Nepal: నేపాల్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు.. దుబాయ్కు పారిపోయేందుకు ప్రధాని కేపీ శర్మ ఏర్పాట్లు!
- నేపాల్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు
- దుబాయ్కు పారిపోయేందుకు ప్రధాని కేపీ శర్మ ఏర్పాట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. దీంతో భద్రతా దళాలు-నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది నిరసనకారులు చనిపోయారు. ఇక కేపీ శర్మ ఓలి ప్రభుత్వం నిరసనలకు దిగొచ్చి… సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ను ఎత్తేసింది.

Also Read
అయినా కూడా రెండో రోజు ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ఖాట్మండ్లో ఉద్రిక్తలు ఉధృతం అయ్యాయి. పార్లమెంట్ ముందు నిరసనకారులు చెలరేగిపోయారు. వీధుల్లో రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించారు. నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ ఇంటిని నిరసనకారులు ధ్వంసం చేశారు. మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో ప్రధాని కేపీ శర్మ ఓలి దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన విమానాన్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు.

కర్ఫ్యూ అమల్లో ఉన్న కూడా నిరసనకారులు పోలీసులతో గొడవలకు దిగుతున్నారు. ప్రభుత్వంలో ‘‘హంతకులను శిక్షించండి.. పిల్లలను చంపడం ఆపండి’’ అంటూ నినాదాలు చేశారు. నిరసనకారుల మరణాలకు కారణమైన ప్రధాని ఓలి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని నేపాలీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గగన్ థాపా డిమాండ్ చేశారు.
నిరసనలకు కారణం ఇదే..
దేశంలో ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ సహా పలు సోషల్ నెట్వర్కులపై గత వారం ప్రభుత్వం బ్యాన్ విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం పెద్ద ఎత్తున ఖాట్మండులో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఈ ఘటనలో 20 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. ‘‘సోషల్ మీడియాపై నిషేధం కాదు.. అవినీతిపై నిషేధం విధించండి’’ అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలు ఊపుతూ నినాదాలుు చేశారు. దాదాపు 10 వేల మందికి పైగా జనాలు వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు.
VIDEO | Kathmandu: Tensions erupt in Nepal's capital after a government-imposed social media ban, sparking massive public outrage. Protesters clashed with security forces, wielding posters and banners demanding freedom of expression. Heavy police deployment reported across key… pic.twitter.com/r3qyHs1j3t
— Press Trust of India (@PTI_News) September 8, 2025
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!