Trump: నేడు ట్రంప్తో షెహజాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ భేటీ.. నిశితంగా పరిశీలిస్తున్న భారత్
- నేడు ట్రంప్తో షెహజాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ భేటీ
- నిశితంగా పరిశీలిస్తున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. యూఎన్ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. ఇక ట్రంప్ ఆహ్వానం మేరకు గురువారం వైట్హౌస్కు వెళ్లనున్నారు. ట్రంప్తో షెహబాజ్ షరీఫ్తో పాటు అసిమ్ మునీర్ కూడా హాజరు కావడంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ కూడా వైట్హౌస్కు రావడం ఇదే తొలిసారి. అయితే ఈ సమావేశం సాధారణ దౌత్య కార్యక్రమంగా చెబుతున్నా.. దీని వెనుక ఉద్దేశం మాత్రం వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump: యూఎన్లో కుట్ర జరిగింది.. కారకాల అరెస్ట్కు ట్రంప్ ఆదేశాలు
Also Read
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలోనే ఈ సమావేశం జరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మధ్య ముస్లిం దేశాలన్నీ ఇస్లామిక్ నాటోగా మారుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్-సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. మరిన్ని దేశాలను కూడా కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ను దగ్గర చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Ladakh Violence: లడఖ్ హింసపై కేంద్రం ప్రత్యేక దృష్టి.. కీలక సమాచారం సేకరణ!
ఇదిలా ఉంటే ఆప్ఘనిస్థాన్లో బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తాలిబాన్ల నుంచి తిరిగి తీసుకోవాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటికే ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సహకారాన్ని ట్రంప్ కోరవచ్చని సమాచారం. లాజిస్టిక్గా, దౌత్యపరంగా లేదా నిఘా భాగస్వామ్యంలో సహకరించాలని ఒత్తిడి కోరవచ్చు. ఇందుకోసమే పాక్ నేతలను ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అమెరికాకు పాకిస్థాన్ సహకరిస్తే మాత్రం శత్రువుగా భావించాల్సి ఉంటుందని ఇప్పటికే తాలిబాన్లు హెచ్చరించారు.
ఇక భారతదేశం అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. అనంతరం తన చొరవతోనే యుద్ధం ఆగిందని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. కానీ భారత్ మాత్రం ఖండిస్తోంది. పాకిస్థాన్ మాత్రం ట్రంప్ కారణంగానే యుద్ధం ఆగిందని చెబుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న షెహబాజ్ షరీఫ్ మరోసారి గుర్తుచేశారు. ట్రంప్ ప్రపంచ శాంతి కాముకుడు అంటూ అభివర్ణించారు. ఇక అసిమ్ మునీర్ మరో అడుగు ముందు కేసి గత పర్యటనలో ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి ప్రమోట్ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగే సమావేశంలో కూడా భారత్ ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అంశాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.
తాజావార్తలు
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!