబ సభ్యులకు అనేక అనుమానాలున్నాయి. ఈనేపథ్యంలో ఈ ఘటన ఓ మిస్టరీగా మారింది. వాణిజయరాం నుదురు, ముఖంపై గాయాలు ఉండటంతో అనుమానాలు మొదలయ్యాయి. కాగా.. ఇంట్లో ఉన్న గ్లాస్ టేబుల్ మీద పడటంతో ఆమెకు బలంగా గాయాలయ్యాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. పోస్టుమార్టం రిపోర్టు బయటికొస్తే వాణీ జయరామ్ ఎలా చనిపోయారు? కారణాలేంటి? అనే విషయాలు తేలిపోనున్నాయి. ఇక రిపోర్టు కోసం అటు అభిమానులు, ఇటు కుటుంబ సభ్యులు, బంధువులు వేచి చూస్తున్నారు. అధికారులు మరోవైపు వాణీ ఇంట్లో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. వాణిజయరాం అనుమానాస్పద మృతిగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాణిజయరాం ఇంటిని పోలీసులు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు.
అసలు ఏం జరిగింది?
వాణి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న మహిళ శనివారం కూడా వాణి జయరామ్ అపార్ట్మెంట్కు వెళ్లింది. లోపలికి వెళ్ళడానికి కాలింగ్ బెల్ నొక్కింది. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ మోగించినా తలుపు తీయలేదు. దీంతో ఆందోళన చెందిన పనిమనిషి వాణి జయరాం బంధువులకు సమాచారం అందించింది. బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, బంధువులు తలుపులు కొట్టడంతో అక్కడికి వెళ్లగా వారు సజీవదహనమయ్యారు. అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడంలేదు.
Peddagattu Jatara: దండాలయ్యా లింగమంతుల స్వామి.. పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!