Srilanka: కీలక నిర్ణయం.. భారతీయ వ్యాపారవేత్తలకు ఐదేళ్ల వీసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ద్వీపదేశం శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది. ప్రధాని పదవి నుంచి మహిందా రాజపక్స తప్పుకున్న తరువాత పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్త ప్రధాని రణిల్ విక్రమ సింఘే దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఐఎంఎఫ్, విదేశాల నుంచి సహాయం కోసం శ్రీలంక ఎదురుచూస్తోంది. 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం నెలకొంది. ఇప్పటికే ఆ దేశంలో పెట్రోల్ కోసం ప్రజలు రోజుల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్రోలియం ఉత్పత్తులను కొనడానికి కూడా శ్రీలంక వద్ద విదేశీ మారక నిల్వలు లేవు.
ఇదిలా ఉంటే దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో వ్యాపారాన్ని ప్రోత్సహించే విధంగా భారతీయ వ్యాపారవేత్తలకు ఐదేళ్ల వీసాలు జారీ చేస్తున్నారు. శ్రీలంక మంత్రి ధమ్మిక పెరీరా దేశంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారతీయ వ్యాపారవేత్తలకు ఐదేళ్ల వీసాలు అందచేశారు. వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడానికి, పెట్టుబడులను ప్రోత్సహించేందుక ఈ చర్య తీసుకున్నారు.
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
భారత్, శ్రీలంక మధ్య వ్యాపార సంబంధాలను సులభతరం చేసేందుకు గత బుధవారం భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే, శ్రీలంక వాణిజ్య మంత్రి నలిన్ ఫెర్నాండోతో కీలక చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే మనవతా సహాయం కింద భారత్, శ్రీలంకకు పెట్రోలియం ఉత్పత్తులు, ఆహారం, ఔషధాలను అందచేస్తోంది. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న శ్రీలంకను రక్షించేందుకు సహాయపడుతోంది. భారత్ చేస్తున్న సాయాన్ని చైనా కూడా కొనియాడింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!