Bangladesh: బంగ్లాదేశీయులు బాటా, పిజ్జా హట్, కేఎఫ్సీలపై ఎందుకు దాడులు చేస్తున్నారు..?
- బంగ్లాదేశ్ వ్యాప్తంగా బాటా, పిజ్జా హట్, కేఎఫ్సీ స్టోర్లపై దాడులు..
- గాజాపై ఇజ్రాయిల్ దాడులకు నిరసన..
- ఇజ్రాయిల్తో సంబంధం ఉన్న షాపులపై దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో మత ఛాందసవాదం మరింత పెరిగింది. బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయిన మహ్మద్ యూనస్ కూడా రాడికల్ ఇస్లామిక్ సంస్థలైన ‘‘జమాతే ఇస్లామీ’, ‘‘హిజ్బుత్ తెహ్రీర్’’ వంటి సంస్థలపై మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాడు. దీంతో ఈ గ్రూపులు దేశవ్యాప్తంగా రెచ్చిపోతున్నాయి. మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి.
Read Also: UP: ‘‘డ్రమ్లో ముక్కలవ్వడం ఇష్టం లేదు’’.. భార్య అక్రమ సంబంధంపై భర్త.. వీడియో వైరల్..
Also Read
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ఇదిలా ఉంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ వ్యాప్తంగా అంతర్జాతీయ బ్రాండ్లు అయిన బాటా, పిజ్జా హట్, కేఎఫ్సీ షాపుల్ని ధ్వంసం చేస్తు్న్నారు. గత రెండు వారాలుగా గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని తీవ్రతరం చేయడంతో నిరసనకారులు హింసాత్మక దాడులకు దిగారు. ఢాకా, బోగ్రా, సిల్హెట్, కాక్స్ బజార్తో సహా బంగ్లాదేశ్లోని నగరాలు, పట్టణాలలో గాజాకు మద్దతుగా నిరసనలు నిర్వహించారు. ఇజ్రాయిల్తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న షాపులపై దాడులు, లూటీలు చేస్తున్నారు. అల్లరి మూకలు షాపుల్ని ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
విధ్వంసాలకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని జనరల్ ఆఫ్ పోలీస్ బహరుల్ ఆలం దేశవ్యాప్తంగా అధికారులను ఆదేశించారు. మరోవైపు, ఢాకాలో యూఎస్ ఎంబసీ వద్ద భద్రతను పెంచారు. నిరసనకారులు దీనికి సమీపంలో అమెరికా వ్యతిరేక నినాదాలు చేశారు. కొందరు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్గా నినాదాలు చేశారు. ఈ అల్లర్లు అధికార, ప్రతిపక్షాలకు మధ్య రాజకీయ వివాదాన్ని సృష్టించాయి. తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ ఈ హింసను ఖండించగా, షేక్ హసీనా బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!