Vijay: కరూర్ తొక్కిసలాట తర్వాత నేడు పబ్లిక్లోకి వస్తున్న విజయ్.. వేదిక ఎక్కడంటే..!
- కరూర్ తొక్కిసలాట తర్వాత పబ్లిక్లోకి వస్తున్న విజయ్
- పక్క రాష్ట్రాల్లో మద్దతు కూడబెట్టేందుకు విజయ్ ప్రయత్నం
- ఈరోజు పుదుచ్చేరిలో విజయ్ ర్యాలీ.. బహిరంగ సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరూర్ తొక్కిసలాట తర్వాత టీవీకే అధినేత విజయ్ తొలిసారి పబ్లిక్లోకి వస్తున్నారు. మంగళవారం రోడ్షో, బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈసారి తమిళనాడు కాకుండా వేదిక పుదుచ్చేరికి మారింది. పుదుచ్చేరి వేదికగా విజయ్ రాజకీయ బహిరంగ సభలో పాల్గొననున్నారు. తొలుత ఇరుకైన వీధులు, ఇరుకైన దారులు ఉన్నాయంటూ రోడ్షోకు పుదుచ్చేరి పోలీసులు అనుమతి నిరాకరించారు. మొత్తానికి కఠినమైన షరతులతో విజయ్ రోడ్షోకు అనుమతి ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Japan Earthquake: జపాన్లో భారీ భూకంపం.. 7.6 తీవ్రత.. సునామీ హెచ్చరిక జారీ
Also Read
- Ketan Murder Case: కేతన్ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
- INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
- Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
సెప్టెంబర్లో తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం మృతుల కుటుంబాలకు విజయ్ ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత విజయ్ మళ్లీ పబ్లిక్లోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా మీడియా కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది.
కఠిన షరతులు..
ఇక పుదుచ్చేరి రోడ్షోకు విజయ్కు కఠినమైన షరతులు విధించారు. కేవలం 5,000 మందికే అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా టీవీకే జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఉన్న కార్లకే ప్రవేశం కల్పించనున్నారు. ఇక తమిళనాడు నుంచి ఎవరు వచ్చినా రోడ్షోకు అనుమతించరు. ఇక 500 మందికి ఒక ఎన్క్లోజర్ ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్స్లు, ఇతర భద్రతా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఇక విజయ్ ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రసంగించే అవకాశం ఉంది. పోలీసులు ఆదేశించిన ప్రకారం బహిరంగ సభ మధ్యాహ్నం 12:30 గంటలలోపు ముగించాలి. ఇక రోడ్షోలో భద్రతాగా 800 పోలీసులు మోహరించనున్నారు. ఇదిలా ఉంటే గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధులు భద్రతా కారణాల దృష్ట్యా హాజరుకావద్దని పార్టీ ఒక సలహాలో కోరింది. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు భవనాలు, పైకప్పులు, చెట్లపైకి లేదా ట్రాన్స్ఫార్మర్లను ఎక్కడానికి దూరంగా ఉండాలని కోరింది.
ఇది కూడా చదవండి: Sumalatha Johnny Master: తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య సుమలత ఘన విజయం..!
విజయ్.. తమిళనాడుతో పాటు కేరళ, పుదుచ్చేరిలో కూడా మద్దతు కూడా బెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు పుదుచ్చేరిలో పార్టీ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక పుదుచ్చేరి రోడ్షో అయిపోయిన తర్వాత ఈనెలాఖరు నుంచి తమిళనాడు వ్యాప్తంగా విజయ్ పర్యటనలు చేపట్టనున్నారు.
తాజావార్తలు
-
Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్పై వేటు?
-
Ketan Murder Case: కేతన్ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
-
Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్
-
Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
-
INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
ట్రెండింగ్
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!