Srilanka Economic Crisis: సంక్షోభ నివారణకు అన్ని ప్రయత్నాలు చేశా: గొటబాయ రాజపక్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. ప్రజల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో గత శనివారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ మహింద యాప అబేవర్థనకు పంపాడు. తాజాగా సంక్షోభం నేపథ్యంలో శనివారం శ్రీలంక పార్లమెంట్ సమావేశం అయింది. గొటబాయ రాజపక్స రాజనీమా లేఖను పార్లమెంటరీ సెక్రటరీ జనరల్ ధమ్మిక దసనాయకే చదివి వినిపించారు.
‘‘శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని.. రాజపక్సే లేఖలో పేర్కొన్నారు. తన కన్నా ముందు ఉన్న ప్రభుత్వాలు ఆర్థిక దుర్వినియోగం వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తిందని అన్నారు. కోవిడ్ వల్ల శ్రీలంకకు విదేశీ పర్యాటకులు రాకపోవడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. సంక్షోభాన్ని నివారించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించాని నా వ్యక్తిగత నమ్మకం.. ఇందులో భాగంగానే అఖిల పక్ష ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించా’’ అని రాజీనామా లేఖలో గొటబయ రాజపక్స పేర్కొన్నాడు.
Also Read
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- 39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
- Explainer: చరిత్రలో దాచిన ఆకలి విషాదం.. 30లక్షల మంది భారతీయుల చావుకు చర్చిల్ కారణం?
- US Citizenship Fee Hike: ఎన్నారైలకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న అమెరికా సిటిజన్షిప్ ఫీజులు?
Read Also: Telangana Weather Report: వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రస్తుతం రణిల్ విక్రమసింఘే బాధ్యతలు తీసుకున్నాడు. తాజాగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక గురించి పార్లమెంట్ చర్చించేందుకు సమావేశం అయింది. అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు స్వీకరించేందుకు మరోసారి మంగళవారం పార్లమెంట్ సమావేశం కానుంది. బుధవారం అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా బలగాలు పార్లమెంట్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశాయి. అయితే రాజపక్స రాజీనామాతో శ్రీలంకలో ఆందోళనలు కొంతమేర చల్లారాయి. శ్రీలంకలో నిత్యావసరాల ధరలు పెరగడం.. ఇంధన సంక్షోభంతో గత మార్చి నుంచి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. గొటబయ రాజపక్స రాజీనామాతో ప్రజల ఆందోళనలు సద్దుమణిగాయి.
తాజావార్తలు
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Norton Atlas India: భారత మార్కెట్లోకి నార్టన్ బైక్స్.. హోసూర్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం.. జూలైలో గ్లోబల్ లాంచ్!
-
PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
-
Vaibhav Sooryavanshi: సచిన్ లాంటి ప్రతిభ కానీ.. వైభవ్ సూర్యవంశీపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు!
-
NBK 112 : ముద్దుల మావయ్యకి ధన్యవాదాలు : నారా లోకేష్
ట్రెండింగ్
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..