PM Modi: చనిపోయిన నా తల్లిపై దుర్భాషలా? కాంగ్రెస్, ఆర్జేడీపై మోడీ ఆగ్రహం
- చనిపోయిన నా తల్లిపై దుర్భాషలా?
- కాంగ్రెస్, ఆర్జేడీపై మోడీ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చనిపోయిన తన తల్లిపై కాంగ్రెస్, ఆర్జేడీ దుర్భాషలాడిందని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. తన తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని.. అయినా కూడా తన తల్లిని దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ రాజ్య జీవితా నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్ను మోడీ ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్సింగ్లో దాదాపు 20 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: Azerbaijan: మా మద్దతు పాకిస్థాన్కే.. భారత్పై అజర్బైజాన్ అధ్యక్షుడు విమర్శలు
Also Read
తన తల్లిపై కాంగ్రెస్, ఆర్జేడీ ఉపయోగించిన వ్యాఖ్యలు.. ‘‘నా తల్లినే కాదు.. దేశంలో ఉన్న ప్రతి తల్లిని.. సోదరిని అవమానించారు.’’ అని తెలిపారు. తన తల్లిని గురించి మాట్లాడిన మాటలు వింటే.. తనలాగే మీరు కూడా బాధపడతారని తనకు తెలుసు అన్నారు. కుటుంబాన్ని పోషించడానికి తన తల్లి హీరాబెన్ ఎంతో కష్టపడిందని గుర్తుచేశారు. తనను, తన తోబుట్టువులందరినీ పెంచడానికి పేదిరకంతో పోరాడిందని జ్ఞాపకం చేశారు. తన తల్లి ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేదని.. అయినా కుటుంబ పోషణ కొరకు నిత్యం పని చేస్తూనే ఉండేదని పేర్కొన్నారు. మా బట్టల కోసం ప్రతి పైసాను ఆదా చేసేదన్నారు. దేశంలో అలాంటి తల్లులు కోట్లాది మంది ఉన్నారని చెప్పారు. దేవతల కంటే తల్లి స్థానం గొప్పదని కొనియాడారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఆర్థిక స్వార్థం వల్ల ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటాం.. ట్రంప్ టారిఫ్లపై మోడీ ధ్వజం
రాజకుటుంబంలో జన్మించిన యువరాజులు పేద తల్లి బాధను.. ఆమె కొడుకు పోరాటాలను అర్థం చేసుకోరన్నారు. వాళ్లంతా బంగారం, వెండి చెంచాతో జన్మించారని.. మళ్లీ రాజరికం కోసమే బీహార్లో అధికారం కోరుతున్నారని విమర్శించారు. మీరంతా పేద తల్లిని, కొడుకును ఆశీర్వదించి ప్రధాన సేవకునిగా చేశారని మోడీ పేర్కొన్నారు. మహిళా వ్యవస్థాపకులకు సులభంగా నిధులు అందించడానికే బీహార్ రాజ్య జీవితా నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్ను ప్రారంభించినట్లు మోడీ తెలిపారు.
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్త.. మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది పెద్ద దుమారం రేపింది. బీజేపీ అగ్ర నేతలంతా ఖండించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా పాట్నాలో కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు.
తాజావార్తలు
-
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
-
Alexander Zverev: జ్వెరెవ్కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫ్రెంచ్ ఓపెన్లో కోబోలీపై విజయం
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!