Pakistan: పాకిస్తాన్ని మందలించిన యూఎస్, సౌదీ.. దాయాది ముందు కాశ్మీర్ సహా 5 డిమాండ్లు
- ఇటీవల సౌదీ పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని, ఇతర అధికారులు..
- పాక్ని మందలించిన సౌదీ, అమెరికా..
- కాశ్మీర్తో సహా 5 డిమాండ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మాలిక్, విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ ఇటీవల సౌదీ అరేబియాలో పర్యటించారు. సౌదీ, యూఎస్ అధికారులతో పాక్ అధికారులు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. బలూచిస్తాన్లో బీఎల్ఏ ట్రైన్ హైజాక్ ఘటన, ఇతర దాడుల తర్వాత వీరంతా సౌదీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, ఈ సమావేశంలో పాకిస్తాన్ని సౌదీ అరేబియా, అమెరికాలు మందలించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ముందు 5 డిమాండ్ల ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన పాకిస్తాన్ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ చెబుతున్న దాని ప్రకారం.. పాక్ ప్రధానితో సహా ముఖ్యమైన అధికారులు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, సౌదీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్, ఇరాన్, చైనా, ఇజ్రాయిల్, ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ ముందు 5 డిమాండ్లు పెట్టారు.
Also Read
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
ఇజ్రాయిల్ని గుర్తించాలి:
పాకిస్తాన్, ఇజ్రాయిల్ని ఇప్పటి వరకు గుర్తించలేదు. అయితే, ఇప్పుడు పాక్ ఇజ్రాయిల్ని గుర్తించాలని అమెరికా కోరుతోంది. ట్రంప్ పరిపాలన పాకిస్తాన్, ఇజ్రాయిల్ మధ్య సంబంధాలను పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నిజానికి, సౌదీ అరేబియా లాగే మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయిల్ని ఒక దేశంగా గుర్తించవు. కానీ సౌదీ గుర్తింపు ఒప్పందం చేసుకుంటే, పాక్ కూడా దానిని అనుసరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పాకిస్తాన్, సౌదీ అరేబియా మంచి వ్యూహాత్మక, సైనిక సంబంధాలను కలిగి ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా వారి సౌదీ ప్రతిరూపాలతో కలిసి సైనిక చర్యలో పాల్గొంటుంది. ఈ ఆపరేషన్కు మాజీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ నాయకత్వం వహించారు.
ఇరాన్లో అధికార మార్పులకు కుట్ర..
ఇరాన్తో పాకిస్తాన్ సంబంధాలు సంక్లిష్టంగానే ఉన్నాయి. ఇరాన్లో అమెరికా, సౌదీ కలిసి ఏదైనా పరిపాలన మార్పును ప్రారంభిస్తే పాకిస్తాన్ తన తటస్థతను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఇస్లామాబాద్ మద్దతు ఇస్తుందని యూఎస్, సౌదీ రెండూ ఆశిస్తున్నాయి.
ఇక చైనా విషయంలో పాకిస్తాన్ తన మిత్రదేశానికి దగ్గరగా ఉండొద్దని అమెరికా సూచించినట్లు తెలుస్తోంది.
కాశ్మీర్ ఉగ్రవాదంపై మందలింపు:
కాశ్మీర్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ని సౌదీ, యూఎస్ తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయడంతో పాటు భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని పాకిస్తాన్ని ఇరుదేశాలు కోరాయి. జమ్మూ కాశ్మీర్లో భారత్ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని పాకిస్తాన్కి చెప్పినట్లు సమాచారం.
ఈ డిమాండ్లు నెరవేర్చకుంటే పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్పై ట్రావెల్ బ్యాన్తో సహా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక కార్యక్రమాలకు సాయం చేయాలని అమెరికా కోరింది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!