PM Sheikh Hasina: బంగ్లాదేశ్ని విభజించి క్రిస్టియన్ దేశం ఏర్పాటు చేయాలనే కుట్ర.. ఆ దేశం గురించేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ని విభజించి క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి కుట్ర పన్నుతున్నారని చెప్పారు. బంగ్లాదేశ్, మయన్మార్లోని కొన్ని భాగాలను విభజించి తూర్పు తైమూర్ తరహా క్రిస్టియన్ రాజ్యాన్ని సృష్టించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్లో ఒక విదేశానికి చెందిన ఎయిర్ బేస్కి అనుమతిస్తే జనవరి నెలలో ఎన్నికలు జరిగి మళ్లీ తాను ఎన్నికయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఆ దేశం పేరును మాత్రం ప్రకటించలేదు.
‘‘తూర్పు తైమూర్ దేశంలా బంగ్లాదేశ్(ఛటోగ్రామ్)లోని కొన్ని ప్రాంతాలు, మయన్మార్లోని కొన్ని ప్రాంతాలను కలిపి బంగాళాఖాతంలో ఒక స్థావరం కోసం ఒక క్రైస్తవ దేశాన్ని రూపొందిస్తారు’’ అని గురువారం జరిగిన ఓ సమావేశంలో ఆమె అన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ అధ్యక్షురాలిగా ఉన్న షేక్ హసీనా ఎన్నికల తర్వాత కూటమిలోని 14 పార్టీలతో తొలిసారి సమావేశమయ్యారు.
Also Read
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
Read Also: Rahul Gandhi: ‘‘అందుకే ప్రధాని మోడీని దేవుడు పంపాడు.’’ రాహుల్ గాంధీ సెటైర్లు..
ప్రాంతీయ సుస్థిరతకు భంగం కలిగించే ఎలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటామని షేక్ హసీనా ప్రతిజ్ఞ చేశారు మరియు అలాంటి కుట్రలను ఎదుర్కోవడానికి తాను నిశ్చయించుకున్నానని చెప్పారు. షేక్ హసీనా ఎలాంటి వివరాలు వెల్లడించకుండా ‘‘తెల్లవారి నుంచి ఆఫర్ వచ్చింది’’ అని చెప్పారు. ఇది ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించవచ్చు, కానీ అది కాదని, వారు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో నాకు తెలుసు అని ఆమె అన్నారు. తాను బంగ్లాదేశ్లో ఆ దేశం ఎయిర్ బేస్కి అనుమతించినట్లైతే నాకు ఎలాంటి సమస్య ఉండేది కాదని చెప్పారు.
ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బీఎన్పీ) ఎన్నికల ప్రక్రియకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని ఆమె ఆరోపించారు. అయితే, అమెరికాను లక్ష్యంగా చేసుకుని షేక్ హసీనా ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనుకుంటున్నారు. బంగ్లాదేశ్కి దక్షిణాన ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపంపై అమెరికా కన్నేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే 2023లో S డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్, సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని నియంత్రించడం గురించి యునైటెడ్ స్టేట్స్ ఎప్పుడూ చర్చించలేదని చెప్పారు.
తాజావార్తలు
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
-
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!