Kareena Kapoor: హాలీవుడ్ పై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025లో ప్యానెల్ చర్చలో పాల్గొనడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను షేర్ చేస్తూ, ఈ అవకాశం కేవలం గౌరవం మాత్రమే కాదు, ప్రముఖ వ్యక్తులతో వేదికను పంచుకోవడం స్ఫూర్తిదాయకమైన అనుభవమని తెలిపారు.’బెబో’గా పిలుచుకునే కరీనా, తన తాజా ఫోటోషూట్ను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఈ ఫోటోలలో ఆమె నీలం రంగు ప్రింటెడ్ షిఫాన్ చీరలో అద్భుతంగా కనిపించింది. వేవ్స్ సమ్మిట్ 2025 కోసం ఆమె ఈ స్టైలిష్ లుక్ను ఎంచుకుంది. తన క్యాప్షన్లో ఈ శిఖరాగ్ర సమావేశం గురించి ప్రత్యేక విషయాలను పేర్కొంది.
Read More:Prabhas: ఆ సినిమానే టాప్ ప్రయారిటీ అంటున్న ప్రభాస్!
Also Read
- Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
“వేవ్స్ సమ్మిట్లో ప్యానెల్ చర్చలో పాల్గొనడం నాకు గర్వకారణం. భారతదేశం ఇప్పుడు ప్రపంచ వినోద సంభాషణలో భాగం మాత్రమే కాదు, దానిని ముందుకు నడిపిస్తోంది. భారతదేశం వేగంగా ప్రపంచ వినోద పరిశ్రమలో సూపర్ పవర్గా ఎదుగుతోంది. ఇది సృజనాత్మక యుగానికి కేవలం ప్రారంభం మాత్రమే, ఇది భవిష్యత్తును రూపొందిస్తుంది,” అని ఆమె క్యాప్షన్లో రాసింది. గురువారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మొదటి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.
Read More:
ఈ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, హేమ మాలిని, రాశి ఖన్నా, మానుషి చిల్లర్, వాణి కపూర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఎస్ఎస్ రాజమౌళి, చిరంజీవి, అనిల్ కపూర్, ఆలియా భట్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమ్మిట్ మే 1 నుండి 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతోంది. మీడియా మరియు వినోద రంగ సామర్థ్యాన్ని ప్రోత్సహించడం ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యం.
వేవ్స్ సమ్మిట్లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ హాలీవుడ్ గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది . ఆమె మాట్లాడుతూ గుర్తింపు కావాలంటే హాలీవుడ్ లోనే నటించాల్సిన అవసరం లేదని పేర్కొంది. చాలా సంవత్సరాల క్రితం విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు, 3 ఇడియట్స్ నటి ఒక రెస్టారెంట్లో ఉండగా స్పీల్బర్గ్ ఆమెను గుర్తించి సంభాషించారని గుర్తు చేసుకుంది. “నేను ఒక రెస్టారెంట్లో ఉన్నాను, అదే సమయంలో 3 ఇడియట్స్ విడుదలైంది. స్పీల్బర్గ్ అక్కడే ఉన్నారు. ఆయన నా దగ్గరకు వచ్చి, ‘నీవు 3 ఇడియట్స్ సినిమాలో నటించిన అమ్మాయివా?’ అని అడిగారు. నేను, ‘అవును, నేనే!’ అని చెప్పాను. అప్పుడు ఆయన, ‘అరె, ఆ సినిమా నాకు చాలా నచ్చింది!’ అని అన్నారు. ఆయన ఆ సినిమాను ఇంగ్లీష్లో చూశారట. ఆ క్షణం మాకు ఎంతో గర్వకారణంగా అనిపించింది,” అని కరీనా ఆనందంగా తెలిపింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!