Afghanistan: మహిళలకు తాలిబన్లు షాక్.. ఇది మహా దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban Government Gives Shock To Women Officials: గతేడాది ఆగస్టులో అధికారం కైవసం చేసుకున్నప్పటి నుంచి తాలిబన్లు మహిళల హక్కుల్ని కాలరాస్తూ వస్తున్నారు. వారిపై కఠిన ఆంక్షలు విధిస్తూ.. పురుషాధిక్య విధానాల్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేశారు. మహిళా ఉద్యోగులపై కొరడా ఝుళపించారు. వారిని ఆఫీసుకు రావొద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా బంధువుల్లోని మగాళ్లని పంపాలని తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయాన్ని ఓ మహిళా ఉద్యోగి వెల్లడించింది.
‘‘నాకు రీసెంట్గా తాలిబన్ అధికారుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఆఫీస్లో పని భారం పెరుగుతోంది. అంత పని మీరు చేయలేరు కాబట్టి, మీ స్థానంలో మీకు తెలిసిన పురుషుడ్ని పంపండి’ అని చెప్పారు’’ ఆ మహిళ తెలిపింది. అంతేకాదు.. తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి తమ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, తన పదవిని సైతం తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేసింది. రూ. 60 వేలు ఉన్న తన జీతాన్ని ఏకంగా రూ. 12 వేలుకి తగ్గించారని, ఇదేంటని ప్రశ్నిస్తే పై అధికారి దురుసుగా ప్రవర్తించాడని పేర్కొంది. ఇచ్చిన జీతంతో పని చేస్తే ఉండమని, లేకపోతే వెళ్లిపోవచ్చని తనని బెదిరించారంది. 15 ఏళ్లుగా తాను ఆర్థిక శాఖలో పని చేస్తున్నానని, బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చేశానని, కానీ తన చదువుకు తగ్గ హోదా దక్కట్లేదని ఆ మహిళా ఉద్యోగి మొరపెట్టుకుంది.
Also Read
- Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
- Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
- Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
కాగా.. మహిళలపై తాలిబన్లు ప్రదర్శించిన తీరుని అంతర్జాతీయ సమాజం ఇదివరకే తీవ్రంగా తప్పుబట్టింది. మహిళలపై విధించిన ఆంక్షల వల్ల అఫ్గాన్ ఆర్థికంగా ఒక బిలియన్ డాలర్లు (అఫ్గాన్ జీడీపీలో 5 శాతం) నష్టపోతుందని ఐక్యరాజ్యసమితి మహిళల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బాహౌస్ అంచనా వేశారు. ఆఫ్గాన్ తిరిగి పేదరికంలోకి వెళ్లిపోయిందని.. ఒక తరం మొత్తానికి ఆహార భద్రత, పోషకాహార లోపం ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!