Rahul Gandi: ట్రంప్ సుంకాలకు మోడీ తలవంచుతారు.. రాసి పెట్టుకోవాలన్న రాహుల్గాంధీ
- ట్రంప్ సుంకాలకు మోడీ శిరసావహిస్తారు
- రాసి పెట్టుకోవాలన్న రాహుల్గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్లైన్ మరికొన్ని గంటల్లో ముగుస్తోంది. ఆయా దేశాలకు గడువు ముంచుకొస్తోంది. యూకే, వియత్నాం, చైనా తప్ప.. ఇంకా ఏ దేశాలు అమెరికాతో ఒప్పందాలు చేసుకోలేదు. భారత్తో కీలక డీల్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నా.. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. వ్యవసాయం, పాడి శ్రమకు సంబంధించిన డీల్ పెట్టుకుంటే ముప్పు వాటిల్లుతుందేమోనని భారత్ భయపడుతోంది. ఒకవేళ ఒప్పందం చేసుకోకపోతే మాత్రం భారీగా సుంకాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య గందరగోళం నెలకొంది.
ఇది కూడా చదవండి: Dhoolpet: దేవుడి చిత్రపటాల వెనుక గంజాయి పెట్టి.. పూజలు చేస్తున్నట్టు డ్రామా.. పోలీసుల ఎంట్రీతో
Also Read
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
- Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
- CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
- Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
తాజాగా ఇదే అంశంపై లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ.. మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు. ట్రంప్ సుంకాలకు ప్రధాని మోడీ తలవంచాల్సిందేనని.. ఇది గ్యారంటీ అని.. తన మాటల మీద నమ్మకం లేకపోతే రాసిపెట్టుకోవాలని రాహుల్గాంధీ సవాల్ విసిరారు.
ఇది కూడా చదవండి: Lopaliki Ra Chepta : లోపలికి రా చెప్తా రివ్యూ..
ఇక శుక్రవారం కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారతదేశం పటిష్ట విధానాలను కలిగి ఉంటుందని.. ఎప్పుడూ తొందరపడదని చెప్పారు. గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామని చెప్పారు. ఇరు వర్గాలకు లాభదాయకంగా ఉంటేనే ఒప్పందాలు అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. అయితే ట్రంప్ విధించిన గడువు మరికొన్ని గంటల్లోనే ముగుస్తుంది. ఆలోపే చర్చలు ముగిస్తామని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. అయితే పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై రాహుల్గాంధీ తాజాగా స్పందిస్తూ.. ట్రంప్ సుంకాలకు మోడీ సర్కార్ తలొగ్గాల్సిందేనని వ్యాఖ్యానించారు. అవసరమైతే రాసిపెట్టుకోవాలని సూచించారు.
భారతదేశానికి వ్యవసాయం, పాడి పరిశ్రమ అనేది చాలా సెంటిమెంట్. అలాంటిది వాటిపైనే అమెరికా సడలింపు కోరుతోంది. ఒకవేళ భారత్ తలొగ్గితే.. అన్నదాతలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే భారత్ తర్జనభర్జన పడుతోంది. గడువు దగ్గర పడుతున్నా.. ఎటూ తేల్చుకోలేకపోతుంది. వాస్తవానికి ఇరుదేశాల అధికారుల చర్చలైతే ముగిశాయి. చివరిగా ట్రంప్-మోడీ మాట్లాడుకునే దానిని బట్టే ఒప్పందాలు ఫైనల్ అవుతాయి. చివరికి ఏమవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..