Saptagiri: సప్తగిరి అత్యుత్సాహం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో జరుగుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఒక అపశృతితో వార్తల్లో నిలిచింది. ఈ ప్రముఖ జాతరలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో తరలివచ్చిన సమయంలో, టీడీపీ నాయకుడు ఆర్వీటి బాబు, సినీ నటుడు, కమెడియన్ సప్తగిరి హెలికాప్టర్ ద్వారా ఆలయం పై పూలు చల్లే ప్రయత్నం చేశారు. అయితే, ఈ ప్రయత్నం భక్తులకు తీవ్ర ఇబ్బందులను కలిగించడమే కాకుండా, ఒక పెను ప్రమాదాన్ని త్రుటిలో తప్పించింది. జాతర సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూలు చల్లడానికి ఆర్వీటీ బాబు, సప్తగిరి ఉన్న హెలికాప్టర్ కిందికి దిగడంతో, దాని గాలి వల్ల షామియానాలు కూలిపోయాయి. ఈ ఘటనలో దుమ్ము దూళి రేగడంతో భక్తులు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఈ అత్యుత్సాహ చర్య వల్ల కూలిన షామియానాల కింద ఎవరైనా చిక్కుకుని ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Naga Vamsi : చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు.. నాగవంశీ సెన్సేషనల్..
Also Read
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
- Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
- ‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
“అమ్మవారి దర్శనం కోసం వచ్చిన మాకు ఇలాంటి ఇబ్బందులు ఎందుకు? ఇక్కడ వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇది ఏమైనా అవసరమా?” అని పోలీసులను నిలదీస్తూ ప్రశ్నించారు. షామియానాలు కూలిన సమయంలో ఎవరూ గాయపడకపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పినప్పటికీ, ఈ ఘటన భక్తుల్లో భయాందోళనలను రేకెత్తించింది. గంగమ్మ జాతర వంటి పవిత్ర కార్యక్రమంలో ఇటువంటి గందరగోళం సృష్టించడం పట్ల భక్తులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. దీంతో కోపోద్రిక్తులైన భక్తులు పోలీసులను నిలదీశారు. “అమ్మవారి దర్శనం కోసం వచ్చాము, ఇదేమి పరిస్థితి? ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇది అవసరమా? ఇక్కడ వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్నారు. పందిళ్ల కూలిపోయి పైపులు ప్రజలపై పడి ఉంటే ఏం జరిగేది? పోలీసులు ఊరికే చూస్తూ ఉంటే సరిపోతుందా?” అని ప్రశ్నించారు. ఈ ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..