Nepal: నేపాల్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు.. దుబాయ్కు పారిపోయేందుకు ప్రధాని కేపీ శర్మ ఏర్పాట్లు!
- నేపాల్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు
- దుబాయ్కు పారిపోయేందుకు ప్రధాని కేపీ శర్మ ఏర్పాట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. దీంతో భద్రతా దళాలు-నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది నిరసనకారులు చనిపోయారు. ఇక కేపీ శర్మ ఓలి ప్రభుత్వం నిరసనలకు దిగొచ్చి… సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ను ఎత్తేసింది.

Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
అయినా కూడా రెండో రోజు ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ఖాట్మండ్లో ఉద్రిక్తలు ఉధృతం అయ్యాయి. పార్లమెంట్ ముందు నిరసనకారులు చెలరేగిపోయారు. వీధుల్లో రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించారు. నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ ఇంటిని నిరసనకారులు ధ్వంసం చేశారు. మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో ప్రధాని కేపీ శర్మ ఓలి దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన విమానాన్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు.

కర్ఫ్యూ అమల్లో ఉన్న కూడా నిరసనకారులు పోలీసులతో గొడవలకు దిగుతున్నారు. ప్రభుత్వంలో ‘‘హంతకులను శిక్షించండి.. పిల్లలను చంపడం ఆపండి’’ అంటూ నినాదాలు చేశారు. నిరసనకారుల మరణాలకు కారణమైన ప్రధాని ఓలి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని నేపాలీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గగన్ థాపా డిమాండ్ చేశారు.
నిరసనలకు కారణం ఇదే..
దేశంలో ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ సహా పలు సోషల్ నెట్వర్కులపై గత వారం ప్రభుత్వం బ్యాన్ విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం పెద్ద ఎత్తున ఖాట్మండులో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఈ ఘటనలో 20 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. ‘‘సోషల్ మీడియాపై నిషేధం కాదు.. అవినీతిపై నిషేధం విధించండి’’ అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలు ఊపుతూ నినాదాలుు చేశారు. దాదాపు 10 వేల మందికి పైగా జనాలు వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు.
VIDEO | Kathmandu: Tensions erupt in Nepal's capital after a government-imposed social media ban, sparking massive public outrage. Protesters clashed with security forces, wielding posters and banners demanding freedom of expression. Heavy police deployment reported across key… pic.twitter.com/r3qyHs1j3t
— Press Trust of India (@PTI_News) September 8, 2025
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!