Russia-Ukraine War: అదే జరిగితే అణుయుద్ధం తప్పుదు.. రష్యా మాజీ అధ్యక్షుడి హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్దం ప్రారంభం అయి 11 నెలలు గడుస్తోంది. వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది. అయినా కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. తప్పితే తగ్గడం లేదు. గతేడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ పై సైనిక చర్యను ప్రారంభించింది. అయితే సైనికపరంగా శక్తివంతమైన రష్యా ముందు ఉక్రెయిన్ వారం రోజుల్లో లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ.. పాశ్చాత్య దేశాలు, అమెరికా, నాటో కూటమి ఇచ్చే ఆర్థిక, సైనిక సహకారంతో ఉక్రెయిన్, రష్యాను ఎదురించి పోరాడుతోంది.
Read Also: Uorfi Javed: నిజాన్ని ఒప్పుకున్న ఉర్ఫీ జావేద్.. పాపులారిటీ కోసమే ఇదంతా
Also Read
- 1991 Hijack: విమానం హైజాక్ జరిగితే, నిద్ర పోయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని భుట్టో..
- Pakistan: ‘‘దౌత్యం కడుపు నింపదు’’.. పాక్ పరువు తీసిన సింగపూర్ దౌత్యవేత్త..
- Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
- Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
ఇదిలా ఉంటే ఈ యుద్ధం అణు యుద్ధంగా మారతుందని ప్రపంచం మొత్తం ఆందోళనలు నెలకొన్నాయి. పలు సందర్భాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణు హెచ్చరికలు చేశారు. ఇదిలా ఉంటే రష్యా మాజీ అధ్యక్షుడు, పుతిన్ కు అత్యంత సన్నిహితుడు డెమిత్రి మెద్వదేవ్ మరోసారి అణుహెచ్చరికలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోతే అణుయుద్ధం తప్పదని అన్నారు. సాంప్రాదాయ యుద్దంలో అణుశక్తిని ఓడిస్తే అణుయుద్ధానికి దారి తీయవచ్చని పేర్కొన్నారు. దీనిపై ఆయన టెలిగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు.
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో రష్యా, ఉక్రెయిన్ పై దాడిని తీవ్రతరం చేసింది. క్షిపణులతో విరుచుకుపడుతోంది. గత వారం క్షిపణి దాడిలో ఏకంగా 40 మంది మరణించారు. విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అమెరికాలో పర్యటించాడు. అమెరికా నుంచి సైనిక, ఆర్థిక సాయాలను కోరాడు. దీంతో అమెరికా తన పెట్రియాడ్ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ కు ఇస్తోంది. ఇదిలా ఉంటే బ్రిటన్ ఛాలెంజర్ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ కు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ రెండు ప్రకటనల తర్వాత రష్యా, ఉక్రెయిన్ పై దాడులు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని జపొరొజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది.
తాజావార్తలు
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
ట్రెండింగ్
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!