Shehbaz Sharif: ఎస్సీవోలో మోడీ ప్రసంగం తర్వాత పాక్ ప్రధాని వింతైన ప్రసంగం
- ఎస్సీవోలో మోడీ ప్రసంగం తర్వాత పాక్ ప్రధాని వింతైన ప్రసంగం
- ఉగ్రవాదంపై అర్థరహిత వ్యాఖ్యలు
చైనా వేదికగా షాంఘై సహకార సదస్సులో ఉగ్రవాదంపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ఉగ్రవాదంపై కొన్ని దేశాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని.. దీంతో మానవాళి మనుగడకు ప్రమాదమని ప్రధాని మోడీ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: PM Modi: చనిపోయిన నా తల్లిపై దుర్భాషలా? కాంగ్రెస్, ఆర్జేడీపై మోడీ ఆగ్రహం
Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
అనంతరం ఎస్సీవో సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వింతైన ప్రసంగం చేశారు. ఉగ్రదాడులకు తమ దేశం బాధిత దేశమని వ్యాఖ్యానించారు. తమ దేశం 90,000 మందికి పైగా ప్రాణాలను కోల్పోయిందని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో 152 బిలియన్లకు పైగా ఆర్థిక నష్టాలను చూసిందని తెలిపారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన ఉగ్రవాద దాడుల వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు బందీ సంఘటనను గుర్తుచేశారు. పాకిస్థాన్ అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండిస్తుందన్నారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ద్వైపాక్షిక ఒప్పందాలను తాము గౌరవిస్తామని పేర్కొన్నారు. అలాగే ఎస్సీవో సభ్యులు కూడా ఇలాంటి సూత్రాలను అనుసరించాలని ఆశిస్తున్నట్లు షరీఫ్ అన్నారు. మోడీ ప్రసంగం తర్వాత షరీఫ్ ప్రసంగం అర్థరహితంగా మారింది.
ఇది కూడా చదవండి: PM Modi: ఆర్థిక స్వార్థం వల్ల ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటాం.. ట్రంప్ టారిఫ్లపై మోడీ ధ్వజం
కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఆమోదయోగ్యమేనా? అని మోడీ ప్రశ్నించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు సహించబోమని స్పష్టంగా చెప్పాలని మోడీ డిమాండ్ చేశారు.నాలుగు దశాబ్దాలుగా భారతదేశం ఉగ్రవాదాన్ని భరిస్తోందని.. పహల్గామ్ ఉగ్రదాడిని మానవత్వాన్ని నమ్మే అన్ని దేశాలు ఖండించాలన్నారు. దీనిపై ఎస్సీవో సభ్యులంతా ఐక్యంగా ఉండాలని మోడీ కోరారు. మోడీ ప్రసంగ సమయంలో షరీఫ్ అక్కడే ఉన్నారు.
తాజావార్తలు
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!