Shehbaz Sharif: ఎస్సీవోలో మోడీ ప్రసంగం తర్వాత పాక్ ప్రధాని వింతైన ప్రసంగం
- ఎస్సీవోలో మోడీ ప్రసంగం తర్వాత పాక్ ప్రధాని వింతైన ప్రసంగం
- ఉగ్రవాదంపై అర్థరహిత వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా వేదికగా షాంఘై సహకార సదస్సులో ఉగ్రవాదంపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ఉగ్రవాదంపై కొన్ని దేశాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని.. దీంతో మానవాళి మనుగడకు ప్రమాదమని ప్రధాని మోడీ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: PM Modi: చనిపోయిన నా తల్లిపై దుర్భాషలా? కాంగ్రెస్, ఆర్జేడీపై మోడీ ఆగ్రహం
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
అనంతరం ఎస్సీవో సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వింతైన ప్రసంగం చేశారు. ఉగ్రదాడులకు తమ దేశం బాధిత దేశమని వ్యాఖ్యానించారు. తమ దేశం 90,000 మందికి పైగా ప్రాణాలను కోల్పోయిందని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో 152 బిలియన్లకు పైగా ఆర్థిక నష్టాలను చూసిందని తెలిపారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన ఉగ్రవాద దాడుల వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు బందీ సంఘటనను గుర్తుచేశారు. పాకిస్థాన్ అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండిస్తుందన్నారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ద్వైపాక్షిక ఒప్పందాలను తాము గౌరవిస్తామని పేర్కొన్నారు. అలాగే ఎస్సీవో సభ్యులు కూడా ఇలాంటి సూత్రాలను అనుసరించాలని ఆశిస్తున్నట్లు షరీఫ్ అన్నారు. మోడీ ప్రసంగం తర్వాత షరీఫ్ ప్రసంగం అర్థరహితంగా మారింది.
ఇది కూడా చదవండి: PM Modi: ఆర్థిక స్వార్థం వల్ల ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటాం.. ట్రంప్ టారిఫ్లపై మోడీ ధ్వజం
కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఆమోదయోగ్యమేనా? అని మోడీ ప్రశ్నించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు సహించబోమని స్పష్టంగా చెప్పాలని మోడీ డిమాండ్ చేశారు.నాలుగు దశాబ్దాలుగా భారతదేశం ఉగ్రవాదాన్ని భరిస్తోందని.. పహల్గామ్ ఉగ్రదాడిని మానవత్వాన్ని నమ్మే అన్ని దేశాలు ఖండించాలన్నారు. దీనిపై ఎస్సీవో సభ్యులంతా ఐక్యంగా ఉండాలని మోడీ కోరారు. మోడీ ప్రసంగ సమయంలో షరీఫ్ అక్కడే ఉన్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!