సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖలేజా. 2010 లో వచ్చిన ఈ సినిమా మహేశ్ బాబు నుండి లాంగ్ గ్యాప్ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలయింది. సాంగ్స్ సూపర్ హిట్ కావడం, త్రివ్రిక్రమ్ కాంబో కావడంతో ఓ రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో కాస్త తడబడింది. అప్పట్లో థియేటర్స్ లో అంతగా గుర్తింపు తెచ్చుకొని ఈ సినిమా ఇప్పుడు ఓ క్లాసిక్. ఇప్పటికి టీవీలో ఈ సినిమా వస్తుందంటే విరగబడి చూసే వాళ్ళు ఉన్నారు.
Also Read : Priyadarshi : సారంగపాణి జాతకం.. సెన్సార్ టాక్
అయితే ఇటీవల టాలీవుడ్ లో రిలీరిజ్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు రిలీరిజ్ లో భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. మరి ముఖ్యంగా మహేశ్ బాబు నటించిన మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఇదే నెలలో భరత్ అనే నేను, ఒక్కడు రీరిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖలేజా 4K లో రీరిలీజ్ అవుతుందని అందుకు సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ కు ఖలేజా రీరిలీజ్ అవుతుందని సంతోష వ్యక్తం చేసారు. కానీ అలాంటిది ఏది లేదని కొందరు కావాలనే ఫ్యాన్స్ ను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారని ఖలేజా రిలీజ్ కు కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని అవి క్లియర్ అయితే తప్ప ఆ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అవుతుందని ఆ సూచనలు ఏవిలేవని, ఖలేజా రీరిలీజ్ అనేది దుష్ప్రచారం తెలిపారు మేకర్స్.