Pakistan: పాకిస్తాన్ని మందలించిన యూఎస్, సౌదీ.. దాయాది ముందు కాశ్మీర్ సహా 5 డిమాండ్లు
- ఇటీవల సౌదీ పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని, ఇతర అధికారులు..
- పాక్ని మందలించిన సౌదీ, అమెరికా..
- కాశ్మీర్తో సహా 5 డిమాండ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మాలిక్, విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ ఇటీవల సౌదీ అరేబియాలో పర్యటించారు. సౌదీ, యూఎస్ అధికారులతో పాక్ అధికారులు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. బలూచిస్తాన్లో బీఎల్ఏ ట్రైన్ హైజాక్ ఘటన, ఇతర దాడుల తర్వాత వీరంతా సౌదీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, ఈ సమావేశంలో పాకిస్తాన్ని సౌదీ అరేబియా, అమెరికాలు మందలించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ముందు 5 డిమాండ్ల ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన పాకిస్తాన్ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ చెబుతున్న దాని ప్రకారం.. పాక్ ప్రధానితో సహా ముఖ్యమైన అధికారులు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, సౌదీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్, ఇరాన్, చైనా, ఇజ్రాయిల్, ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ ముందు 5 డిమాండ్లు పెట్టారు.
Also Read
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
- India - Pakistan: భారత్ - పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
ఇజ్రాయిల్ని గుర్తించాలి:
పాకిస్తాన్, ఇజ్రాయిల్ని ఇప్పటి వరకు గుర్తించలేదు. అయితే, ఇప్పుడు పాక్ ఇజ్రాయిల్ని గుర్తించాలని అమెరికా కోరుతోంది. ట్రంప్ పరిపాలన పాకిస్తాన్, ఇజ్రాయిల్ మధ్య సంబంధాలను పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నిజానికి, సౌదీ అరేబియా లాగే మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయిల్ని ఒక దేశంగా గుర్తించవు. కానీ సౌదీ గుర్తింపు ఒప్పందం చేసుకుంటే, పాక్ కూడా దానిని అనుసరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పాకిస్తాన్, సౌదీ అరేబియా మంచి వ్యూహాత్మక, సైనిక సంబంధాలను కలిగి ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా వారి సౌదీ ప్రతిరూపాలతో కలిసి సైనిక చర్యలో పాల్గొంటుంది. ఈ ఆపరేషన్కు మాజీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ నాయకత్వం వహించారు.
ఇరాన్లో అధికార మార్పులకు కుట్ర..
ఇరాన్తో పాకిస్తాన్ సంబంధాలు సంక్లిష్టంగానే ఉన్నాయి. ఇరాన్లో అమెరికా, సౌదీ కలిసి ఏదైనా పరిపాలన మార్పును ప్రారంభిస్తే పాకిస్తాన్ తన తటస్థతను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఇస్లామాబాద్ మద్దతు ఇస్తుందని యూఎస్, సౌదీ రెండూ ఆశిస్తున్నాయి.
ఇక చైనా విషయంలో పాకిస్తాన్ తన మిత్రదేశానికి దగ్గరగా ఉండొద్దని అమెరికా సూచించినట్లు తెలుస్తోంది.
కాశ్మీర్ ఉగ్రవాదంపై మందలింపు:
కాశ్మీర్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ని సౌదీ, యూఎస్ తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయడంతో పాటు భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని పాకిస్తాన్ని ఇరుదేశాలు కోరాయి. జమ్మూ కాశ్మీర్లో భారత్ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని పాకిస్తాన్కి చెప్పినట్లు సమాచారం.
ఈ డిమాండ్లు నెరవేర్చకుంటే పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్పై ట్రావెల్ బ్యాన్తో సహా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక కార్యక్రమాలకు సాయం చేయాలని అమెరికా కోరింది.
తాజావార్తలు
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!