Rahul Gandi: ట్రంప్ సుంకాలకు మోడీ తలవంచుతారు.. రాసి పెట్టుకోవాలన్న రాహుల్గాంధీ
- ట్రంప్ సుంకాలకు మోడీ శిరసావహిస్తారు
- రాసి పెట్టుకోవాలన్న రాహుల్గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్లైన్ మరికొన్ని గంటల్లో ముగుస్తోంది. ఆయా దేశాలకు గడువు ముంచుకొస్తోంది. యూకే, వియత్నాం, చైనా తప్ప.. ఇంకా ఏ దేశాలు అమెరికాతో ఒప్పందాలు చేసుకోలేదు. భారత్తో కీలక డీల్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నా.. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. వ్యవసాయం, పాడి శ్రమకు సంబంధించిన డీల్ పెట్టుకుంటే ముప్పు వాటిల్లుతుందేమోనని భారత్ భయపడుతోంది. ఒకవేళ ఒప్పందం చేసుకోకపోతే మాత్రం భారీగా సుంకాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య గందరగోళం నెలకొంది.
ఇది కూడా చదవండి: Dhoolpet: దేవుడి చిత్రపటాల వెనుక గంజాయి పెట్టి.. పూజలు చేస్తున్నట్టు డ్రామా.. పోలీసుల ఎంట్రీతో
Also Read
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
తాజాగా ఇదే అంశంపై లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ.. మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు. ట్రంప్ సుంకాలకు ప్రధాని మోడీ తలవంచాల్సిందేనని.. ఇది గ్యారంటీ అని.. తన మాటల మీద నమ్మకం లేకపోతే రాసిపెట్టుకోవాలని రాహుల్గాంధీ సవాల్ విసిరారు.
ఇది కూడా చదవండి: Lopaliki Ra Chepta : లోపలికి రా చెప్తా రివ్యూ..
ఇక శుక్రవారం కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారతదేశం పటిష్ట విధానాలను కలిగి ఉంటుందని.. ఎప్పుడూ తొందరపడదని చెప్పారు. గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామని చెప్పారు. ఇరు వర్గాలకు లాభదాయకంగా ఉంటేనే ఒప్పందాలు అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. అయితే ట్రంప్ విధించిన గడువు మరికొన్ని గంటల్లోనే ముగుస్తుంది. ఆలోపే చర్చలు ముగిస్తామని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. అయితే పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై రాహుల్గాంధీ తాజాగా స్పందిస్తూ.. ట్రంప్ సుంకాలకు మోడీ సర్కార్ తలొగ్గాల్సిందేనని వ్యాఖ్యానించారు. అవసరమైతే రాసిపెట్టుకోవాలని సూచించారు.
భారతదేశానికి వ్యవసాయం, పాడి పరిశ్రమ అనేది చాలా సెంటిమెంట్. అలాంటిది వాటిపైనే అమెరికా సడలింపు కోరుతోంది. ఒకవేళ భారత్ తలొగ్గితే.. అన్నదాతలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే భారత్ తర్జనభర్జన పడుతోంది. గడువు దగ్గర పడుతున్నా.. ఎటూ తేల్చుకోలేకపోతుంది. వాస్తవానికి ఇరుదేశాల అధికారుల చర్చలైతే ముగిశాయి. చివరిగా ట్రంప్-మోడీ మాట్లాడుకునే దానిని బట్టే ఒప్పందాలు ఫైనల్ అవుతాయి. చివరికి ఏమవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కు గుడ్బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క