India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి
- నౌక బోల్తా పడి సముద్రంలో మునిగిపోయింది
- నౌకలో ఉన్న మొత్తం 14 మంది సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యెమెన్ తీరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో భారత్కు చెందిన కార్గో నౌకపై ప్రాజెక్టైల్తో దాడి జరగడంతో నౌక బోల్తా పడి సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న మొత్తం 14 మంది సిబ్బందిని యెమెన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించింది. వారిలో 13 మంది భారతీయ నావికులు ఉన్నారు. రక్షించిన సిబ్బందిని మోఖా పోర్టుకు తరలించారు. భారత్కు చెందిన వాణిజ్య నౌక MSV Faize Noore Oliyaపై జరిగిన దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.
ఆగస్టు 4న యెమెన్ తీరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో నౌక మునిగిపోయిందని MEA వెల్లడించింది. నౌకలో ఉన్న 13 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు తెలిపింది. సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, నౌక సిబ్బంది భద్రత కోసం యెమెన్ అధికారులతో సమన్వయం చేస్తోందని MEA పేర్కొంది. సిబ్బందిని సురక్షితంగా రక్షించినందుకు యెమెన్ అధికారులకు భారత ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.
Also Read
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్పోల్కు కీలక అభ్యర్థన
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
వాణిజ్య నౌకలపై దాడులు ఆగాలి
ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై వరుసగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని MEA తెలిపింది. అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత, ఎలాంటి ఆటంకాలు లేని నౌకాయానం, వాణిజ్యం కొనసాగేందుకు పరిస్థితులను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని స్పష్టం చేసింది.
భారతీయ నావికుల భద్రతపై కేంద్రం దృష్టి
కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఘటనపై స్పందించారు. ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ నావికుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (DGMA)ను ఆదేశించినట్లు తెలిపారు. అన్ని సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ భారతీయ నావికుల భద్రతను నిర్ధారించాలని, రక్షించబడిన సిబ్బందికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.
సముద్ర భద్రతపై భారత్ ఆందోళన
వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతను కాపాడటంతో పాటు ప్రపంచ వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని పక్షాలు తమ అంతర్జాతీయ బాధ్యతలను పాటించాలని MEA పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని అమాయక పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే దాడులను భారత్ ఏమాత్రం అంగీకరించదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సముద్ర మార్గాల్లో నౌకాయానం స్వేచ్ఛ, అంతర్జాతీయ వాణిజ్యానికి పెరుగుతున్న ముప్పులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!