Tollywood : మైత్రీ మూవీస్ తో చేతులు కలిపిన బాలీవుడ్ నిర్మాణ సంస్థ..?
- టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ లో ఫుల్ గిరాకీ
- తెలుగు నిర్మాతలతో చేతులు కలుపుతున్న బాలీవుడ్ నిర్మాతలు
- పాన్ ఇండియా సినిమాలలో పెట్టుబడులు
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోన్న బ్యానర్ ఏదైనా ఉందంటే అది మైత్రీ మూవీ మేకర్స్. అల్లు అర్జున్ నటిసున్న మోస్ట్ అవైటెడ్ పుష్ప -2,రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాను నిర్మిస్తోంది కూడా మైత్రీ నిర్మాతలే. అలాగే కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకుడిగా జూనియర్ ఎన్టీయార్ తో చేస్తోన్న డ్రాగన్ ను కూడా మైత్రీ వాల్లే నిర్మిస్తున్నారు. ఇలా వరుస పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు అన్ని మైత్రీ చేతిలో ఉన్నాయి.
Also Read : OG : ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ షూట్ లో అడుగుపెట్టేది ఎప్పుడంటే..
Also Read
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా! ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులు?
- Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
- KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
- Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
తెలుగు సినిమాలు ఇప్పుడు హిందీలో అక్కడి స్టార్ హీరోల సినిమాలను దాటి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు తెలుగు స్టార్ హీరోల మీద కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తో చేతులు కలిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. T-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఇప్పటికే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డికి చెందిన భద్రకాళి ప్రోడాక్టన్స్ తో సంయుక్త నిర్మాణంలో ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు మైత్రీతో T-సిరీస్ లాంగ్ టర్మ్ ఒప్పదం చేసుకున్నట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ నిర్మించే గుడ్ బ్యాడ్ అగ్లీ లోను T-సిరీస్ భాగస్వామ్యంగా వ్యవహరించడంతో పాటు ఆడియో రైట్స్ ను కొనుగోలు చేసాడు భూషణ్ కుమార్. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను కూడా T-సిరీస్ నిర్మించింది .
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా! ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులు?
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!