I2U2: ఇండియా, ఇజ్రాయిల్, యూఏస్ఏ, యూఏఈ తొలి సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, ఇజ్రాయిల్, యూఎస్ఏ, యూఏఈ దేశాల కూటమి ఐ2యూ2 తొలి శిఖరాగ్ర సమావేశాలను యూఎస్ఏ నిర్వహించనుంది. ఈ భేటీ నాలుగు దేశాల అధ్యక్షులు పాల్గొననున్నారు. ఐ2యూ2 ఏర్పడిన తర్వాత జరగబోయే తొలి శిఖరాగ్ర సమావేశం ఇదే. ఇండియా, ఇజ్రాయిల్ దేశాల మొదటి అక్షరాలను కలిపి ఐ 2గా, యూఎస్ఏ, యూఏఈని కలిపి యూ 2 గా వ్యవహరిస్తారు. ఈ గ్రూప్ ను పశ్చిమాసియా క్వాడ్ గా కూడా అభివర్ణిస్తారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇజ్రాయిల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్, యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్, యూఏఈ మహ్మద్ బిన్ జయాద్ ఆల్ నెహ్యన్ ఈ భేటీకి హాజరుకానున్నారు. వచ్చే నెల 13 నుంచి 16 వరకు జో బైడెన్ ఇజ్రాయిల్ తో పాటు పశ్చిమాసియా దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన సమయంలో ఐ2యూ2 శిఖరాగ్ర సమావేశం జరగనుంది.
Also Read
- China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
- Russia-Ukraine: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
- H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
- Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
2021లో అక్టోబర్ లో విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ఐ2యూ2 ని ప్రారంభించాలని ప్రతిపాదించాడు. మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియాలో ఆర్థిక, రాజకీయ సహకారాన్ని విస్తరించడం, వాణిజ్యం, వాతావరణ మార్పును ఎదుర్కొనడం, ఇంధన సహకారం, ఇతర కీలకమైన అంశాల్లో సమన్వయంతో పనిచేయడానికి ఈ గ్రూప్ ఏర్పడిండి.
బైడెన్ అమెరికా అధ్యక్షుడు కావడంతో వివిధ దేశాలతో సహకార సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, యూఎస్ఏ సభ్యులుగా ఉన్న క్వాడ్ మీటింగ్ జరిగింది. దీంతో పాటు ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏ లతో అకూస్ అనే కొత్త కూటమిని ఏర్పాటు చేశాడు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చాలా కూటముల నుంచి వైదొలిగాడు. అయితే ప్రస్తుతం వాటన్నింటిని బైడెన్ పునరుద్ధరించే పనిలో ఉన్నాడు.
- Tags
- I2U2
- india
- Joe Biden
- Narendra Modi
- USA
తాజావార్తలు
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
-
CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!