Suella Braverman: బ్రిటిష్ అమ్మాయిలపై అఘాయిత్యాలు.. “పాకిస్తాన్ సంతతి” వ్యక్తుల ప్రమేయమే అధికం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suella Braverman: బ్రిటిష్ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ అక్కడ ‘‘గ్రూమింగ్ గ్యాంగులు’’ రెచ్చిపోతున్నాయి. టీనేజ్ అమ్మాయిలను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్న గ్యాంగులను అణిచివేస్తానని గతేడాది జరిగిన ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ ప్రధాన హమీల్లో ఒకటిగా ఉంది. తాజాగా బ్రిటన్ హోం మినిస్టర్ సువెల్ల బ్రావెర్ మాన్ ఇంగ్లీష్ అమ్మాయిలపై వేధింపుకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ముఖ్యంగా పాకిస్తాన్ సంతతికి చెందినవారు బ్రిటిష్ అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. యూకేలో అమ్మాయిలపై అత్యాచారాలు, వేధింపులు, డ్రగ్స్ కు బానిస చేస్తున్నవారిలో అధికంగా పాకిస్తాన్ సంతతికి చెందిన బ్రిటిష్ వ్యక్తులు ఉంటున్నారని అన్నారు. వేలాది పిల్లల బాల్యాన్ని దోచుకుంటూ, నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నేరస్తులను గుర్తించి కనికరం లేకుండా గుర్తించి శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. యూకేలో గ్రూమింగ్ ముఠాలు బలవంతంగా, భయపెట్టి పిల్లలను లైంగికంగా దోపిడీ చేస్తున్నాయి. ఇలాంటి ముఠాలు బలహీనంగా ఉన్న పిల్లలను టార్గెట్ చేస్తుంటాయి. గ్రూమింగ్ ముఠాలు మన దేశానికి మచ్చ అని సువెల్ల బ్రావెర్ మాన్ అన్నారు.
Also Read
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
Read Also: Harish Rao: పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్
అమ్మాయిలపై జరిగే వేధింపులను తగ్గించే చర్యల అమల్లోకి తెచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొంతకాలంగా విస్తృత సంప్రదింపులు జరుపుతోంది. గతంలో స్వతంత్ర దర్యాప్తు విభాగం ఐఐసీఎస్ఏ చేసిన సిఫార్సులను పరిగణలోకి తీసుకుని కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. లైంగిక వేధింపుల నమోదును చట్టబద్ధం చేసింది. వీటి ప్రకారం చిన్నారులు రక్షణ విభాగాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు నుంచి ఫిర్యాదు అందిన వెంటనే నమోదు చేయాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
భారత విదేశీ గూఢచార సంస్థ మాజీ అధిపది విక్రమ్ సూద్ ప్రకారం.. 1997 నుంచి యూకేలో బాలలపై వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు. 2014 వరకు దాదాపుగా 1400 ముస్లిమేతర బ్రిటన్ అమ్మాయిలపై పాకిస్తానీ సంతతికి చెందిన వ్యక్తులే క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. జాత్యాహంకారం, ఇంటర్ కమ్యూనిటీ సంబంధాలను దెబ్బతిస్తున్నారనే ఆరోపణలు వస్తాయనే భయంతో అక్కడి పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!