Suella Braverman: బ్రిటిష్ అమ్మాయిలపై అఘాయిత్యాలు.. “పాకిస్తాన్ సంతతి” వ్యక్తుల ప్రమేయమే అధికం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suella Braverman: బ్రిటిష్ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ అక్కడ ‘‘గ్రూమింగ్ గ్యాంగులు’’ రెచ్చిపోతున్నాయి. టీనేజ్ అమ్మాయిలను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్న గ్యాంగులను అణిచివేస్తానని గతేడాది జరిగిన ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ ప్రధాన హమీల్లో ఒకటిగా ఉంది. తాజాగా బ్రిటన్ హోం మినిస్టర్ సువెల్ల బ్రావెర్ మాన్ ఇంగ్లీష్ అమ్మాయిలపై వేధింపుకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ముఖ్యంగా పాకిస్తాన్ సంతతికి చెందినవారు బ్రిటిష్ అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. యూకేలో అమ్మాయిలపై అత్యాచారాలు, వేధింపులు, డ్రగ్స్ కు బానిస చేస్తున్నవారిలో అధికంగా పాకిస్తాన్ సంతతికి చెందిన బ్రిటిష్ వ్యక్తులు ఉంటున్నారని అన్నారు. వేలాది పిల్లల బాల్యాన్ని దోచుకుంటూ, నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నేరస్తులను గుర్తించి కనికరం లేకుండా గుర్తించి శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. యూకేలో గ్రూమింగ్ ముఠాలు బలవంతంగా, భయపెట్టి పిల్లలను లైంగికంగా దోపిడీ చేస్తున్నాయి. ఇలాంటి ముఠాలు బలహీనంగా ఉన్న పిల్లలను టార్గెట్ చేస్తుంటాయి. గ్రూమింగ్ ముఠాలు మన దేశానికి మచ్చ అని సువెల్ల బ్రావెర్ మాన్ అన్నారు.
Also Read
- Sheikh Hasina: "నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు": షేక్ హసీనా
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
Read Also: Harish Rao: పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్
అమ్మాయిలపై జరిగే వేధింపులను తగ్గించే చర్యల అమల్లోకి తెచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొంతకాలంగా విస్తృత సంప్రదింపులు జరుపుతోంది. గతంలో స్వతంత్ర దర్యాప్తు విభాగం ఐఐసీఎస్ఏ చేసిన సిఫార్సులను పరిగణలోకి తీసుకుని కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. లైంగిక వేధింపుల నమోదును చట్టబద్ధం చేసింది. వీటి ప్రకారం చిన్నారులు రక్షణ విభాగాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు నుంచి ఫిర్యాదు అందిన వెంటనే నమోదు చేయాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
భారత విదేశీ గూఢచార సంస్థ మాజీ అధిపది విక్రమ్ సూద్ ప్రకారం.. 1997 నుంచి యూకేలో బాలలపై వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు. 2014 వరకు దాదాపుగా 1400 ముస్లిమేతర బ్రిటన్ అమ్మాయిలపై పాకిస్తానీ సంతతికి చెందిన వ్యక్తులే క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. జాత్యాహంకారం, ఇంటర్ కమ్యూనిటీ సంబంధాలను దెబ్బతిస్తున్నారనే ఆరోపణలు వస్తాయనే భయంతో అక్కడి పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!