US: పాలస్తీనా వధువుకు నరకం.. 140 రోజులు బంధించి ఏం చేశారంటే..!
- పాలస్తీనా వధువుకు నరకం
- చేతులకు సంకెళ్లు వేసి చిత్రహింసలు
- తనలాగా ఎవరికీ కాకూడదని వేడుకోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపారు. దొరికిన వారిని దొరికినట్టే కారాగారంలో వేస్తున్నారు. ఇక పాలస్తీనా పౌరులైతే మరి కఠినమైన చర్యలకు దిగుతోంది. ప్రస్తుతం అమెరికాలో చాలా కఠినమైన నిర్ణయాలు అమలవుతున్నాయి. తాజాగా పాలస్తీనాకు చెందిన ఒక నవ వధువు తనకు ఎదురైన దుస్థితి గురించి విలేకర్ల ముందు గోడువెళ్లబుచ్చుకుంది. తనకెదురైన దుస్థితి ఎవరికీ ఎదురుకాకూడదని వాపోయింది.
ఇది కూడా చదవండి: KTR: అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం రేవంత్ కు బేసిన్ లు తెలియదు.. బెండకాయలు తెలియదు
Also Read
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
- PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
- Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
వార్డ్ సకీక్ (22) పాలస్తీనా యువతి. సౌదీ అరేబియాలో జన్మించింది. 8 ఏళ్ల వయసు నుంచి అమెరికాలోనే నివాసం ఉంటుంది. ఇక అమెరికా పౌరుడైన తాహిర్ షేక్ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు ఏ దేశంలోనూ పౌరసత్వం లేదు. ఇక గ్రీన్కార్డు పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లడానికి వీలుండదు. ఆ భయంతోనే హనీమూన్ కోసం బయట ప్రాంతాలకు కాకుండా యూఎస్లోని వర్జిన్ దీవులకు వెళ్లారు. హనీమూన్ ముగించుకుని తిరిగి డల్లాస్-ఫోర్ట్ వర్త్ విమానాశ్రయంలో దిగారు. అంతే వెంటనే సకీక్ను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandi: ట్రంప్ సుంకాలకు మోడీ తలవంచుతారు.. రాసి పెట్టుకోవాలన్న రాహుల్గాంధీ
దాదాపు 140 రోజులు సకీక్ను నిర్బంధంలో ఉంచేశారు. అంతేకాకుండా చేతులకు సంకెళ్లు వేసి ఆహారం, నీళ్లు ఇవ్వకుండా నాలుగు నిర్బంధ కేంద్రాలకు తరలించారు. తాజాగా ఇదే విషయాన్ని విలేకర్ల ముందు గోడు వెళ్లబుచ్చుకుంది. తాను ఐదు నెలల జీవితాన్ని కోల్పోయాయనని.. అత్యంత దారుణంగా తనను హింసించారంటూ వాపోయింది. కనీసం తినేందుకు ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదని బాధను వ్యక్తం చేసింది. తనకెదురైన దుస్థితి ఎవరికీ ఎదురుకాకూడదని చెప్పుకొచ్చింది. దాదాపు 16 గంటలు బేడీలు వేశారని.. తనను ఒక పశువులా చూశారని చెప్పుకొచ్చింది. భర్తను, న్యాయవాదిని 50 గంటల వరకు కలవడానికి కూడా అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. తనకెదురైనా పరిస్థితి ఏ ఒక్కరికీ ఎదురుకాకూడదని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

తాజావార్తలు
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
-
ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!