Tharun Bhascker: విశ్వక్’ను పక్కన పెట్టి దేవరకొండతో తరుణ్ భాస్కర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లిచూపులు అనే సినిమాతో మంచి విజయం సాధించిన తరుణ్ భాస్కర్, ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది లాంటి మరో ఆకట్టుకునే సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. ఈ మధ్యలో కీడా కోలా అనే సినిమా చేశాడు, కానీ అంతకుముందే నటుడిగా మారిపోవడంతో బిజీగా గడిపేస్తున్నాడు. నిజానికి ఆయన జై జైహే అనే సినిమా రీమేక్లో హీరోగా నటిస్తున్నాడు. మరోపక్క, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కోసం ప్రేక్షకుల నుంచి డిమాండ్ బాగా రావడంతో, ఆయన ఆ సీక్వెల్ స్క్రిప్ట్పై కూర్చుని చాలా కాలం క్రితం పూర్తి చేశాడు.
Read More: Sri Vishnu : ఏకంగా 3 సినిమాలు లైన్ లో పెట్టిన యంగ్ హీరో..
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
అయితే, విశ్వక్ సేన్ వరుస పరాజయాలతో మార్కెట్లో దారుణమైన పరిస్థితిలో ఉండడంతో, ఆ సినిమాను పట్టాలెక్కించడం కాస్త ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో, తరుణ్ భాస్కర్ విశ్వక్ సేన్ను పక్కనపెట్టి, పెళ్లిచూపులు కాంబినేషన్ను మరోసారి సెట్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండకు స్క్రిప్ట్ చెప్పి ఒప్పించాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఈ సినిమాను నిర్మించబోతోంది.
Read More:Sree Vishnu – Samantha: శ్రీవిష్ణు, సమంత’లకు గోల్డెన్ ఛాన్స్
అయితే, తరుణ్ భాస్కర్ విశ్వక్ సేన్, విజయ్ దేవరకొండ ఇద్దరి కోసం ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశ్వక్ సేన్ కూడా తలసాని కుమారుడు నిర్మిస్తున్న సినిమాను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. కాబట్టి, ఆయన కూడా ఇప్పటికిప్పుడు ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ షూట్కు హాజరయ్యే పరిస్థితిలో లేడు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ అయితే బెటర్ అని ఆయన షిఫ్ట్ అయినట్లు చెబుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?