Suella Braverman: బ్రిటిష్ అమ్మాయిలపై అఘాయిత్యాలు.. “పాకిస్తాన్ సంతతి” వ్యక్తుల ప్రమేయమే అధికం
Suella Braverman: బ్రిటిష్ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ అక్కడ ‘‘గ్రూమింగ్ గ్యాంగులు’’ రెచ్చిపోతున్నాయి. టీనేజ్ అమ్మాయిలను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్న గ్యాంగులను అణిచివేస్తానని గతేడాది జరిగిన ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ ప్రధాన హమీల్లో ఒకటిగా ఉంది. తాజాగా బ్రిటన్ హోం మినిస్టర్ సువెల్ల బ్రావెర్ మాన్ ఇంగ్లీష్ అమ్మాయిలపై వేధింపుకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ముఖ్యంగా పాకిస్తాన్ సంతతికి చెందినవారు బ్రిటిష్ అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. యూకేలో అమ్మాయిలపై అత్యాచారాలు, వేధింపులు, డ్రగ్స్ కు బానిస చేస్తున్నవారిలో అధికంగా పాకిస్తాన్ సంతతికి చెందిన బ్రిటిష్ వ్యక్తులు ఉంటున్నారని అన్నారు. వేలాది పిల్లల బాల్యాన్ని దోచుకుంటూ, నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నేరస్తులను గుర్తించి కనికరం లేకుండా గుర్తించి శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. యూకేలో గ్రూమింగ్ ముఠాలు బలవంతంగా, భయపెట్టి పిల్లలను లైంగికంగా దోపిడీ చేస్తున్నాయి. ఇలాంటి ముఠాలు బలహీనంగా ఉన్న పిల్లలను టార్గెట్ చేస్తుంటాయి. గ్రూమింగ్ ముఠాలు మన దేశానికి మచ్చ అని సువెల్ల బ్రావెర్ మాన్ అన్నారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
Read Also: Harish Rao: పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్
అమ్మాయిలపై జరిగే వేధింపులను తగ్గించే చర్యల అమల్లోకి తెచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొంతకాలంగా విస్తృత సంప్రదింపులు జరుపుతోంది. గతంలో స్వతంత్ర దర్యాప్తు విభాగం ఐఐసీఎస్ఏ చేసిన సిఫార్సులను పరిగణలోకి తీసుకుని కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. లైంగిక వేధింపుల నమోదును చట్టబద్ధం చేసింది. వీటి ప్రకారం చిన్నారులు రక్షణ విభాగాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు నుంచి ఫిర్యాదు అందిన వెంటనే నమోదు చేయాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
భారత విదేశీ గూఢచార సంస్థ మాజీ అధిపది విక్రమ్ సూద్ ప్రకారం.. 1997 నుంచి యూకేలో బాలలపై వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు. 2014 వరకు దాదాపుగా 1400 ముస్లిమేతర బ్రిటన్ అమ్మాయిలపై పాకిస్తానీ సంతతికి చెందిన వ్యక్తులే క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. జాత్యాహంకారం, ఇంటర్ కమ్యూనిటీ సంబంధాలను దెబ్బతిస్తున్నారనే ఆరోపణలు వస్తాయనే భయంతో అక్కడి పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!