Tomatoes stolen: కర్ణాటకలో టమాటాల దొంగతనం.. కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato stolen: ఎప్పుడూ లేని విధంగా టమాటా రేట్లు పైపైకి వెళ్తున్నాయి. రాకెట్ వేగంతో టమాటా ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర సెంచరీని దాటింది. చాలా ప్రాంతాల్లో కిలో ధర రూ. 150కి పైగానే పలుకుతోంది. దీంతో సామాన్యుడు టమాటా కొనలేని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే పెరుగుతున్న ధర నేపథ్యంలో టమాటా దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో తోటలోని టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే జూలై 4వ తేదీ రాత్రి హసన్ జిల్లాలోని గోని సోమనహళ్లి గ్రామంలోని రూ. 2.5 లక్షల విలువై టమాటాలు చోరీకి గురయ్యాయని రైతు ఆరోపించాడు. బెంగళూర్ లో కిలో టమాటా రూ. 120కి చేరడంతో పంటను కోసి మార్కెట్ తరలించాలని యోచిస్తున్న సమయంలో తన 2 ఎకరాల్లోని టమాటాలను దొంగిలించారని మహిళా రైతు ధరణి తన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
Read Also: NCP Poster War: ఎన్సీపీలో పోస్టర్ వార్.. శరద్ పవార్ బాహుబలి.. అజిత్ పవార్ కట్టప్ప
శనగ పంటతో భారీ నష్టాలు చవిచూసి టమాటా సాగు చేశామని.. పంటను పండించేందుకు అప్పులు చేశానమి.. మాకు మంచి పంట చేతికొచ్చే సమయానికి దొంగలు టమాటాలను ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 50-60 బస్తాల టమాటాను తీసుకెళ్లడమే కాకుండా.. మిగిలిన పంటను కూడా దొంగలు ధ్వంసం చేసినట్లు ధరణి చెప్పారు. దీనిపై హళేబీడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఐపీసీ) సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది ఎండల తీవ్రత, రుతుపవనాలు ఆలస్యం కావడంతో టమాటా పంట దెబ్బతింది. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో టమాటాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. తొలుత ఎండల తీవ్రత, వర్షాలు సకాలం కరవకపోవడంతో పాటు ఇటీవల కాలంలో భారీ వర్షాలు పంటను దెబ్బతీశాయి. దీంతో టమాటా డిమాండ్, సప్లైకి మధ్య తేడా వచ్చింది. దీంతో రేట్లు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో టమాటా రేట్లు దిగి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది.
Karnataka | Farmer alleges tomatoes worth Rs 2.5 lakhs were stolen from her farm in the Hassan district on the night of July 4.
A woman farmer, Dharani who grew tomatoes on 2 acres of land said that they were planning to cut the crop and transport it to market as the price… pic.twitter.com/fTxcZIlcTr
— ANI (@ANI) July 6, 2023
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..