టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న హర్రర్ అండ్ డివోషనల్ మూవీ ‘ఓదెల 2’. గతంలో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి ఇది సీక్వెల్గా వస్తోంది. ఇక ఈ సినిమాకు అశోక్ తేజ డైరెక్ట్ చేస్తుండగా.. డైరెక్టర్ సంపత్ నంది కథ అందిస్తున్నారు. ఏప్రిల్ 17 విడుదల కాబోతున్న ఈ మూవీలో స్టార్ బ్యూటీ తమన్నా లీడ్ రోల్లో నటిస్తోండగా, హెబ్బపటెల్, వశిష్ట సింహా, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి.మధు, సంపత్ నంది సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైనా ప్రతి ఒక్క అప్డెట్ ఎంతో ఆకట్టుకోగా రీసెంట్గా విడుదలైన ట్రైలర్ మరింత అంచనాలు పెంచేసింది. కట్ చేస్తే ట్రైలర్లో స్టోరీని దాచే ప్రయత్నం చేయలేదు.. ఓదెల గ్రామంలో గతంలో చనిపోయాడు అనుకున్న తిరుపతి (వశిష్ట సింహ) ప్రేతాత్మగా మారి అక్కడి జనాన్ని ఆవహిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడకు అడుగు పెడుతుంది శివుడిని ఆరాధించే శివశక్తి తమన్నా. అలా దేవుడికి.. దెయ్యానికి మధ్య వార్ జరుగనున్నట్లు గా చూపించారు. విజువల్స్ పరంగా సస్పెన్స్, థ్రిల్, హారర్ మూడు మిక్స్ చేయడంలో అశోక్ తేజ పనితనం కనిపిస్తుంది. అలాగే విరూపాక్ష, మంగళవారం లాంటి హిట్లకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అజనీష్ లోకనాథ్ మరోసారి తన పనితనం చూపించాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ లాక్ అయ్యింది. ‘ఓదెల2’ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.18 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్ గురించి చర్చలు సాగుతున్నాయట.