Telangana Weather Report: వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి.. కొన్ని ఏళ్ల తర్వాత జులై నెలలో భారీ స్థాయిలో వరదలు ముంచెతాయి.. గోదావరి పరిసర ప్రాంతాలు ఇంకా జల దిగ్భందంలోనే ఉన్నాయి.. భద్రాచలం దగ్గర పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. అయితే, ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది.. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలను ఓ సారి పరిశీలిస్తే.. నిన్న ఒడిశా తీరం, పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతూ ఉంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచనల విషయానికి వస్తే.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలలో అక్క డక్కడ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. కాగా, భద్రాచలం దగ్గర గోదావరిలో నీటి ఉధృతి కొనసాగుతూనే ఉంది.. ఇంకా 70 అడుగులకు పైగానే ప్రవాహం ఉండడంతో.. చాలా ప్రాంతాల్లో నీటిలో మునిగిపోయాయి.. ఇళ్లను, గూడాలను వదిలి.. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు ప్రజలు. సరైన సౌకర్యాలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
ఇక, భద్రాచలంలో సుభాష్నగర్ కాలనీవాసులు ఆందోళన దిగారు.. గోదావరి కరకట్టను పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు.. వారితో అధికారులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో హామీ ఇచ్చినా ఆందోళన విరమించలేదు.. మరోవైపు.. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే పోడెం వీరయ్యతో వాగ్వాదానికి దిగారు స్థానికులు.. దీంతో, బాధితులతో కలిసి బైఠాయించారు ఎమ్మెల్యే పోడెం.. వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ ఘటనా స్థలానికి రావాలని.. కరకట్టపై హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. అప్పటి వరకు కదిలేది లేదని హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
-
Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!