Srilanka Economic Crisis: సంక్షోభ నివారణకు అన్ని ప్రయత్నాలు చేశా: గొటబాయ రాజపక్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. ప్రజల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో గత శనివారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ మహింద యాప అబేవర్థనకు పంపాడు. తాజాగా సంక్షోభం నేపథ్యంలో శనివారం శ్రీలంక పార్లమెంట్ సమావేశం అయింది. గొటబాయ రాజపక్స రాజనీమా లేఖను పార్లమెంటరీ సెక్రటరీ జనరల్ ధమ్మిక దసనాయకే చదివి వినిపించారు.
‘‘శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని.. రాజపక్సే లేఖలో పేర్కొన్నారు. తన కన్నా ముందు ఉన్న ప్రభుత్వాలు ఆర్థిక దుర్వినియోగం వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తిందని అన్నారు. కోవిడ్ వల్ల శ్రీలంకకు విదేశీ పర్యాటకులు రాకపోవడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. సంక్షోభాన్ని నివారించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించాని నా వ్యక్తిగత నమ్మకం.. ఇందులో భాగంగానే అఖిల పక్ష ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించా’’ అని రాజీనామా లేఖలో గొటబయ రాజపక్స పేర్కొన్నాడు.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
Read Also: Telangana Weather Report: వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రస్తుతం రణిల్ విక్రమసింఘే బాధ్యతలు తీసుకున్నాడు. తాజాగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక గురించి పార్లమెంట్ చర్చించేందుకు సమావేశం అయింది. అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు స్వీకరించేందుకు మరోసారి మంగళవారం పార్లమెంట్ సమావేశం కానుంది. బుధవారం అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా బలగాలు పార్లమెంట్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశాయి. అయితే రాజపక్స రాజీనామాతో శ్రీలంకలో ఆందోళనలు కొంతమేర చల్లారాయి. శ్రీలంకలో నిత్యావసరాల ధరలు పెరగడం.. ఇంధన సంక్షోభంతో గత మార్చి నుంచి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. గొటబయ రాజపక్స రాజీనామాతో ప్రజల ఆందోళనలు సద్దుమణిగాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!