Facebook Post: సిల్లీ పోస్ట్ పెట్టాడు.. పోలీసులు అతని సరదా తీర్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani Man Arrested Over Fake Social Media Post About UK Woman: ఈమధ్య క్రాస్-బార్డర్ లవ్ స్టోరీలు ఎక్కువగా వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తుల్ని పెళ్లాడటం కోసం ప్రేమికులు హద్దులు దాటేస్తున్నారు. సీమా-సచిన్, అంజు-నస్రుల్లా వ్యవహారాలైతే.. ఇప్పటికీ హాట్ టాపిక్గానే ఉన్నాయి. ఈ రెండు జంటలు బాగా ఫేమస్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. తనకూ పాపులారిటీ వస్తుందన్న ఉద్దేశంతో ఓ వ్యక్తి సిల్లీ పోస్టు పెట్టాడు. ఈ పోస్టుని సీరియస్గా తీసుకున్న పోలీసులు.. చివరికి అది ఫేక్ అని తేలడంతో, అతని సరదా తీర్చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Telangana Cabinet: కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.. వివిధ అంశాలపై చర్చ
Also Read
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు చెందిన మహమ్మద్ గులాబ్ అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో క్రాస్-బార్డర్ ప్రేమపై సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన పాక్ యువకుడితో కలిసి జీవితాంతం ఉండేందుకు ‘ఇలా’ అనే ఒక బ్రిటీష్ మహిళ సలార్జైకు వచ్చిందని ఆ పోస్టులో పేర్కొన్నాడు. అది వైరల్ అవ్వడంతో.. పోలీసుల దృష్టికి చేరింది. దీంతో.. పోలీసులు అప్రమత్తమై, ఆ వ్యక్తి ఆ పోస్టులో పేర్కొన్న చిరునామాకు వెళ్లి పరిశీలించారు. అతడు చెప్పినట్టు అక్కడ ఎవరూ లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో కోపాద్రిక్తులైన పోలీసులు.. ఈ ఫేక్ పోస్టు క్రియేట్ చేసిన ముహమ్మద్ గులాబ్పై కేసు నమోదు చేశారు. అతడు ఎక్కడున్నాడో ఆచూకీ కనుగొని, అరెస్ట్ చేశారు.
Gun Firing: అమెరికాలో మరోసారి పేలిక తుపాకీ.. ఇద్దరు మృతి
అయితే.. స్థానికులు మాత్రం మహమ్మద్ గులాబ్ అరెస్ట్ని వ్యతిరేకించారు. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు సర్వసాధారణం అయిపోయాయని, ఈమాత్రం దానికే అరెస్ట్ చేస్తారా? అని వాళ్లు వాదిస్తున్నారు. సరిహద్దులు దాటుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా.. పోస్టు పెట్టిన వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని మండిపడుతున్నారు. కాగా.. అంజు-నస్రుల్లా వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో, అక్కడి అధికారులు అప్రమత్తగా ఉన్నారు. అందుకే, ఈ ఫేక్ పోస్టుని చాలా సీరియస్గా తీసుకున్నారు.
తాజావార్తలు
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
-
IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
-
Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
-
Ducati 2026 Multistrada V4 Rally: భారత్లో విడుదలైన డుకాటి 2026 మల్టీస్ట్రాడా V4 ర్యాలీ.. ధర రూ. 32 లక్షలు
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..