Pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్పై ఎలాంటి వ్యతిరేకతను ప్రదర్శించాడో, జైషే మహ్మద్ ఉగ్రవాది చెప్పడం సంచలనంగా మారింది. ఆపరేషన్ సిందూర్ను ‘‘ఘజ్వా-ఎ-హింద్’’గా అభివర్ణించాడని జైష్ ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ అన్నాడు. ఈ పదాన్ని షరియా ద్వారా ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి సాయుధ పోరాటాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని రావల్కోట్లో ఉగ్రవాదుల సమావేశంలో కాశ్మీరీ అన్నారు.
Shahbaz Sharif: పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఐఎంఎఫ్, చైనా, అమెరికా, గల్ఫ్ దేశాల నుంచి అప్పులు కోరుతోంది. అప్పుల కోసం తాము ఎలా విదేశాలకు తిరుగుతున్నామనే విషయాన్ని సాక్షాత్తు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించిన వీడియో వైరల్గా మారింది. తాము విదేశాల్లో భిక్షాటన చేస్తున్నామనే విషయాన్ని పాక్ ప్రధాని అంగీకరించారు.
దావోస్ వేదికగా ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఏర్పాటైంది. ట్రంప్ అధ్యక్షతన ఈ శాంతి మండలి ఏర్పాటైంది. ఈ బోర్డులోకి 50 దేశాలను ఆహ్వానించగా.. 35 దేశాలు చేరాయి. ఇక దావోస్లో సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Asim Munir: ఇస్లాం పేరుపై ఏర్పడిన పాకిస్తాన్, ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో, ఇప్పుడు అది సాధించే దిశగా ఉన్నామని పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అన్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవడు జునైద్ సఫ్దర్ వలీమాకు హాజరైన bilwkh ఆయన పాక్ వార్తా పత్రిక ది న్యూస్ ఇంటర్నేషనల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, సీనియర్ సైనిక…
Pakistan: పాకిస్తాన్ సైన్యానికి చీఫ్గా మారిన తర్వాత అసిమ్ మునీర్ ప్రవేశపెట్టిన ‘‘డిఫెన్స్ డాక్ట్రిన్’’(రక్షణ సిద్ధాంతం) కీలక లక్ష్యాలను వెల్లడిస్తోంది. ముస్లిం దేశాలకు ‘‘పెద్దన్న’’గా వ్యవహరించాలని పాక్ తహతహలాడుతోంది. ఆయుధాల ఎగుమతి, వ్యూహాత్మక సంబంధాలు, ఒప్పందాలు, సైనిక శిక్షణా కార్యక్రమాల ద్వారా ముస్లిం దేశాలకు తానే సంరక్షకుడిని అనే భావన కలిగించాలని పాక్ ప్రయత్నిస్తోందని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతీయ బెదిరింపులు, అస్థిరత ఎదుర్కొంటున్న ముస్లిం దేశాలకు అణ్వాయుధ రక్షణను అందించాలని పాకిస్తాన్ భావిస్తోంది. ముస్లిం…
Pakistan: పాకిస్తాన్ రాజకీయ నేత, పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జమియత్ ఉలేమా ఇ ఇస్లాం నాయకుడు, సీనియర్ రాజకీయ నేత మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్, మునీర్ అరాచకాలపై నిప్పులు చెరిగారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులు నిర్వహించింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన సంఘటనను పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యానించిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ దైవిక సహాయం పొందినట్లుగా తెలిపాడు.
Pakistan: పాకిస్తాన్కు పెద్ద కష్టమే వచ్చింది. పాక్ కొత్త సైన్యాధిపతి అసిమ్ మునీర్కు ముందు నుయ్యి, వెనక గొయ్యిగా ఉంది పరిస్థితి. గాజాకు స్థిరీకరణ దళాలకు పాకిస్తా్న్ తన సైన్యాన్ని పంపించాలని అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఒక పాకిస్తాన్ తన సైన్యాన్ని గాజాకు పంపితే సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. పాక్ ప్రజలు అమెరికా, ఇజ్రాయిల్లను బద్ధ శత్రువుగా భావిస్తారు. పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తారు. ఒక వేళ తన సైన్యాన్ని పాక్ పంపించకపోతే అమెరికా…
ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్థాన్పై భారత్ ధ్వజమెత్తింది. ‘‘శాంతి కోసం నాయకత్వం’’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బహిరంగ చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ అనవసరం విషయాలు ప్రస్తావించింది.
Pakistan: పాకిస్తాన్లో అసిమ్ మునీర్ రాజ్యం నడుస్తోంది. పౌర ప్రభుత్వం ఉన్నప్పటికీ, అంతా మునీర్ కనుసన్నల్లోనే పాలన ఉంటోంది. ఇటీవల, పాక్ త్రివిధ దళాలకు అధిపతిగా ‘‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(సీడీఎఫ్)’’ పదవిని స్వీకరించారు. దీని తర్వాత, పాకిస్తాన్ అధ్యక్షుడికి సమానంగా,