Prathibimbalu: మహానటుడు అక్కినేని 40 సంవత్సరాల క్రితం నటించిన ‘ప్రతిబింబాలు’ సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అయింది. విష్ణు ప్రియ సినీ కంబైన్స్ పతాకంపై కె.యస్. ప్రకాశరావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాను రాజేశ్వర్ రాచర్ల సమర్పణలో 2కె హెడి రిజల్యూషన్ తో విడుదల చేయబోతున్నారు.
Read Also: Naveen Chandra: తగ్గేదే లే.. ఆమె కోసమే 38సార్లు సినిమా చూశా.. ఇంతలా ఆ హీరోకు నచ్చిన నటి ఎవరంటే ?
అయితే ముందు అనుకున్నట్లు 4వ తేదీన కాకుండా 5వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత తెలియచేశారు. అక్కినేనితో పాటు జయసుధ, తులసి నటించిన ఈ సినిమా 225 ప్రింట్లతో తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ విడుదల చేస్తున్నామని, ప్రింట్ల సంఖ్య ఇంకా పెరిగే ఆస్కారం ఉందని చెబుతున్నారాయన.
Read Also: JR NTR: ఎట్టకేలకు ఎన్టీఆర్ ఆ డైరెక్టర్తో ఫిక్స్.. హీరోయిన్ ఎవరంటే