Tomatoes stolen: కర్ణాటకలో టమాటాల దొంగతనం.. కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato stolen: ఎప్పుడూ లేని విధంగా టమాటా రేట్లు పైపైకి వెళ్తున్నాయి. రాకెట్ వేగంతో టమాటా ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర సెంచరీని దాటింది. చాలా ప్రాంతాల్లో కిలో ధర రూ. 150కి పైగానే పలుకుతోంది. దీంతో సామాన్యుడు టమాటా కొనలేని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే పెరుగుతున్న ధర నేపథ్యంలో టమాటా దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో తోటలోని టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే జూలై 4వ తేదీ రాత్రి హసన్ జిల్లాలోని గోని సోమనహళ్లి గ్రామంలోని రూ. 2.5 లక్షల విలువై టమాటాలు చోరీకి గురయ్యాయని రైతు ఆరోపించాడు. బెంగళూర్ లో కిలో టమాటా రూ. 120కి చేరడంతో పంటను కోసి మార్కెట్ తరలించాలని యోచిస్తున్న సమయంలో తన 2 ఎకరాల్లోని టమాటాలను దొంగిలించారని మహిళా రైతు ధరణి తన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Read Also: NCP Poster War: ఎన్సీపీలో పోస్టర్ వార్.. శరద్ పవార్ బాహుబలి.. అజిత్ పవార్ కట్టప్ప
శనగ పంటతో భారీ నష్టాలు చవిచూసి టమాటా సాగు చేశామని.. పంటను పండించేందుకు అప్పులు చేశానమి.. మాకు మంచి పంట చేతికొచ్చే సమయానికి దొంగలు టమాటాలను ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 50-60 బస్తాల టమాటాను తీసుకెళ్లడమే కాకుండా.. మిగిలిన పంటను కూడా దొంగలు ధ్వంసం చేసినట్లు ధరణి చెప్పారు. దీనిపై హళేబీడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఐపీసీ) సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది ఎండల తీవ్రత, రుతుపవనాలు ఆలస్యం కావడంతో టమాటా పంట దెబ్బతింది. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో టమాటాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. తొలుత ఎండల తీవ్రత, వర్షాలు సకాలం కరవకపోవడంతో పాటు ఇటీవల కాలంలో భారీ వర్షాలు పంటను దెబ్బతీశాయి. దీంతో టమాటా డిమాండ్, సప్లైకి మధ్య తేడా వచ్చింది. దీంతో రేట్లు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో టమాటా రేట్లు దిగి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది.
Karnataka | Farmer alleges tomatoes worth Rs 2.5 lakhs were stolen from her farm in the Hassan district on the night of July 4.
A woman farmer, Dharani who grew tomatoes on 2 acres of land said that they were planning to cut the crop and transport it to market as the price… pic.twitter.com/fTxcZIlcTr
— ANI (@ANI) July 6, 2023
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!