Veerakankanam Movie:అరవై ఐదేళ్ళ ‘వీరకంకణం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(మే 16తో ‘వీరకంకణం’కు 65 ఏళ్ళు)
నటరత్న యన్టీఆర్ కథానాయకునిగా తెరకెక్కిన జానపద చిత్రం ‘వీరకంకణం’ ఆ రోజుల్లో జనాన్ని భలేగా అలరించింది. 1950లో ఎమ్.జి.రామచంద్రన్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘మంత్రి కుమారి’ ఆధారంగా ఈ ‘వీరకంకణం’ తెరకెక్కింది. ఆ సినిమాను నిర్మించిన మోడరన్ థియేటర్స్ సంస్థ ‘వీరకంకణం’ను తెలుగులోనూ నిర్మించింది. 1957 మే 16న ‘వీరకంకణం’ చిత్రం విడుదలయింది.
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
‘వీరకంకణం’ కథ ఏమిటంటే- ఓ దేశానికి రాజైన వెంగళరాయ దేవ అమాయకుడు. తమ రాజగురువు ఏది చెబితే అదే వేదం అని నమ్ముతూ ఉంటాడు. వెంగళరాయ దేవ కూతురు రజనికి, తన కొడుకు చంద్రసేనుని కి వివాహం జరిపించి రాజ్యం కాజేయాలన్నది రాజగురువు పథకం. మంత్రి కుమార్తె పార్వతిని చంద్రసేనుడు ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు.
చంద్రసేనుని అకృత్యాలను తొలి నుంచీ సేనాని వీరమోహన్ వ్యతిరేకిస్తూ ఉంటాడు. జనాలను ఓ జట్టుగా చేర్చి సైన్యాన్నీ తయారు చేస్తాడు వీరమోహన్. అతణ్ణి ఎలాగైనా మట్టు పెట్టాలన్నదే రాజగురువు యోచన. వీరమోహన్ మంచితనం, వీరత్వం మెచ్చిన రాజకుమారి రజని అతణ్ణి ప్రేమిస్తుంది. కానీ, తన భార్య పార్వతిని చంపేసి, తాను రాకుమారిన పెళ్ళాడాలని చంద్రసేనుడు, అతని తండ్రి రాజగురువు పథకం వేస్తారు. అదే సమయంలో రాజును హతమార్చాలని రాజగురువు ప్రయత్నిస్తాడు.
అది తెలిసి రక్షించిన వీరమోహన్ పైకే నేరం మోపుతాడు రాజగురువు. వీరమోహన్ కు ఉరిశిక్ష విధిస్తారు. అప్పుడు పార్వతి వచ్చి జనానికి తన మామ, భర్త చేసిన దాష్టీకాల గురించి చెబుతుంది. రాజగురువు ఆమెను చంపుతాడు. జనం రాజగురువును మట్టు పెడతారు. వీరమోహన్ , రజనీ పెళ్ళి జరుగుతుంది. రాజగురువు బలిగొన్న పార్వతికి సమాధి కట్టి, ఆమెను అందరూ కీర్తిస్తూ ఉండగా కథ ముగుస్తుంది.
యన్టీఆర్, కృష్ణకుమారి, జగ్గయ్య, జమున, గుమ్మడి, రమణారెడ్డి, రేలంగి, పేకేటి శివరామ్, కేవీయస్ శర్మ, గిరిజ, ఇ.వి.సరోజ, రమాదేవి తదితరులు నటించిన ఈ చిత్రానికి సుసర్ల దక్షిణామూర్తి సంగీతం సమకూర్చారు. . తమిళ మాతృక ‘మంత్రికుమారి’కి ప్రముఖ రచయిత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్. కరుణానిధి కథను సమకూర్చారు.
ఆ కథకు కొన్ని మార్పులూ చేర్పలూ చేసి ఆరుద్ర రచన చేయడంతో కథ, మాటలు, పాటలు ఆయన పేరునే ప్రకటించారు. ఈ చిత్రంలోని “కట్టండి వీర కంకణం…”, “అందాల రాణి ఎందుకో గానీ…”, “ఇక వాయించకోయి మురళీ…”, “హంస భలే రామ్ చిలక…”, “తేలి తేలి నా మనసు…” వంటి పాటలు అలరించాయి. రిపీట్ రన్స్ లో ‘వీరకంకణం’ భలేగా అలరించింది.
Vladimir Putin : పుతిన్కు బ్లడ్ క్యానర్స్ అంటున్న బ్రిటన్ మాజీ గూఢచారి
తాజావార్తలు
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
-
Trump: ట్రంప్నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
-
NDA: డీలిమిటేషన్కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!