Veerakankanam Movie:అరవై ఐదేళ్ళ ‘వీరకంకణం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(మే 16తో ‘వీరకంకణం’కు 65 ఏళ్ళు)
నటరత్న యన్టీఆర్ కథానాయకునిగా తెరకెక్కిన జానపద చిత్రం ‘వీరకంకణం’ ఆ రోజుల్లో జనాన్ని భలేగా అలరించింది. 1950లో ఎమ్.జి.రామచంద్రన్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘మంత్రి కుమారి’ ఆధారంగా ఈ ‘వీరకంకణం’ తెరకెక్కింది. ఆ సినిమాను నిర్మించిన మోడరన్ థియేటర్స్ సంస్థ ‘వీరకంకణం’ను తెలుగులోనూ నిర్మించింది. 1957 మే 16న ‘వీరకంకణం’ చిత్రం విడుదలయింది.
Also Read
- The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. 'ది ఒడిస్సీ'కి అదిరిపోయే ఓపెనింగ్!
- Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. 'ఫౌజీ' ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన 'ది రాజాసాబ్'.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
‘వీరకంకణం’ కథ ఏమిటంటే- ఓ దేశానికి రాజైన వెంగళరాయ దేవ అమాయకుడు. తమ రాజగురువు ఏది చెబితే అదే వేదం అని నమ్ముతూ ఉంటాడు. వెంగళరాయ దేవ కూతురు రజనికి, తన కొడుకు చంద్రసేనుని కి వివాహం జరిపించి రాజ్యం కాజేయాలన్నది రాజగురువు పథకం. మంత్రి కుమార్తె పార్వతిని చంద్రసేనుడు ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు.
చంద్రసేనుని అకృత్యాలను తొలి నుంచీ సేనాని వీరమోహన్ వ్యతిరేకిస్తూ ఉంటాడు. జనాలను ఓ జట్టుగా చేర్చి సైన్యాన్నీ తయారు చేస్తాడు వీరమోహన్. అతణ్ణి ఎలాగైనా మట్టు పెట్టాలన్నదే రాజగురువు యోచన. వీరమోహన్ మంచితనం, వీరత్వం మెచ్చిన రాజకుమారి రజని అతణ్ణి ప్రేమిస్తుంది. కానీ, తన భార్య పార్వతిని చంపేసి, తాను రాకుమారిన పెళ్ళాడాలని చంద్రసేనుడు, అతని తండ్రి రాజగురువు పథకం వేస్తారు. అదే సమయంలో రాజును హతమార్చాలని రాజగురువు ప్రయత్నిస్తాడు.
అది తెలిసి రక్షించిన వీరమోహన్ పైకే నేరం మోపుతాడు రాజగురువు. వీరమోహన్ కు ఉరిశిక్ష విధిస్తారు. అప్పుడు పార్వతి వచ్చి జనానికి తన మామ, భర్త చేసిన దాష్టీకాల గురించి చెబుతుంది. రాజగురువు ఆమెను చంపుతాడు. జనం రాజగురువును మట్టు పెడతారు. వీరమోహన్ , రజనీ పెళ్ళి జరుగుతుంది. రాజగురువు బలిగొన్న పార్వతికి సమాధి కట్టి, ఆమెను అందరూ కీర్తిస్తూ ఉండగా కథ ముగుస్తుంది.
యన్టీఆర్, కృష్ణకుమారి, జగ్గయ్య, జమున, గుమ్మడి, రమణారెడ్డి, రేలంగి, పేకేటి శివరామ్, కేవీయస్ శర్మ, గిరిజ, ఇ.వి.సరోజ, రమాదేవి తదితరులు నటించిన ఈ చిత్రానికి సుసర్ల దక్షిణామూర్తి సంగీతం సమకూర్చారు. . తమిళ మాతృక ‘మంత్రికుమారి’కి ప్రముఖ రచయిత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్. కరుణానిధి కథను సమకూర్చారు.
ఆ కథకు కొన్ని మార్పులూ చేర్పలూ చేసి ఆరుద్ర రచన చేయడంతో కథ, మాటలు, పాటలు ఆయన పేరునే ప్రకటించారు. ఈ చిత్రంలోని “కట్టండి వీర కంకణం…”, “అందాల రాణి ఎందుకో గానీ…”, “ఇక వాయించకోయి మురళీ…”, “హంస భలే రామ్ చిలక…”, “తేలి తేలి నా మనసు…” వంటి పాటలు అలరించాయి. రిపీట్ రన్స్ లో ‘వీరకంకణం’ భలేగా అలరించింది.
Vladimir Putin : పుతిన్కు బ్లడ్ క్యానర్స్ అంటున్న బ్రిటన్ మాజీ గూఢచారి
తాజావార్తలు
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!