Jammu Kashmir Issue: జర్మనీ ప్రకటనపై భారత్ ఆగ్రహం.. మీ జోక్యం అవసరం లేదని స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
German intervention in the Kashmir issue is not necessary Says India: జమ్మూ కాశ్మీర్ అంశంపై జర్మనీ విదేశాంగ మంత్రి చేసి ప్రకటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ జోక్యం అవసరం లేదని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. కాశ్మీర్ పై జర్మనీ అనుసరిస్తున్న వైఖరిని తిరస్కరించింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ, జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి అన్నలెనా బేర్ బాక్ ఇద్దరు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాశ్మీర్ పరిస్థితికి సంబంధించి జర్మనీ పాత్ర, బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు అన్నలేనా బేర్ వాక్. ఈ ప్రాంతంలో శాంతియుత పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి కలుగుచేసుకోవాలని అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని తిరస్కరిస్తూ.. శనివారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదం, ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కీలక బాధ్యత పోషించాల్సిన అవసరం అంతర్జాతీయ సమాజానికి ఉందని.. భారత కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ దశాబ్ధాలుగా ఉగ్రవాదాన్ని భరించిందని.. ఇప్పటి వరకు అది కొనసాగుతుందని.. విదేశీ పౌరులు కూడా బాధితులుగా ఉన్నారని.. 26/11 ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులను యూఎన్ భద్రతా మండలి, ఎఫ్ఏటీఎఫ్ వెంబడిస్తోందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Read Also: Uttar Pradesh: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన మైనర్
జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలేనా బేర్ బాక్ మాట్లాడుతూ.. భుట్టో వివరించినట్లు ఉద్రిక్తతలు ఉన్నాయని.. మేము కాల్పుల విరమరణనను అనుసరించాలని పాకిస్తాన్ కు చెబుతున్నామని.. రాజకీయంగా చర్చించాలని భారత్ దేశాన్ని కోరుతున్నామని..ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతున్నామని అన్నారు. దీనిపై భారత్ స్పందింస్తూ.. ముందుగా పాకిస్తాన్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదం గురించి యూరోపియన్ దేశాలు ఆలోచించాలని.. జమ్మూకాశ్మీర్ అంశం ద్వైాపాక్షికంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మూడో దేశం అవసరం లేదని జర్మనీకి చెప్పకనే చెప్పింది. స్వార్థం, ఉదాసీనత వల్ల దేశాలు ఈ విషయాలను గుర్తించనప్పుడు అవి శాంతిని అణగదొక్కతాయని.. తీవ్రవాద బాధితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అరిందమ్ బాగ్చీ ప్రకటనలో పేర్కొన్నారు.
Our response to media queries on comments regarding Jammu and Kashmir during recent joint press conference of the Foreign Ministers of Germany and Pakistanhttps://t.co/sZZ88zfQVa pic.twitter.com/K3hqhLZbjM
— Randhir Jaiswal (@MEAIndia) October 8, 2022
తాజావార్తలు
-
Astrology: ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోని 3 రాశులు వీరేనా? ఫిక్స్ అయితే వెనక్కి తగ్గరట!
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!