టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం అతని తల్లి చిట్టెమ్మ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు, నేడు బుధవారం తిరుపతి లోని పద్మావతి పురం ఎదురుగా ఉన్న శ్రీనివాసపురంలో చిట్టెమ్మ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు తిరుపతికి చిట్టెమ్మ భౌతికకాయాన్నికీ నివాళులర్పించడానికి సినీ ప్రముఖులు రానున్నారు..
Also Read: ‘Odela 2’ : ఓటీటీ పార్ట్నర్ లాక్ చేసుకున్న ‘ఓదెల 2’
ఇప్పటికే తన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న సప్తగిరి ప్రస్తుతం హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు.. ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ చిత్రాల్లో హీరోగా నటించగా. రీసెంట్ గా ‘పెళ్లి కాని ప్రసాద్’ అంటూ మరో చిత్రంలో లీడ్ రోల్ చేశాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర విశేషంగా ఆకట్టుకుంది. హాస్య నటులు హీరోలుగా నటించే చిత్రలపైన ప్రేక్షకులకి కొన్ని అంచనాలుంటాయి. ఫుల్ కామెడీ వుంటుందనే నమ్మకంతో వస్తారు. అనుకున్నట్లుగానే ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ తో పాటుగా సెంటిమెంట్ ని కూడా బాగా పండించాడు సప్తగిరి. ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు ఇందులో ప్రభాస్ ‘రాజాసాబ్’ కూడా ఒకటి.