Telangana Weather Report: వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి.. కొన్ని ఏళ్ల తర్వాత జులై నెలలో భారీ స్థాయిలో వరదలు ముంచెతాయి.. గోదావరి పరిసర ప్రాంతాలు ఇంకా జల దిగ్భందంలోనే ఉన్నాయి.. భద్రాచలం దగ్గర పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. అయితే, ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది.. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలను ఓ సారి పరిశీలిస్తే.. నిన్న ఒడిశా తీరం, పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతూ ఉంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచనల విషయానికి వస్తే.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలలో అక్క డక్కడ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. కాగా, భద్రాచలం దగ్గర గోదావరిలో నీటి ఉధృతి కొనసాగుతూనే ఉంది.. ఇంకా 70 అడుగులకు పైగానే ప్రవాహం ఉండడంతో.. చాలా ప్రాంతాల్లో నీటిలో మునిగిపోయాయి.. ఇళ్లను, గూడాలను వదిలి.. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు ప్రజలు. సరైన సౌకర్యాలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
- Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
ఇక, భద్రాచలంలో సుభాష్నగర్ కాలనీవాసులు ఆందోళన దిగారు.. గోదావరి కరకట్టను పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు.. వారితో అధికారులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో హామీ ఇచ్చినా ఆందోళన విరమించలేదు.. మరోవైపు.. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే పోడెం వీరయ్యతో వాగ్వాదానికి దిగారు స్థానికులు.. దీంతో, బాధితులతో కలిసి బైఠాయించారు ఎమ్మెల్యే పోడెం.. వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ ఘటనా స్థలానికి రావాలని.. కరకట్టపై హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. అప్పటి వరకు కదిలేది లేదని హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
-
Annamalai: కొత్త పార్టీ పెడతారా?.. బీజేపీకి గుడ్బై చెప్పనున్నారా? అన్నామలై నిర్ణయంపై ఉత్కంఠ..!
-
Vaibhav Sooryavanshi Earnings: ఐపీఎల్ 2026లో వైభవ్ ఎంత సంపాదించాడో తెలుసా?.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Ponnam Prabhakar – Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
-
Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!