PM Sheikh Hasina: బంగ్లాదేశ్ని విభజించి క్రిస్టియన్ దేశం ఏర్పాటు చేయాలనే కుట్ర.. ఆ దేశం గురించేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ని విభజించి క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి కుట్ర పన్నుతున్నారని చెప్పారు. బంగ్లాదేశ్, మయన్మార్లోని కొన్ని భాగాలను విభజించి తూర్పు తైమూర్ తరహా క్రిస్టియన్ రాజ్యాన్ని సృష్టించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్లో ఒక విదేశానికి చెందిన ఎయిర్ బేస్కి అనుమతిస్తే జనవరి నెలలో ఎన్నికలు జరిగి మళ్లీ తాను ఎన్నికయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఆ దేశం పేరును మాత్రం ప్రకటించలేదు.
‘‘తూర్పు తైమూర్ దేశంలా బంగ్లాదేశ్(ఛటోగ్రామ్)లోని కొన్ని ప్రాంతాలు, మయన్మార్లోని కొన్ని ప్రాంతాలను కలిపి బంగాళాఖాతంలో ఒక స్థావరం కోసం ఒక క్రైస్తవ దేశాన్ని రూపొందిస్తారు’’ అని గురువారం జరిగిన ఓ సమావేశంలో ఆమె అన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ అధ్యక్షురాలిగా ఉన్న షేక్ హసీనా ఎన్నికల తర్వాత కూటమిలోని 14 పార్టీలతో తొలిసారి సమావేశమయ్యారు.
Also Read
- China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
Read Also: Rahul Gandhi: ‘‘అందుకే ప్రధాని మోడీని దేవుడు పంపాడు.’’ రాహుల్ గాంధీ సెటైర్లు..
ప్రాంతీయ సుస్థిరతకు భంగం కలిగించే ఎలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటామని షేక్ హసీనా ప్రతిజ్ఞ చేశారు మరియు అలాంటి కుట్రలను ఎదుర్కోవడానికి తాను నిశ్చయించుకున్నానని చెప్పారు. షేక్ హసీనా ఎలాంటి వివరాలు వెల్లడించకుండా ‘‘తెల్లవారి నుంచి ఆఫర్ వచ్చింది’’ అని చెప్పారు. ఇది ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించవచ్చు, కానీ అది కాదని, వారు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో నాకు తెలుసు అని ఆమె అన్నారు. తాను బంగ్లాదేశ్లో ఆ దేశం ఎయిర్ బేస్కి అనుమతించినట్లైతే నాకు ఎలాంటి సమస్య ఉండేది కాదని చెప్పారు.
ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బీఎన్పీ) ఎన్నికల ప్రక్రియకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని ఆమె ఆరోపించారు. అయితే, అమెరికాను లక్ష్యంగా చేసుకుని షేక్ హసీనా ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనుకుంటున్నారు. బంగ్లాదేశ్కి దక్షిణాన ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపంపై అమెరికా కన్నేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే 2023లో S డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్, సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని నియంత్రించడం గురించి యునైటెడ్ స్టేట్స్ ఎప్పుడూ చర్చించలేదని చెప్పారు.
తాజావార్తలు
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్కు స్టార్ ప్లేయర్ డౌటే!
-
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
-
Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
-
CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!