Canada: “పెరట్లో పామును పెంచుతున్నాం”.. ఖలిస్తానీలపై భారత సంతతి ఎంపీ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా వేదికగా మారుతోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా దేశాన్ని వినియోగించుకుంటున్నారు ఖలిస్తానీలు. ఇప్పటికే కెనడాలోని పలు భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. భారత్ నుంచి పంజాబ్ ను విభజించి సపరేట్ ఖలిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో భారతదేశానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కెనడానే కాకుండా యూకే, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు బలపడుతున్నారు.
Read Also: Tomatoes stolen: కర్ణాటకలో టమాటాల దొంగతనం.. కేసు నమోదు..
Also Read
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
ఇదిలా ఉంటే ఖలిస్తానీ చర్యలపై కెనడాలోని భారతసంతతికి చెందిన ఎంపీ, లిబరల్ పార్టీ నేత చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఖలిస్తాన్ మద్దతుదారులు కొంతమంది భారత దౌత్యవేత్తల ఫోటోలతో పోస్టర్లు వేసి బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనపై చంద్ర ఆర్య స్పందించారు. కెనడా ‘‘ పెరట్లో పాములు పెంచుతోంది, ఆ పాములు తల ఎత్తుకుని బుసలు కొడుతున్నాయి’’ అని హెచ్చరించారు. ఇలా పోస్టర్లో దౌత్యవేత్తలను బెదిరించడాన్ని ఖండించారు. కెనడాలో ఖలిస్తానీలు హింస, ద్వేషాన్ని ప్రొత్సహించడం ద్వారా హక్కులు, స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ట్వీట్ చేశారు. ఆ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. పెరట్లో పాములు బుసలు కొడుతున్నాయి, అవి ఎప్పుడు మనల్ని కాటేస్తాయో అనేదే ప్రశ్న అంటూ కామెంట్స్ చేశారు.
జూలై 8న జరగనున్న ‘ఖలిస్తాన్ ఫ్రీడమ్ ర్యాలీ’ని ఖలిస్తానీలు నిర్వహిస్తున్నారు. టొరంటో, అట్టావా, వాంకోవర్ నగరాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలకు పిలుపునిచ్చారు. ఓ పోస్టర్ విడుదల చేస్తూ.. ఒట్టావాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ మరియు టొరంటోలోని కాన్సుల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవను ‘‘కిల్లర్స్’’గా అభివర్ణించారు. వీరిని ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ కిల్లర్స్ గా పేర్కొన్నారు. గత నెల భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీని చంపేసిన విధానాన్ని ప్రతిబింబించేలా ఓ శకటాన్ని పెరేడో లో ప్రదర్శించారు. ఈ చర్యలు కెనడా, ఇండియా దేశాల మధ్య ఘర్షణలు ప్రేరేపించాయి. ఇదే జరుగుతూ ఉంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయిని విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగా స్పందించారు. సోమవారం భారత్ లోని కెనడా రాయబారికి సమన్లు జారీ చేసింది.
https://twitter.com/AryaCanada/status/1676373854678306817
తాజావార్తలు
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!