Brahmastra: బిగ్ అప్డేట్ ఇచ్చిన రణబీర్ డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayan Mukharji: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం గత యేడాది సెప్టెంబర్ 9వ తేదీ విడుదలైంది. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ‘బ్రహ్మస్త’ మెప్పించలేకపోయింది. దాంతో ఈ ట్రియాలజీకి సంబంధించిన రెండు, మూడు పార్ట్స్ వస్తాయో రావో అనే సందేహాలు బాలీవుడ్ లో నెలకొన్నాయి. వాటికి అయాన్ ముఖర్జీ తెర దించాడు. తన అభిమానులను ఉద్దేశించి ఓ ఓపెన్ లెటర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ‘ఒకేసారి బ్రహ్మాస్త్ర 2, 3 భాగాల షూటింగ్ ను జరుపుతామని, అలానే పెద్దంత తేడా లేకుండా ఈ రెండు సినిమాలను జనం ముందుకు తీసుకొస్తామ’ని తెలిపాడు. ‘మొదటి భాగానికి వచ్చిన స్పందనను బట్టి, ప్రేక్షకులు తన నుండి మరింత మంచి, భారీ చిత్రాన్ని ఆశిస్తున్నట్టు అర్థమైందని, వారి అంచనాలను అందుకునేలా స్క్రిప్ట్ తయారు చేయడానికి మరికొంత సమయం అవసరం అవుతుంద’ని అయాన్ అభిప్రాయపడ్డాడు.
అదే సమయంలో అయాన్ తనకో సరికొత్త ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని తెలిపాడు. తనను ఎంతో ఎగ్జైట్ చేసిన ఆ స్పెషల్ ప్రాజెక్ట్ ను అంగీకరించడానికి తాను సిద్ధపడ్డానని, అది తనకు ఛాలెంజ్ తో పాటు, లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ లాంటిందని అయాన్ చెప్పాడు. ‘బ్రహ్మాస్త్ర’ రెండు, మూడు భాగాల కంటే ముందే అయాన్ ఈ కొత్త సినిమాను టేకప్ చేయొచ్చనిపిస్తోంది. ఎందుకంటే ‘బ్రహ్మాస్త్ర’ రెండో భాగాన్ని 2026లోనూ, మూడో భాగాన్ని 2027లోనూ విడుదల చేస్తామని గతంలో చెప్పారు. ఇప్పుడు వాటికి మరింత సమయం పడుతుందని అంటున్నారు. సో… ఈ మధ్యలో అయాన్ ఈ కొత్త ప్రాజెక్ట్ చేసే ఆస్కారం ఉందనిపిస్తోంది. బట్… తనను ఎంతో ఎగ్జైట్ చేసిన ఆ ప్రాజెక్ట్ గురించి మాత్రం అయాన్ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.
Also Read
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
- Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
తాజావార్తలు
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..