I2U2: ఇండియా, ఇజ్రాయిల్, యూఏస్ఏ, యూఏఈ తొలి సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, ఇజ్రాయిల్, యూఎస్ఏ, యూఏఈ దేశాల కూటమి ఐ2యూ2 తొలి శిఖరాగ్ర సమావేశాలను యూఎస్ఏ నిర్వహించనుంది. ఈ భేటీ నాలుగు దేశాల అధ్యక్షులు పాల్గొననున్నారు. ఐ2యూ2 ఏర్పడిన తర్వాత జరగబోయే తొలి శిఖరాగ్ర సమావేశం ఇదే. ఇండియా, ఇజ్రాయిల్ దేశాల మొదటి అక్షరాలను కలిపి ఐ 2గా, యూఎస్ఏ, యూఏఈని కలిపి యూ 2 గా వ్యవహరిస్తారు. ఈ గ్రూప్ ను పశ్చిమాసియా క్వాడ్ గా కూడా అభివర్ణిస్తారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇజ్రాయిల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్, యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్, యూఏఈ మహ్మద్ బిన్ జయాద్ ఆల్ నెహ్యన్ ఈ భేటీకి హాజరుకానున్నారు. వచ్చే నెల 13 నుంచి 16 వరకు జో బైడెన్ ఇజ్రాయిల్ తో పాటు పశ్చిమాసియా దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన సమయంలో ఐ2యూ2 శిఖరాగ్ర సమావేశం జరగనుంది.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
2021లో అక్టోబర్ లో విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ఐ2యూ2 ని ప్రారంభించాలని ప్రతిపాదించాడు. మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియాలో ఆర్థిక, రాజకీయ సహకారాన్ని విస్తరించడం, వాణిజ్యం, వాతావరణ మార్పును ఎదుర్కొనడం, ఇంధన సహకారం, ఇతర కీలకమైన అంశాల్లో సమన్వయంతో పనిచేయడానికి ఈ గ్రూప్ ఏర్పడిండి.
బైడెన్ అమెరికా అధ్యక్షుడు కావడంతో వివిధ దేశాలతో సహకార సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, యూఎస్ఏ సభ్యులుగా ఉన్న క్వాడ్ మీటింగ్ జరిగింది. దీంతో పాటు ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏ లతో అకూస్ అనే కొత్త కూటమిని ఏర్పాటు చేశాడు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చాలా కూటముల నుంచి వైదొలిగాడు. అయితే ప్రస్తుతం వాటన్నింటిని బైడెన్ పునరుద్ధరించే పనిలో ఉన్నాడు.
- Tags
- I2U2
- india
- Joe Biden
- Narendra Modi
- USA
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!