Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Panjshir Hand Overed By The Talibans With Help Of Pakisthan

పంజ్ షీర్ పై డ్రోన్లతో దాడి.. తాలిబన్ల వశం చేసిన పాకిస్తాన్

Published Date :September 6, 2021 , 12:18 pm
By Lakshmi Narayana
పంజ్ షీర్ పై డ్రోన్లతో దాడి.. తాలిబన్ల వశం చేసిన పాకిస్తాన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

అఫ్షనిస్తాన్ దేశం మొత్తం తాలిబన్ల వశం కాకుండా ఆపుతున్నది ఏదైనా ఉందంటే అది పంజ్ షీర్ మాత్రమే. ఇప్పటికే అప్ఘనిస్తాన్ అంతటినీ ఆక్రమించిన తాలిబన్లు పంజ్ షీర్ ను మాత్రం హస్తగతం చేసుకోలేకపోయారు. ఈక్రమంలోనే ఇరువర్గాల మధ్య పంజ్ షేర్లో భీకరపోరు నడుస్తోంది. అయితే పంజ్ షేర్ ను తాము పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటిస్తుండగా.. అదేమీ లేదని ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్, పంజ్‌షీర్ నాయకుడు మసూద్ ప్రకటించారు.

గత కొన్నిరోజులుగా తాలిబన్లను తమ భూభాగంలోకి రాకుండా అడ్డుకుంటున్న పంజ్ షీర్ సైన్యానికి ప్రపంచ దేశాల నుంచి ఏమాత్రం సహాయం లభించడం లేదు. ఇదే అదనుగా తాలిబన్లు ఆల్ ఖైదా, పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పంజ్ షేర్ పై దాడికి పాల్పడుతున్నారు. మూకుమ్మడిగా వీరంతా పంజ్ షేర్ పై పోరు చేస్తుండటంతో పంజ్ షేర్ సైన్యం క్రమంగా వీరులను కోల్పోవాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో తాజాగా తాలిబన్లు పంజ్ షేర్ లోయను స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ప్రకటించడం సంచలనంగా మారింది.

Also Read

  • Iran War: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
  • Pakistan: ట్రంప్‌ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
  • Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్‌తో సమావేశం
  • Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!

తాలిబన్లు పంజ్ షేర్ పై డ్రోన్లతో దాడి చేస్తుండటంతో రెసిస్టెంట్ ఫోర్స్ అలిసిపోతోంది. పంజ్ షేర్ సైన్యానికి సాయం అందించడంలో ప్రపంచ దేశాలు మొండికేస్తుండగా తాలిబన్లకు మాత్రం పాకిస్థాన్ బహిరంగగానే మద్దతు పలుకుతోంది. ఇన్నాళ్లు తాలిబన్లకు మేం సాయం చేయడం లేదని చెప్పిన దాయాది దేశం తాజాగా పంజ్ షేర్ కు డ్రోన్లను పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డ్రోన్లతో పంజ్ షేర్ సైన్యంపై దాడికి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో రెసిస్టెంట్స్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి ఫాహీమ్ దాస్తీ అమరుడైనట్లు వార్తలు వస్తున్నాయి.

తాలిబన్లతో కలిసి అధికారం పంచుకునేందుకు తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో దాస్తీ ఒకరు. యుద్ధంతో చిన్నాభిన్నామైన ప్రజలకు మంచి జీవితాలు అందించేందుకు తమ దళాలు చనిపోయేందుకు కూడా సిద్ధమేనని దాస్తీ ఒక సందర్భంలో వెల్లడించారు. గతంలోనూ ఈయన వెంట్రుకవాసిలో మృత్యువు నుంచి తప్పించుకున్నారు. 9/11దాడికి ముందు పంజ్ షేర్ నాయకుడు అహ్మద్ మసూద్ పై ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో మసూద్ తీవ్రంగా గాయపడి మృతిచెందారు. అయితే దాస్తీ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రస్తుతం పంజ్ షేర్ దళాలకు దాస్తీనే అధికార ప్రతినిధిగా ఉన్నారు. తరుచూ ఆయన సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూ ఎన్ఆర్ఎఫ్సీ దళాల సమాచారాన్ని మీడియాకు అందిస్తున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల ఛానల్ తో ఆయన మాట్లాడుతూ ‘మేం ప్రతిఘటిస్తూ మరణిస్తే.. అది మా విజయం అవుతుందని.. దేశం కోసం తుదిరక్తం చుక్క వరకు పోరాడిన యోధులుగా చరిత్రలో మా పేరు లిఖిస్తారు’ అంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన డ్రోన్ల దాడిలో దాస్తీతోపాటు అహ్మద్ షా మసూద్ మేనల్లుడు సాహిబ్ అబ్దుల్ వాదూద్ కూడా అమరులైనట్లు తెలుస్తోంది. తాము ఇద్దరు కీలక నాయకులను కోల్పోయినట్లు ఎన్ఆర్ఎఫ్ఏ ఫేస్ బుక్ పేజీలో ఆ దళవర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు అప్ఘన్లో యుద్దాన్ని ముగించాలని మతపెద్దలు ఇచ్చిన పిలుపునకు పంజ్ షేర్ దళాలు సానుకూలంగా స్పందించాయి. ‘ప్రస్తుత సమస్యను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధమేనని సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని.. తక్షణమే తాలిబన్లు పోరాటాన్ని నిలపివేసి చర్చలు జరుపాలని’ పంజ్ షేర్ అధినేత మసూద్ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. అయితే మతపెద్దల సూచనలపై తాలిబన్లు వెంటనే స్పందించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా పంజ్ షేర్ దళాలకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా విద్యుత్, టెలిఫోన్, కరెంట్, ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేస్తున్నారు. దీంతో తాలిబన్లు ఏకపక్షంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Afghanistan Crisis
  • Pakistan
  • PanjShir
  • thalibans

తాజావార్తలు

  • Tollywood : బీస్ట్ మోడ్‌లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్

  • Iran War: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..

  • Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం

  • IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..

  • Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్‌పై ప్రముఖ సంస్థ మౌనం..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions