Dil Raju: ఊరి పేరు భైరవకోన వాయిదా.. ‘యాత్ర -2, లాల్ సలాం’ టీంస్ ని అడిగినా వినలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju Comments about Eagle Movie Solo Release: సంక్రాంతి సినిమాల పోటీ నుంచి తప్పుకుంటే, తప్పుకున్న సినిమాకి సోలో రిలీజ్ ఇస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా టీం తమ సినిమాను వాయిదా వేసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఫిబ్రవరి 9న ఏ సినిమా రావడం లేదని భావించి ఆ డేట్ ఈగల్ సినిమాకి ఇచ్చింది. అయితే నిజానికి అంతకంటే ముందే సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఊరి పేరు భైరవకోన సినిమా అదే డేట్ కి రిలీజ్ అనౌన్స్ చేశారు. ఒకరోజు ముందు అంటే ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 రిలీజ్ కూడా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ తెలుగు ఫిలిం ఛాంబర్ వీరితో సంప్రదింపులు జరపకుండా ఈగల్ టీంకి సోలో రిలీజ్ డేట్ చేసింది.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సిందిగా ఈగల్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక లేఖ రాయడంతో రంగంలోకి దిగిన ఫిలిం ఛాంబర్ ఎట్టకేలకు సినిమాలను వాయిదా వేసుకోవాల్సిందిగా ఊరు పేరు భైరవకోన, యాత్ర 2, తమిళ్ లాల్ సలాం యూనిట్స్ ని కోరింది.
Pushpa’s Rule: మరో 200 రోజుల్లో పుష్ప గాడి రూలింగ్
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
- Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
అయితే యాత్ర 2 సినిమాని వాయిదా వేసుకోవడం కుదరదని మేకర్స్ తేల్చి చెప్పారు. కానీ ఊరి పేరు భైరవకోన సినిమా యూనిట్ మాత్రం ఛాంబర్ నిర్ణయాన్ని గౌరవించి వారం రోజులు వెనక్కి వెళ్లి ఫిబ్రవరి 15వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నట్లు ఛాంబర్ ప్రెస్ మీట్ లో ప్రకటించింది. రజనీకాంత్ లాల్ సలాం టీం ని కూడా వాయిదా వేసుకోవాల్సిందిగా కొడితే తమ సినిమా తమిళ్ రిలీజ్ కూడా ఉంది కాబట్టి వాయిదా వేసుకోలేమని వారు కూడా సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఈ విషయం అర్థం చేసుకున్నారని ఈగల్ సినిమా వాళ్లకి ఎక్కువ స్క్రీన్స్ వచ్చేలా ప్రయత్నిస్తామని దిల్ రాజు ప్రెస్ మీట్ లో ప్రకటించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే సమస్యలతో పాటు పరిష్కారాలు కూడా తెలియజేయమని వారే చెప్పారని ఎల్లుండి ఈసీ మీటింగ్ ఉంది, అందులో అమ్మని కలుపుకొని సమస్యలు ఏంటో తెలుసుకుని పరిష్కారాలు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. వచ్చే టర్మ్ కి తాను ప్రెసిడెంట్ గా ఉండే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇక ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని కలవబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!