గ్యాస్ కొరత వేళ షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ‘జగ్ విక్రమ్’ ఎల్పీజీ నౌకకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలకమైన సమాచారాన్ని అందించింది. ఇది ఏప్రిల్ 14, మంగళవారం నాడు గుజరాత్లోని కాండ్లాకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక 20,400 టన్నుల ఎల్పీజీని తీసుకువస్తోంది. ఇందులో 24 మంది నావికులు ఉన్నారు. ఈ నౌక ఏప్రిల్ 11న జలసంధిని దాటింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇది ఒక ముఖ్యమైన ఉపశమనం. Also Read:Mangli…
హార్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి మాట్లాడుతూ, “మా ఓడరేవులకు ముప్పు వాటిల్లితే, గల్ఫ్లోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదు” అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిలో నౌకలపై అమెరికా విధించిన నిషేధాన్ని చట్టవిరుద్ధమని పేర్కొంటూ, అది “సముద్రపు దొంగతనానికి సమానం” అని అమెరికాకు చురకలంటించారు. హార్మూజ్ జలసంధిని నియంత్రించడానికి ఇరాన్ ఒక “శాశ్వత యంత్రాంగాన్ని” అమలు చేస్తుందని తెలిపారు. Also Read:144Hz…
అమెరికా, ఇరాన్ల మధ్య జరిగిన మొదటి విడత శాంతి చర్చలు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ముగిశాయి. సుమారు నాలుగు గంటల పాటు మూడు దేశాలు పాల్గొన్న ఈ చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. “పశ్చిమ దేశాలలో కాల్పుల విరమణను బలోపేతం చేయడం,” “లెబనాన్లో కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపడం,” “హోర్ముజ్ జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడం” ఈ చర్చల ప్రధానాంశాలు. ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లతో కలిసి అమెరికా ప్రతినిధి బృందానికి…
US-Iran Talks: మధ్యప్రాచ్యంలో సంఘర్షణకు చెక్ పెట్టేలా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని చర్చల బృందం పాకిస్తాన్ చేరుకున్నాయి. ఇక ఇరాన్ చర్చల బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నాయకత్వం వహిస్తుండగా, ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా ఉన్నారు.
అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ సంక్షోభం తలెత్తిండి. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయండంతో సరఫరా నిలిచిపోవడంతో ఇంధన కొరత ఏర్పడింది. నెల రోజులకు పైగా చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన ఈ సముద్ర మార్గం మూసివేయడం వల్ల భారత్ లో ఏర్పడిన ఎల్పిజి కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలకు, ప్రధాన పరిశ్రమలకు ఎల్పిజి కేటాయింపులను ఖరారు చేసింది. ప్రభుత్వం పారిశ్రామిక ఎల్పిజి సరఫరాలపై పరిమితులు విధించగా,…
అమెరికా-ఇరాన్ యుద్దం పతాకస్థాయికి చేరుకుంటోంది. టెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. అటు ఇరాన్ కూడా తగ్గేదేలే అంటోంది. హర్ముజ్పై ట్రంప్ డెడ్లైన్ విధిస్తే….తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు 45 రోజుల పాటు యుద్ధానికి విరామంపై పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియే…రెండు దేశాలతో చర్చలతో జరుపుతున్నాయి. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు… పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డెడ్లైన్ మీద డెడ్లైన్లు విధిస్తున్నారు. చర్చలకు రావాలంటూ ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నారు. ట్రంప్ వార్నింగ్లకు…టెహ్రాన్ తలొగ్గుతుందా…
Iran: ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్ మరికొన్ని గంటల్లో పూర్తవుతోంది. మరోసారి గడువు పెంచేది లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. దీంతో అమెరికా, ఇరాన్ విషయంలో ఏం చేస్తుందని ప్రపంచమంతా భయాందోళనకు గురవుతోంది. ఇరాన్ డీల్ చేసుకోకపోతే తీవ్రమైన దాడులు చేస్తామని, బ్రిడ్జ్లు, విద్యుత్ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా దాడుల కోసం సిద్ధమవుతోంది. ఇరాన్ కీలక విద్యుత్ కేంద్రాల వద్ద ‘‘మానవ…
Donald Trump: ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధం తీవ్రమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు నేటితో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యం తలుచుకుంటే ఇరాన్ను ఒక్క రాత్రిలో నాశనం చేయగలనదని అన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఒక్కరాత్రిలో దేశం మొత్తం నాశనమైపోవచ్చు, ఆ రాత్రి రేపే కావచ్చు అంటూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్తో కూలిపోయిన ఎఫ్ -15 ఫైటర్…
US-Iran War: ఇరాన్ యుద్ధాన్ని ఏ లక్ష్యాల కోసం అమెరికా, ఇజ్రాయిల్ మొదలుపెట్టాయో ఆ లక్ష్యాలకు దూరంగా యుద్ధం వెళ్లింది. యుద్ధానికి ముందు వారం, పది రోజుల్లో ఇరాన్ కాళ్ల బేరానికి వస్తుందని అమెరికా భావించింది. అయితే, నెల రోజులు దాటినా ఇరాన్ గట్టిగా నిలబడింది. ఇజ్రాయిల్, యూఎస్ దాడుల్ని తిప్పికొడుతోంది. తమకు ప్రమాదం వస్తే ఎలా స్పందిస్తామో, గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రైయిన్లకు ఇరాన్ రుచి చూపించింది. గల్ఫ్ దేశాల్లోని…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బాస్టర్డ్స్ అంటూ బూతులతో రెచ్చిపోతున్నారు. హార్ముజ్ ఓపెన్ చేయకపోతే విధ్వంసం సృష్టిస్తామని ఇరాన్కు హెచ్చరికలు పంపారు. ట్రంప్ ఇచ్చిన 48 గంటల అల్టిమేటం ముగియడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో మరోసారి ఆయన ఇరాన్ను బెదిరించేలా వ్యాఖ్యలు చేశారు.