Pakistan: ఆర్థిక ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. ఉద్యోగుల జీతాల్లో కోతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Takes Cost-Cutting Measures To Address Financial Emergency: దాయాది దేశం పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మరో శ్రీలంకలా తయారయ్యేందుకు సిద్ధంగా ఉంది పాకిస్తాన్. దీంతో ఈ పరిస్థితి నుంచి గట్టేక్కేందుకు పాక్ సర్కార్ నానా కష్టాలు పడుతోంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది. ప్రభుత్వ వాహనాలకు ఇంధనాన్ని రేషన్ ఇవ్వడంతో పాటు అధికారిక ప్రయాణాలపై ఆంక్షలు విధించబోతోంది. లీవ్ క్యాష్ మెంట్ నిలిపివేయడంతో పాటు మెడికల్ బిల్లల చెల్లింపులు, అలవెన్స్ లను తొలగించడం వంటి చర్యలను తీసుకోబోతోంది.
Read Also: BIG Breaking: నిర్మలా సీతారామన్కు అస్వస్థత.. ఎయిమ్స్లో చేరిక!
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
పాకిస్తాన్ క్యాబినెట్ సెక్రటేరియట్ ఇటీవల దీనికోసం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. తీవ్రమైన నిధుల కొరత వల్ల కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ వాహనాలకు నెలకు 120 లీటర్ల కంటె ఎక్కువ ఇంధనం ఇవ్వకూడదని.. అధికారిక పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులకు వారి గ్రేడ్ ప్రకారం రెండు డీఏలు మాత్రమే ఇవ్వాలని.. ఒక డీఏ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. 17-21 గ్రేడ్లకి చెందిన రెగ్యులర్ ఉద్యోగులందరికీ ఎన్క్యాష్మెంట్ వెంటనే నిలిపివేయనున్నారు. ఉద్యోగుల జీతాల నుంచి 25 శాతం కన్నా ఎక్కువ ఉన్న అన్ని అలవెన్సులను తొలగించనుంది. ఆర్థిక కష్టాలు తగ్గేవరకు ఉద్యోగులకు ఎలాంటి మెడికల్ బిల్లలు ఇవ్వబోవడం లేదని తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉద్యోగుల వేతనాల నుంచి 50 శాతం జీతం కోత విధిస్తామని తెలిపింది.
పాకిస్తాన్ గత కొన్ని నెలల నుంచి తీవ్ర ద్రవ్యోల్బనంతో ఇబ్బంది పడుతోంది. దీంతో పాటు ఇంధన కొరత కూడా ఆ దేశాన్ని వేధిస్తోంది. విదేశాలకు అప్పులు చెల్లించాలన్నా..పాక్ వద్ద విదేశీమారక ధనం లేదు. ఇక జాతీయ భద్రతతో పాటు, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కోంటోంది. పాక్ రూపాయి దినదినం పడిపోతోంది. ఈ పరిణామాలతో తక్షణమే ఆర్థిక చర్యలు తీసుకోకుంటే మరో శ్రీలంక కావడం ఖాయం అని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?