Kareena Kapoor: హాలీవుడ్ పై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025లో ప్యానెల్ చర్చలో పాల్గొనడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను షేర్ చేస్తూ, ఈ అవకాశం కేవలం గౌరవం మాత్రమే కాదు, ప్రముఖ వ్యక్తులతో వేదికను పంచుకోవడం స్ఫూర్తిదాయకమైన అనుభవమని తెలిపారు.’బెబో’గా పిలుచుకునే కరీనా, తన తాజా ఫోటోషూట్ను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఈ ఫోటోలలో ఆమె నీలం రంగు ప్రింటెడ్ షిఫాన్ చీరలో అద్భుతంగా కనిపించింది. వేవ్స్ సమ్మిట్ 2025 కోసం ఆమె ఈ స్టైలిష్ లుక్ను ఎంచుకుంది. తన క్యాప్షన్లో ఈ శిఖరాగ్ర సమావేశం గురించి ప్రత్యేక విషయాలను పేర్కొంది.
Read More:Prabhas: ఆ సినిమానే టాప్ ప్రయారిటీ అంటున్న ప్రభాస్!
Also Read
- Vishwambhara: మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ 'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
- Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
- Yogibabu : సత్య - యోగి బాబు నవ్వుల బాంబ్..'రంగబలి' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
- Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్
“వేవ్స్ సమ్మిట్లో ప్యానెల్ చర్చలో పాల్గొనడం నాకు గర్వకారణం. భారతదేశం ఇప్పుడు ప్రపంచ వినోద సంభాషణలో భాగం మాత్రమే కాదు, దానిని ముందుకు నడిపిస్తోంది. భారతదేశం వేగంగా ప్రపంచ వినోద పరిశ్రమలో సూపర్ పవర్గా ఎదుగుతోంది. ఇది సృజనాత్మక యుగానికి కేవలం ప్రారంభం మాత్రమే, ఇది భవిష్యత్తును రూపొందిస్తుంది,” అని ఆమె క్యాప్షన్లో రాసింది. గురువారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మొదటి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.
Read More:
ఈ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, హేమ మాలిని, రాశి ఖన్నా, మానుషి చిల్లర్, వాణి కపూర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఎస్ఎస్ రాజమౌళి, చిరంజీవి, అనిల్ కపూర్, ఆలియా భట్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమ్మిట్ మే 1 నుండి 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతోంది. మీడియా మరియు వినోద రంగ సామర్థ్యాన్ని ప్రోత్సహించడం ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యం.
వేవ్స్ సమ్మిట్లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ హాలీవుడ్ గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది . ఆమె మాట్లాడుతూ గుర్తింపు కావాలంటే హాలీవుడ్ లోనే నటించాల్సిన అవసరం లేదని పేర్కొంది. చాలా సంవత్సరాల క్రితం విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు, 3 ఇడియట్స్ నటి ఒక రెస్టారెంట్లో ఉండగా స్పీల్బర్గ్ ఆమెను గుర్తించి సంభాషించారని గుర్తు చేసుకుంది. “నేను ఒక రెస్టారెంట్లో ఉన్నాను, అదే సమయంలో 3 ఇడియట్స్ విడుదలైంది. స్పీల్బర్గ్ అక్కడే ఉన్నారు. ఆయన నా దగ్గరకు వచ్చి, ‘నీవు 3 ఇడియట్స్ సినిమాలో నటించిన అమ్మాయివా?’ అని అడిగారు. నేను, ‘అవును, నేనే!’ అని చెప్పాను. అప్పుడు ఆయన, ‘అరె, ఆ సినిమా నాకు చాలా నచ్చింది!’ అని అన్నారు. ఆయన ఆ సినిమాను ఇంగ్లీష్లో చూశారట. ఆ క్షణం మాకు ఎంతో గర్వకారణంగా అనిపించింది,” అని కరీనా ఆనందంగా తెలిపింది.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?