Pakistan: ఆర్థిక ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. ఉద్యోగుల జీతాల్లో కోతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Takes Cost-Cutting Measures To Address Financial Emergency: దాయాది దేశం పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మరో శ్రీలంకలా తయారయ్యేందుకు సిద్ధంగా ఉంది పాకిస్తాన్. దీంతో ఈ పరిస్థితి నుంచి గట్టేక్కేందుకు పాక్ సర్కార్ నానా కష్టాలు పడుతోంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది. ప్రభుత్వ వాహనాలకు ఇంధనాన్ని రేషన్ ఇవ్వడంతో పాటు అధికారిక ప్రయాణాలపై ఆంక్షలు విధించబోతోంది. లీవ్ క్యాష్ మెంట్ నిలిపివేయడంతో పాటు మెడికల్ బిల్లల చెల్లింపులు, అలవెన్స్ లను తొలగించడం వంటి చర్యలను తీసుకోబోతోంది.
Read Also: BIG Breaking: నిర్మలా సీతారామన్కు అస్వస్థత.. ఎయిమ్స్లో చేరిక!
Also Read
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్వర్క్పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
పాకిస్తాన్ క్యాబినెట్ సెక్రటేరియట్ ఇటీవల దీనికోసం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. తీవ్రమైన నిధుల కొరత వల్ల కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ వాహనాలకు నెలకు 120 లీటర్ల కంటె ఎక్కువ ఇంధనం ఇవ్వకూడదని.. అధికారిక పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులకు వారి గ్రేడ్ ప్రకారం రెండు డీఏలు మాత్రమే ఇవ్వాలని.. ఒక డీఏ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. 17-21 గ్రేడ్లకి చెందిన రెగ్యులర్ ఉద్యోగులందరికీ ఎన్క్యాష్మెంట్ వెంటనే నిలిపివేయనున్నారు. ఉద్యోగుల జీతాల నుంచి 25 శాతం కన్నా ఎక్కువ ఉన్న అన్ని అలవెన్సులను తొలగించనుంది. ఆర్థిక కష్టాలు తగ్గేవరకు ఉద్యోగులకు ఎలాంటి మెడికల్ బిల్లలు ఇవ్వబోవడం లేదని తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉద్యోగుల వేతనాల నుంచి 50 శాతం జీతం కోత విధిస్తామని తెలిపింది.
పాకిస్తాన్ గత కొన్ని నెలల నుంచి తీవ్ర ద్రవ్యోల్బనంతో ఇబ్బంది పడుతోంది. దీంతో పాటు ఇంధన కొరత కూడా ఆ దేశాన్ని వేధిస్తోంది. విదేశాలకు అప్పులు చెల్లించాలన్నా..పాక్ వద్ద విదేశీమారక ధనం లేదు. ఇక జాతీయ భద్రతతో పాటు, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కోంటోంది. పాక్ రూపాయి దినదినం పడిపోతోంది. ఈ పరిణామాలతో తక్షణమే ఆర్థిక చర్యలు తీసుకోకుంటే మరో శ్రీలంక కావడం ఖాయం అని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!