Balakrishna: ఊహించని కాంబినేషన్.. బాలయ్య, రజనీ, శివకుమార్.. బాక్సాఫీస్ బద్దలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna: సౌతిండియాలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ప్రస్తుతం విపరీతంగా చర్చలో ఉన్న అంశం నందమూరి బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ. బాలయ్య బాబు చాలాకాలంగా మల్టీ స్టారర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా ఆయన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్తో కలిసి రెండు భాగాలుగా తెరకెక్కే భారీ ప్రాజెక్టు చేయనున్నట్లు ప్రచారం అవుతోంది. ఈ సినిమాను శివరాజ్ కుమార్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుందంటున్నారు. అందులో మొదటి దానిలో బాలయ్యతో పాటు శివరాజ్ కుమార్ కనిపిస్తారట. అలాగే సెకండ్ పార్టులో రజనీకాంత్తో కలిసి నటించనున్నారని తెలుస్తోంది. నటసింహంతో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించనున్నారని తెలిసింది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టు సంచలనంగా మారిపోయింది. ముగ్గురు బడా హీరోలు నటిస్తోన్న మల్టీస్టారర్ ప్రాజెక్టు గురించి వైరల్ అవుతుండడంతో దీనికి డైరెక్టర్ ఎవరని అంతా వెతకడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టుకు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన హర్ష దర్శకత్వం వహిస్తున్నారట.
Read Also: Sarathbabu : శరత్ బాబుకు తలకొరివి పెట్టేది ఎవరో తెలుసా ?
Also Read
- King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
- Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
- Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
- Yash’s Toxic: యశ్కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్టు చేసి ఆ తర్వాత దర్శకుడిగా మారిన హర్ష.. కన్నడంలో చాలా హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో వరుస శివరాజ్ కుమార్ హీరోగా ‘భజరంగీ 2’ ‘వేద’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆ సమయంలోనే ఈ మల్టీస్టారర్ కథను చెప్పడం.. ఆ తర్వాత రజినీకాంత్ బాలయ్యను ఒప్పించాడట. ఇక ఈ చిత్రంలో మొదటి భాగంలో శివరాజ్ పాత్ర హైలైట్ కాబోతుందట. క్లైమాక్స్ కు ముందు బాలయ్య ఎంట్రీ ఇస్తారని తెలిసింది. ఇక రెండో పార్టులో వీళ్లిద్దరూ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారంటున్నారు. ఇందులో సెకెండా పార్టులో రజినీకాంత్ పాత్ర ఎంట్రీ ఇస్తుందట. వీళ్లందరి స్క్రీన్ ప్రజెన్స్ను ఓ రేంజ్లో ఎలివేట్ చేసి చూపించబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. రజినీకాంత్ ఈ సినిమాకు డేట్స్ కేటాయించలేని పరిస్థితి ఉంటే.. కమల్ హాసన్ మమ్ముట్టి లేదా మోహన్ లాల్ వంటి వారిని తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Read Also:Guyana : స్కూల్ హాస్టల్లో ప్రమాదం.. 20 మంది పిల్లలు అగ్నికి ఆహుతి
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
-
Trump: ఇరాన్పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
-
Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడుల జోరు.. ఇన్వెస్ట్ తెలంగాణకు వార్ రూమ్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..