Trump-Netanyahu: ఫోన్లో ట్రంప్-నెతన్యాహు మధ్య వాగ్యుద్ధం.. ట్రంప్ అరిచినట్లుగా ప్రచారం!
- ఫోన్లో ట్రంప్-నెతన్యాహు మధ్య వాగ్యుద్ధం
- ట్రంప్ అరిచినట్లుగా ప్రచారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా ట్రంప్నకు శాంతి బహుమతి ఇవ్వాలని నెతన్యాహు మద్దతు కూడా ఇచ్చారు. అంతటి మంచి సంబంధాలు ఉన్న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణలో నెతన్యాహుపై ట్రంప్ అరిచినట్లుగా నివేదికలు అందుతున్నాయి.
ఇది కూడా చదవండి: TGSRTC: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక బస్సులు.. చార్జీలలో మార్పులు!
Also Read
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
- China: జిన్పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక 'అసలు' మిస్టరీ ఇదేనా!
- Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
గాజాలో ఈ మధ్య ఆకలి చావులు ఎక్కువైపోయాయి. చిన్నారులు, వృద్ధులు ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన సంభాషణలో ఆకలి చావులు జరుగుతున్నాయన్న వార్తలు నిజమైనవి కాదని.. అదంతా హమాస్ ప్రచారం మాత్రమేనని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు నెతన్యాహుపై ట్రంప్ అరిచినట్లుగా ఎన్బీసీ న్యూస్ నివేదించింది. అయితే ఈ వార్త అంతర్జాతీయంగా వ్యాప్తి చెందడంతో ఇజ్రాయెల్ పీఎంవో స్పందించింది. ఈ వార్త నకిలీదిగా పేర్కొంది. ఇద్దరి మధ్య అలాంటిదేమీ జరగలేదని కొట్టిపారేసింది.
ఇది కూడా చదవండి: Prostitution Racket: భారత్ చూపిస్తామంటూ బంగ్లాదేశీ మైనర్ అమ్మాయిని వ్యభిచారంలోకి నెట్టిన స్నేహితురాలు!
ఈ మధ్య గాజాలో ఆకలి చావులు అంటూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు బయటకు వచ్చాక అంతర్జాతీయంగా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెరిగింది. తక్షణమే కాల్పులు ఆపాలని.. గాజాలోకి ఆహారం వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ పెరిగింది. దీంతో ఇజ్రాయెల్.. స్వచ్ఛంద సంస్థలకు అనుమతి ఇచ్చింది. అయినా కూడా దాడులు జరగడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఫొటోలు బయటకు వచ్చాకే.. ట్రంప్-నెతన్యాహు మధ్య సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సంభాషణలోనే నెతన్యాహుపై ట్రంప్ అరిచినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ మాత్రం ఖండించింది.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!